Ganja seized in Assam border : సరిహద్దులో 2,400 కేజీల గంజాయి పట్టివేత
Ganja seized in Assam border : అసోం- త్రిపుర సరిహద్దులో 2,400 కేజీల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
Ganja seized in Assam border : అసోం- త్రిపుర సరిహద్దులో భారీ మొత్తంలో నిషేధిత పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు బీఎస్ఎఫ్ (బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్) అధికారులు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశారు.
ట్రెండింగ్ వార్తలు
2,400 కేజీల గంజాయిని డ్రమ్ముల్లో పెట్టి తరలిస్తుండగా.. చౌరైబరి వాచ్పోస్ట్ వద్ద బీఎస్ఎఫ్ అధికారులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ.
నిషేధిత పదార్థాలు..
అసోంలో ఇటీవలి కాలంలో భారీ మొత్తంలో నిషేధిత పదార్థాలు పట్టుబడుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే కరీంగంజ్ జిల్లాలో 9.47కేజీల హెరాయిన్ని అధికారులు జప్తు చేశారు. మిజోరాం నుంచి త్రిపురకు వెళుతున్న వాహనంలో నుంచి ఈ హెరాయిన్ని పట్టుకున్నారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్ట్ చేశారు.
గత నెలలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. చచర్ జిల్లాలో 4లక్షల యాబా ట్యాబ్లెట్లను అధికారులు పట్టున్నారు. ఏడుగురు మణిపూర్వాసులను అసోం సరిహద్దు వద్ద అదుపులోకి తీసుకున్నారు.
దశాబ్దాలుగా.. నార్కోటిక్స్ తరలింపునకు అసోం సరిహద్దులు అడ్డాగా ఉండేవి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ సైతం అంగీకరించారు. అయితే.. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని, అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు కొన్ని రోజుల క్రితమే ఆయన వెల్లడించారు.
2016లో 10కేజీలు, 2017లో 5కేజీలు, 2018లో 7కేజీలు, 2019లో 23కేజీలు, 2020లో 27కేజీల హెరాయిన్ను పట్టుకున్నట్టు అధికారిక లెక్కల్లో ఉన్నాయి.
"ఈ లెక్కలు చూస్తుంటే.. డ్రగ్స్ ఎక్కువగా ఉన్నాయి, పట్టుకుంటున్నవి తక్కువగా ఉంటున్నాయని అర్థమవుతోంది. నేను సీఎం పదవి చేపట్టిన తర్వాత ఈ విషయంపై దృష్టిపెట్టాను. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా మాట్లాడాను. ఇలాంటి అంశాలను తేలికగా వదలకూడదని ఇద్దరం నిర్ణయించుకున్నాము," అని శర్మ వెల్లడించారు.
ఒక్క అసోంలోనే కాదు. దేశవ్యాప్తంగా గంజాయి, హెరాయిన్ అక్రమ రవాణాలు జరుగుతున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో హెరాయిన్ను తరలిస్తున్న ఓడలను అధికారులు జప్తు చేస్తూనే ఉన్నారు.
సంబంధిత కథనం