6year old boy sacrificed : ఆరేళ్ల బాలుడి హత్య.. 'బాబాకు త్యాగం' నెపంతో దారుణం!
6year old boy killed : ఢిల్లీలో మరో దారుణం జరిగింది. ఓ 6ఏళ్ల బాలుడి ఇద్దరు గొంతు కోసి చంపేశారు. బాబాకు త్యాగం ఇచ్చామని పోలీసులకు చెప్పారు. అసలేం జరిగిందంటే…
Delhi crime news : ఢిల్లీలో మరో దారణ ఘటన వెలుగులోకి వచ్చింది. లోధా కాలెనీలో నిర్మాణంలో ఉన్న ఓ సీఆర్పీఎఫ్ కార్యాలయానికి సమీపంలో ఓ బాలుడి మృతదేహం లభించింది. నవరాత్రుల నేపథ్యంలో.. దేవుడికి ప్రసన్నం చేసుకునేందుకు నిందితులు ఈ హత్యకు పాల్పడ్డారు!
ట్రెండింగ్ వార్తలు
ఇదీ జరిగింది..
ఉత్తర్ప్రదేశ్ బరేలీ నుంచి వచ్చిన ఓ కుటుంబం.. సీఆర్పీఎఫ్ ప్రధాన కార్యాలయం నిర్మాణంలో పనికి చేరింది. వారికి ఓ ఆరేళ్ల బిడ్డ ఉన్నాడు.
కాగా.. శనివారం అర్ధరాత్రి 12:40 గంటల సమయంలో.. భవనానికి సమీపంలో ఓ బాలుడి మృతదేహాన్ని కూలీలు గుర్తించారు. అతడి గొంతు కోసేసి ఉండటంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. అటుగా వెళుతున్న నిందితులను వారందరు పట్టుకున్నారు. మరణించింది.. తమ బిడ్డే అని తెలిసి.. ఆ వలస కుటుంబం విలపించింది.
6year old boy sacrificed in Delhi : ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితులను పట్టుకుని అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా నిందితులు.. బిహార్కి చెందిన 23ఏళ్ల విజయ్ కుమార్, 21ఏళ్ల అమర్ కుమార్.. నిజాన్ని ఒప్పుకున్నారు.
"నిందితులు ఇద్దరు కలిసి గంజా కొట్టేవారు. వారు కూడా భవన నిర్మాణంలో పనిచేసిన కూలీలే. గంజా కొడుతున్న వారిద్దరని స్థానికులు మందలించారు. దాంతో వారిద్దరు కోపం పెంచుకున్నారు. ఇక తన కలలోకి భోలే బాబా వచ్చాడని, ఓ బాలుడి మెడ కోసేయాలని ఆదేశించినట్టు నిందితుల్లో ఒకడు చెప్పాడు. ఈ క్రమంలోనే 6ఏళ్ల బాలుడిని చంపేశారు. అలా చేస్తే శాంతి జరుగుతుందని వారు భావిస్తున్నారు," అని పోలీసులు వెల్లడించారు.
శనివారం రాత్రి.. బాలుడు తన షెడ్డుకు వెళుతుండగా.. అతడిని ఆ ఇద్దరు పిలిపించారు. వారిద్దరు ముందే తెలుసు కాబట్టి.. బలవంతం లేకుండానే వారి వద్దకు వెళ్లాడు బాధితుడు. ఈ క్రమంలోనే అతడిని చంపేశారు.
బాధితుడి కుటుంబసభ్యలు.. నిందితులపై తీవ్ర ఆరోపణలు చేశారు. దుర్గా పూజల వేళ త్యాగాలు చేస్తే.. శాంతి లభిస్తుందని ఆ ఇద్దరు తరచూ మాట్లాడేవారని ఆరోపించారు.
ఘటనపై దర్యాప్తు చేపడతామని పోలీసులు వెల్లడించారు.
సంబంధిత కథనం