Samruddhi Expressway : 6 నెలలు.. 616 రోడ్డు ప్రమాదాలు.. 88 మరణాలు- ఈ ఎక్స్​ప్రెస్​వేతో జాగ్రత్త!-88 people killed in accidents on samruddhi expressway since december 2022 maha official ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Samruddhi Expressway : 6 నెలలు.. 616 రోడ్డు ప్రమాదాలు.. 88 మరణాలు- ఈ ఎక్స్​ప్రెస్​వేతో జాగ్రత్త!

Samruddhi Expressway : 6 నెలలు.. 616 రోడ్డు ప్రమాదాలు.. 88 మరణాలు- ఈ ఎక్స్​ప్రెస్​వేతో జాగ్రత్త!

Sharath Chitturi HT Telugu
Jul 02, 2023 11:57 AM IST

Samruddhi Expressway accident : నాగ్​పూర్​- ముంబై సమృద్ధి ఎక్స్​ప్రెస్​ను గతేడాది డిసెంబర్​లో పాక్షికంగాా ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 88మంది మరణించారు.

6 నెలలు.. 88 మరణాలు- ఈ ఎక్స్​ప్రెస్​వేతో జాగ్రత్త!
6 నెలలు.. 88 మరణాలు- ఈ ఎక్స్​ప్రెస్​వేతో జాగ్రత్త! (AFP)

Samruddhi Expressway bus accident : మహారాష్ట్ర సమృద్ధి ఎక్స్​ప్రెస్​వే రోడ్లు నెత్తురోడుతున్నాయి! ఆరు నెలల వ్యవధిలో 88మంది ఈ నాగ్​పూర్​- ముంబై ఎక్స్​ప్రెస్​వేపై ప్రాణాలు వీడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ 88మందిలో 25మంది.. శనివారం జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

yearly horoscope entry point

కారణాలు ఏంటి..?

701 కి.మీల నాగ్​పూర్​ ముంబై సమృద్ధి ఎక్స్​ప్రెస్​ మహామార్గ్​ను గతేడాది డిసెంబర్​లో పాక్షికంగా ఓపెన్​ చేశారు. ప్రస్తుతం నాగ్​పూర్​- నాసిక్​లోని భర్విర్​ వరకు 601కి.మీల ఎక్స్​ప్రెస్​వే మాత్రమే అందుబాటులో ఉంది.

గతేడాది డిసెంబర్​ నుంచి ఇప్పటివరకు ఈ ఎక్స్​ప్రెస్​వేపై ఏకంగా 616 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిల్లో 39 అత్యంత ఘోర ప్రమాదాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద 88మంది ప్రాణాలు కోల్పోగా.. 656మంది స్వల్పంగా/ తీవ్రంగా గాయపడిన వారు ఉన్నారు.

Samruddhi Expressway accidents : ప్రమాదాల్లో ఎక్కువగా రోడ్​ హిప్నోసిస్​ ఘటనలు వెలుగులోకి వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. హైవే/ రోడ్​ హిప్నోసిస్​ అంటే.. ప్రమాదం జరిగిన సమయంలో ఏం జరిగిందో డ్రైవర్​కు గుర్తుండకపోవడం. మరోవైపు ఓవర్​ స్పీడింగ్​, డ్రైవర్లు నిద్రపోవడం, వీల్​/ టైర్​ పేలిపోవడం వంటి కారణాలతో సమృద్ధి ఎక్స్​ప్రెస్​వేపై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.

రోడ్డు ప్రమాదాల సమస్యను ఎదుర్కొనేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నట్టు మహారాష్ట్ర అధికారులు వెల్లడించారు. హైవే పోలీస్​ వ్యవస్థ నిత్యం అప్రమత్తంగా ఉంటోందని వివరించారు.

ఇదీ చూడండి:- Maharashtra bus crash: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం; 25 మంది సజీవ దహనం; ఫొటోలు

శనివారం జరిగిన ప్రమాదం వివరాలు..

ఇదే సమృద్ధి ఎక్స్​ప్రెస్​వేపై.. శనివారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బుల్దానా జిల్లాలో ఎక్స్​ప్రెస్​వేపై వెళుతుండగా అనూహ్యంగా ఓ బస్సు టైర్​ పగిలింది. బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న డివైడర్​ను ఢీకొట్టి ఒక పక్కకు బోల్తా కొట్టింది. ఆ వెంటనే బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. డోర్​ మూసుకుపోవడం, చాలా మంది ప్రయాణికులు నిద్రపోతుండటంతో ప్రమాదం తీవ్రత ఎక్కువైంది. కొందరు ఎలాగో అలా తప్పించుకున్నారు. కానీ 25మంది అగ్నికి ఆహుతైపోయారు. ప్రమాదం నుంచి డ్రైవర్​ బయటపడ్డాడు.

Nagpur Mumbai Samruddhi express Mahamarg : బస్సు మంటల్లో కాలిపోతున్న సమయంలో అనేక వాహనాలు తమ పక్క నుంచి వెళ్లిపోయాయని, తమకు సాయం చేయలేదని ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు చెప్పారు.

దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఆత్యంత ఆందోళన కలిగించే విషయం. ముఖ్యంగా మహారాష్ట్రలో 2022లో 15,224 మంది రోడ్డు ప్రమాదాలకు బలైయ్యారు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.