Bus fell into a gorge: పెళ్లి బస్సు లోయలో పడి 25 మంది దుర్మరణం
పెళ్లి బృందం వెళుతున్న బస్సు లోయలో పడడంతో 25 మంది దుర్మరణం పాలయ్యారు.
దుర్ఘటన స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు (ANI pic service)
పౌరీ (ఉత్తరాఖండ్), అక్టోబర్ 5: ఉత్తరాఖండ్లోని పౌరీ జిల్లాలో పెళ్లి బృందంలోని 45-50 మంది సభ్యులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో కనీసం 25 మంది మృతి చెందగా, 20 మంది గాయపడినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు
బస్సు లాల్ధంగ్ నుండి బిరోంఖల్లోని ఒక గ్రామానికి వెళుతుండగా మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో సిమ్రి బెండ్ సమీపంలో ప్రమాదానికి గురైనట్లు వారు తెలిపారు.
రాత్రంతా సహాయక చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన 20 మందిని బస్సు శిథిలాల నుంచి బయటకు తీసి ఆసుపత్రులకు తరలించినట్లు వారు తెలిపారు.
టాపిక్