Chhattisgarh encounter: మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ; వేర్వేరు ఎన్ కౌంటర్లలో 22 మంది మావోల మృతి-22 maoists soldier killed in separate encounters in chhattisgarh police ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Chhattisgarh Encounter: మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ; వేర్వేరు ఎన్ కౌంటర్లలో 22 మంది మావోల మృతి

Chhattisgarh encounter: మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ; వేర్వేరు ఎన్ కౌంటర్లలో 22 మంది మావోల మృతి

Sudarshan V HT Telugu

Chhattisgarh encounter: వరుస ఎన్ కౌంటర్ లతో భారీగా కేడర్ ను కోల్పోతున్న మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. చత్తీస్ గఢ్ లో గురువారం తెల్లవారుజామున జరిగిన వేర్వేరు ఎదురుకాల్పుల్లో 22 మంది మావోలు మృతి చెందారు.

చత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్

Chhattisgarh encounter: ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో గురువారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో 18 మంది మావోయిస్టులు, ఒక జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) జవాను మృతి చెందారు. కాంకేర్ జిల్లాలో జరిగిన వేర్వేరు ఎన్ కౌంటర్ లలో మరో నలుగురు మావోయిస్టులు చనిపోయారు.

వేర్వేరు ఎన్ కౌంటర్లలో..

‘‘బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అడవిలో ఉదయం 7 గంటలకు ఎదురుకాల్పులు జరిగాయి. గంగలూరు పోలీస్ స్టేషన్ ఏరియా (బీజాపూర్) పరిధిలో భద్రతా సిబ్బంది సంయుక్త బృందం నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తోంది’’ అని పోలీసులు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్ కౌంటర్ అనంతరం, 18 మంది మావోయిస్టుల మృతదేహాలతో పాటు తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. గాలింపు కొనసాగుతోందని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు, కాంకేర్-నారాయణపూర్ సరిహద్దు ప్రాంతంలో రెండో ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను, ఒక ఆటోమేటిక్ రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నామని కంకేర్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) ఇందిరా కల్యాణ్ ఎలెసెలా తెలిపారు.

మార్చి 9 తరువాత..

మార్చి 9న బీజాపూర్ లో పోలీసులతో ఎదురుకాల్పుల్లో 11 మంది మహిళలు సహా 31 మంది మావోయిస్టులు చనిపోయారు. నిషేధిత సిపిఐ (మావోయిస్టు) డివిజనల్ కమిటీ సభ్యుడు (డివిసిఎం) సహా 31 మంది మావోయిస్టులలో ఐదుగురిని ఛత్తీస్ గఢ్ పోలీసులు గుర్తించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో ఒక ఏకే-47 రైఫిల్, ఒక ఎస్ఎల్ఆర్ రైఫిల్, ఒక ఇన్సాస్ రైఫిల్, ఒక .303 రైఫిల్, ఒక .315 బోర్ రైఫిల్, స్టాండ్ ఉన్న ఒక బీజీఎల్ రాకెట్ లాంచర్ (పెద్దది), ఆరు బీజీఎల్ లాంచర్లు, లేజర్ ప్రింటర్లు ఉన్నాయి.

ఈ ఏడాది 81 మంది..

ఛత్తీస్ గఢ్ లో ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన వేర్వేరు ఎన్ కౌంటర్లలో 81 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ 81 మందిలో 65 మంది బీజాపూర్ సహా ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ డివిజన్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందారు.

Sudarshan V

eMail
వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.