6year old boy sacrificed : ఆరేళ్ల బాలుడి హత్య.. 'బాబాకు త్యాగం' నెపంతో దారుణం!-6yrold sacrificed by two men in delhi to propitiate deity ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  6-yr-old Sacrificed By Two Men In Delhi To Propitiate Deity

6year old boy sacrificed : ఆరేళ్ల బాలుడి హత్య.. 'బాబాకు త్యాగం' నెపంతో దారుణం!

Sharath Chitturi HT Telugu
Oct 02, 2022 05:00 PM IST

6year old boy killed : ఢిల్లీలో మరో దారుణం జరిగింది. ఓ 6ఏళ్ల బాలుడి ఇద్దరు గొంతు కోసి చంపేశారు. బాబాకు త్యాగం ఇచ్చామని పోలీసులకు చెప్పారు. అసలేం జరిగిందంటే…

ఆరేళ్ల బాలుడి హత్య.. 'బాబాకు త్యాగం' నెపంతో దారుణం
ఆరేళ్ల బాలుడి హత్య.. 'బాబాకు త్యాగం' నెపంతో దారుణం

Delhi crime news : ఢిల్లీలో మరో దారణ ఘటన వెలుగులోకి వచ్చింది. లోధా కాలెనీలో నిర్మాణంలో ఉన్న ఓ సీఆర్​పీఎఫ్​ కార్యాలయానికి సమీపంలో ఓ బాలుడి మృతదేహం లభించింది. నవరాత్రుల నేపథ్యంలో.. దేవుడికి ప్రసన్నం చేసుకునేందుకు నిందితులు ఈ హత్యకు పాల్పడ్డారు!

ట్రెండింగ్ వార్తలు

ఇదీ జరిగింది..

ఉత్తర్​ప్రదేశ్​ బరేలీ నుంచి వచ్చిన ఓ కుటుంబం.. సీఆర్​పీఎఫ్​ ప్రధాన కార్యాలయం నిర్మాణంలో పనికి చేరింది. వారికి ఓ ఆరేళ్ల బిడ్డ ఉన్నాడు.

కాగా.. శనివారం అర్ధరాత్రి 12:40 గంటల సమయంలో.. భవనానికి సమీపంలో ఓ బాలుడి మృతదేహాన్ని కూలీలు గుర్తించారు. అతడి గొంతు కోసేసి ఉండటంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. అటుగా వెళుతున్న నిందితులను వారందరు పట్టుకున్నారు. మరణించింది.. తమ బిడ్డే అని తెలిసి.. ఆ వలస కుటుంబం విలపించింది.

6year old boy sacrificed in Delhi : ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితులను పట్టుకుని అరెస్ట్​ చేశారు. విచారణలో భాగంగా నిందితులు.. బిహార్​కి చెందిన 23ఏళ్ల విజయ్​ కుమార్​, 21ఏళ్ల అమర్​ కుమార్​.. నిజాన్ని ఒప్పుకున్నారు.

"నిందితులు ఇద్దరు కలిసి గంజా కొట్టేవారు. వారు కూడా భవన నిర్మాణంలో పనిచేసిన కూలీలే. గంజా కొడుతున్న వారిద్దరని స్థానికులు మందలించారు. దాంతో వారిద్దరు కోపం పెంచుకున్నారు. ఇక తన కలలోకి భోలే బాబా వచ్చాడని, ఓ బాలుడి మెడ కోసేయాలని ఆదేశించినట్టు నిందితుల్లో ఒకడు చెప్పాడు. ఈ క్రమంలోనే 6ఏళ్ల బాలుడిని చంపేశారు. అలా చేస్తే శాంతి జరుగుతుందని వారు భావిస్తున్నారు," అని పోలీసులు వెల్లడించారు.

శనివారం రాత్రి.. బాలుడు తన షెడ్డుకు వెళుతుండగా.. అతడిని ఆ ఇద్దరు పిలిపించారు. వారిద్దరు ముందే తెలుసు కాబట్టి.. బలవంతం లేకుండానే వారి వద్దకు వెళ్లాడు బాధితుడు. ఈ క్రమంలోనే అతడిని చంపేశారు.

బాధితుడి కుటుంబసభ్యలు.. నిందితులపై తీవ్ర ఆరోపణలు చేశారు. దుర్గా పూజల వేళ త్యాగాలు చేస్తే.. శాంతి లభిస్తుందని ఆ ఇద్దరు తరచూ మాట్లాడేవారని ఆరోపించారు.

ఘటనపై దర్యాప్తు చేపడతామని పోలీసులు వెల్లడించారు.

WhatsApp channel

సంబంధిత కథనం