Adani Capital IPO : ఆదానీ గ్రూప్ నుంచి మార్కెట్లోకి మరో ఐపీఓ!
Adani Capital IPO : అదానీ గ్రూప్నకు చెందిన అదానీ క్యాపిటల్ ఐపీఓగా మార్కెట్లోకి రానుంది! 2024 తొలినాళ్లల్లో.. ఈ ఐపీఓను తీసుకొచ్చేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది.
Adani Capital IPO news : అదానీ- విల్మర్ తర్వాత.. అందానీ గ్రూప్లోని మరో విభాగాన్ని ఐపీఓగా మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఆసియాలోనే అపర కుబేరుడైన గౌతమ్ అదానీ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. అదానీ గ్రూప్నకు చెందిన ఎన్బీఎఫ్సీ విభాగం.. 'అదానీ క్యాపిటల్'ను ఐపీఓగా తీసుకొచ్చి.. రూ. 1,500కోట్లను సమీకరించాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.
ట్రెండింగ్ వార్తలు
10శాతం వాటా ఐపీఓకు వెళ్లే అవకాశం ఉందని అదానీ క్యాపిటల్ సీఈఓ గౌరవ్ గుప్తా వెల్లడించారు. దాని వాల్యుయేషన్ 2బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా వేశారు. 2024 తొలినాళ్లల్లో ఆదానీ క్యాపిటల్ ఐపీఓ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని బ్లూమ్బర్గ తన నివేదికలో పేర్కొంది.
ఎనిమిది రాష్ట్రాల్లో.. అదానీ క్యాపిటల్కు చెందిన 154 బ్రాంచీలు ఉన్నాయి. 60,000మంది రుణగ్రహీతలు ఉన్నారు. 30బిలియన్ డాలర్ల రుణాలను అదానీ క్యాపిటల్ నిర్వహిస్తోంది. సంస్థ ఎన్పీఏ 1శాతంగా ఉంది. ఈ వివరాలను.. గౌరవ్ గుప్తా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రతి యేటా.. లోన్ బుక్ను రెట్టింపు చేయడమే తన ప్రణాళిక అని అన్నారు.
2017 ఏప్రిల్లో అదానీ గ్రూప్.. అదానీ క్యాపిటల్ ద్వారా.. ఎన్బీఎఫ్సీ విభాగంలోకి అడుగుపెట్టింది. రిటైల్, గ్రామీణ ఆర్థికాల విభాగంపై దృష్టిపెట్టింది. వ్యవసాయానికి సంబంధించిన కార్యకలాపాలకు ఎక్కువగా రుణాలు ఇస్తూ ఉంటుంది. ఎంఎస్ఎంఈ వ్యాపారాలకు సైతం రుణాలు ఇస్తుంది.
ప్రస్తుతం గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో సంస్థకు చెందిన విస్తరణ ప్రణాళికలు అమల్లో ఉన్నాయి.
సంబంధిత కథనం
టాపిక్