Crime news : ఒక్క వ్యక్తి కిడ్నాప్​కు ఊరంతా వచ్చింది! అడ్డుపడ్డ అధికారులపై దాడి- పోలీసు మృతి-2 killed 10 injured as police fight villagers to rescue kidnapped man in mp ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : ఒక్క వ్యక్తి కిడ్నాప్​కు ఊరంతా వచ్చింది! అడ్డుపడ్డ అధికారులపై దాడి- పోలీసు మృతి

Crime news : ఒక్క వ్యక్తి కిడ్నాప్​కు ఊరంతా వచ్చింది! అడ్డుపడ్డ అధికారులపై దాడి- పోలీసు మృతి

Sharath Chitturi HT Telugu

MP crime news : మధ్యప్రదేశ్​లో 200కుపైగా మంది ఒక వ్యక్తిని కిడ్నాప్​ చేసి చంపేశారు. ఈ నేరాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా దాడి చేశారు. ఈ ఘటనలో ఒక పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.

మధ్యప్రదేశ్​లోని ఓ ఆసుపత్రి..

మధ్యప్రదేశ్​లో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది! ఒకే గ్రామానికి చెందిన 200కుపైగా మంది ఓ వ్యక్తిని కిడ్నాప్​ చేశారు. వారిని అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపైనా ఆ గ్రామస్థులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి సహా మొత్తం ఇద్దరు మరణించారు.

అసలేం జరిగిందంటే..

మధ్యప్రదేశ్​ గాద్రా గ్రామానికి చెందిన వార్త ఇది. 52ఏళ్ల అశోక్​ కోల్​ కుటుంబం, 24ఏళ్ల సన్నీ ద్వివేదీ కుటుంబ దగ్గర భూమిని లీజుకు తీసుకుని పొలం పనులు చేసేది. ఆ తర్వాత ద్వివేదీ కుటుంబం భూమి పక్కనే అశోక్​ తన సొంతంగా ఒక ల్యాండ్​ కొనుగోలు చేశాడు. అయితే, ఈ భూమిపై ద్వివేదీ కుటుంబం కన్నుపడిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై రెండు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి.

రెండు నెలల క్రితం 52ఏళ్ల అశోక్​ కోల్​ అనూహ్యంగా మరణించాడు. మౌగంజ్​ నుంచి ఇంటికి తిరిగి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ద్వివేదీ కుటుంబమే తమ అశోక్​ని చంపిందని కోల్​ కుటుంబం ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు అనంతరం.. అశోక్​ని ఎవరు చంపలేదని, మౌగంజ్​ నుంచి తిరిగొస్తుండగా అతని బైక్​ గేదెను ఢీకొట్టిందని, అతను కిందపడి మరణించాడని రిపోర్టు ఇచ్చింది.

పోలీసుల రిపోర్టును కోల్​ కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించింది. తమ అశోక్​ని ద్వివేదీ కుటుంబమే చంపిందని, అప్పటి నుంచి కక్ష పెంచుకుంది.

ఇక మార్చ్​ 15, శనివారం ద్వివేదీ తన దుకాణం నుంచి ఇంటికి తిరిగివెళుతుండగా కోల్​ కుటుంబం అతడిని అడ్డుకుంది. అతడిని కిడ్నాప్​ చేసేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో గ్రామానికి చెందిన 250కిపైగా మంది అక్కడికి వెళ్లారు. వారిలో చాలా మంది ద్వివేదీని దారుణంగా కొట్టారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. పోలీసులను చూసిన గ్రామస్థులు మరింత రెచ్చిపోయారు! 200కుపైగా మందితో పాటు కోల్​ కుటుంబసభ్యులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. వారి నుంచి లాఠీలు లాక్కుని మరీ పోలీసులనే కొట్టారు. ఈ ఘటనలో స్పెషల్​ ఆర్మ్​డ్​ ఫోర్స్​ (ఎస్​ఏఎఫ్​​) సబ్​- ఇన్​స్పెక్టర్​ రామ్​చరణ గౌతమ్​ సహా మొత్తం 10 గాయపడ్డారు. వీరిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలి చికిత్స పొందుతూ పోలీసు అధికారి రామ్​చరణ్​ మరణించారు.

కొన్ని గంటల తర్వాత గాద్రా గ్రామంలో సన్నీ ద్వివేదీ మృతదేహం లభించింది. సన్నీని కిడ్నాప్​ చేసిన తర్వాత అతడిని దారుణంగా హత్య చేసినట్టు తెలుస్తోంది.

ఈ ఘటనపై 50కిపైగా మంది మీద పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. మర్డర్​, హత్యాయత్నం, కిడ్నాప్​, పోలీసులపై దాడి కింద ఛార్జీలు వేశారు. ఘటనపై వెంటనే దర్యాప్తు చేపట్టి.. ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్​ చేసినట్టు అధికారులు వెల్లడించారు.

గాద్రా గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు జిల్లా కలెక్టర్​.

ఒక్క వ్యక్తిని కిడ్నాప్​ చేసేందుకు 200కుపైగా మంది వచ్చారని, పోలీసులపైనా దాడి చేశారన్న వార్త కలకలం సృష్టించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.