ఎయిర్ ఇండియా ఇంటర్వ్యూ కోసం.. ‘ఇండిగో’ ఉద్యోగుల క్యూ.. అందుకే విమానాలు లేట్!
Indigo : ఎయిర్ ఇండియాలో శనివారం ఇంటర్వ్యూలు జరిగాయి. కాగా.. ఇందులో పాల్గొనేందుకు చాలా మంది ఇండిగో సంస్థ ఉద్యోగులు.. ఒక్కసారిగా సిక్ లీవ్లు పెట్టేశారు. ఫలితంగా శనివారం.. ఇండిగో విమానాల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Indigo : ఇండిగో దేశీయ విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 55శాతం విమానాలు శనివారం ఆలస్యంగా ప్రయాణించాయి. కాగా.. ఇండిగో సిబ్బంది ఒకేసారి సెలవులు పెట్టి ఎయిర్ ఇండియా నిర్వహించిన రిక్రూట్మెంట్ డ్రైవ్కు వెళ్లడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
ఎయిర్ ఇండియా రిక్రూట్మెంట్ డ్రైవ్ రెండో దశ.. శనివారం జరిగింది. ఇండిగో క్యాబిన్ క్రూ సభ్యుల్లో చాలామంది.. ఒక్కసారిగా సిక్ లీవ్స్ పెట్టేశారు. తొలుత ఎవరికి అర్థం కాలేదు. చివరికి డాట్స్ కనెక్ట్ చేసుకోవడంతో అసలు విషయం బయటపడింది.
ఈ వ్యవహారంపై ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు స్పందించలేదు. కాగా.. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టినట్టు ఏవియేషన్ నియంత్రణ సంస్థ డీజీసీఏ మీడియాకు వెల్లడించింది.
కష్టాల్లో ఇండిగో!
దేశంలోని అతిపెద్ద విమానయన సంస్థల్లో ఇండిగో ఒకటి. ప్రస్తుతం ఆ సంస్థ వద్ద 1,600 విమానాలు ఉన్నాయి. కాగా.. శనివారం దేశీయంగా కేవలం 45.2శాతం విమానాలే సమయానికి నడిచాయి.
జీతాల విషయంలో ఇండిగో ఉద్యోగులు కాస్త అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. వేతనాలు పెంచలేమని ఈ ఏడాది 8న.. ఇండిగో సీఈఓ రంజోయ్ దత్త.. ఉద్యోగులకు తేల్చిచెప్పేశారు. కాగా.. ఈ విషయంపై ఏప్రిల్ నెలలో నిరసనలు చేపడదాము అని అనుకున్న పైలట్లను.. ఒక రోజు ముందే సస్పెండ్ చేసింది ఇండిగో.
కొవిడ్ పీక్ దశలో ఉన్నప్పుడు.. పైలట్ల జీతాలను 30శాతం వరకు కట్ చేసింది ఇండిగో సంస్థ.
సంబంధిత కథనం
టాపిక్