5G spectrum auction : ముగిసిన 5జీ వేలం.. బిడ్ వాల్యూ @1,50,173కోట్లు!
5G spectrum auction : జులై 26న ప్రారంభమైన 5జీ స్పెక్ట్రమ్ వేలం.. సోమవారం మధ్యాహ్నం ముగిసింది. మొత్తం మీద.. రూ. 1,50,173కోట్లు విలువ చేసే బిడ్లు దాఖలైనట్టు సమాచారం.
5G spectrum auction : దేశంలో 5జీ స్పెక్ట్రమ్ వేలం సోమవారం ముగిసింది. రూ. 1,50,173కోట్లు విలువైన స్పెక్ట్రమ్కు బిడ్లు దాఖలైనట్టు పీటీఐ నివేదిక పేర్కొంది.
ట్రెండింగ్ వార్తలు
జులై 26న 5జీ స్పెక్ట్రమ్ మొదలైంది. ఏడు రోజుల పాటు సాగిన 5జీ స్పెక్ట్రమ్ వేలం.. సోమవారం మధ్యాహ్నంతో ముగిసినట్టు తెలుస్తోంది.
రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ఈ 5జీ వేలంలో పాల్గొన్నాయి. అపర కుబేరుడు గౌతమ్ ఆదానీకి చెందిన అదానీ ఎంటర్ప్రెజెస్ కూడా ఈ 5జీ వేలంలో పాల్గొని అందరికి షాక్ ఇచ్చింది.
5జీ స్పెక్ట్రమ్ వేలంలోని చివరి ఆరు రోజుల్లో రూ. 1,50,130కోట్లు విలువ చేసే బిడ్లు దాఖలయ్యాయి.
5జీ స్పెక్ట్రమ్కు లభించిన డిమాండ్పై టెలికాంశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ హర్షం వ్యక్తం చేశారు. పరిశ్రమలో ఎదగాలన్న పట్టుదల కనిపిస్తోందన్నారు. పరిశ్రమకు గడ్డుకాలం ముగిసిందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక 5జీతో.. 4జీ కన్నా 10 రెట్లు వేగంగా ఇంటర్నెట్ను అందించవచ్చని స్పష్టం చేశారు.
ఆగస్ట్ 15వ తేదీ నాటికి అలోకేషన్ సహా మొత్తం బిడ్డింగ్ ప్రక్రియను ముగించాలని కేంద్రం భావిస్తోంది. అలాగే, దేశంలోని ప్రధాన నగరాల్లో 5G సేవలను ఈ సెప్టెంబర్ నాటికి అందించాలని పట్టుదలతో ఉంది. ప్రస్తుతం 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 2500 MHz, 3300 MHz, and 26 GHz బ్యాండ్విడ్త్స్ను వేలంలో ఉంచారు.
- సక్సెస్ఫుల్ బిడ్డర్లకు 20 ఏళ్ల పాటు ఈ స్పెక్ట్రం అందుబాటులో ఉంటుంది.
- ఈ వేలంలో విజయవంతమైన బిడ్డర్లు 20 ఏళ్ల పాటు ఆ మొత్తాన్ని 20 వార్షిక వాయిదాల్లో చెల్లించవచ్చు.
- ఈ ఎయిర్వేవ్స్ కు రూ. 4.3 లక్షల కోట్లను రిజర్వ్ ప్రైస్గా నిర్ధారించింది.
- ఇప్పటికే ట్రాయ్ పలు చోట్ల పైలట్ ప్రాజెక్టుగా 5జీని ప్రారంభించింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్, బెంగళూరు మెట్రో, కాండ్లా పోర్ట్, భోపాల్లోని 11ప్రదేశాల్లో 5G సేవలను జియో, ఎయిర్టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ సహకారంతో పైలట్ ప్రాజెక్టుగా అందిస్తోంది.
సంబంధిత కథనం
టాపిక్