Parliament session : 18వ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభం.. మొదటి రోజే విపక్షాల నిరసనలు..
Parliament session : 18వ లోక్సభ తొలి సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తొలుత.. ప్రధాని మోదీ ఎంపీగా ప్రమాణం చేశారు.
18th Lok Sabha Parliament session : 18వ లోక్సభకు సంబంధించిన తొలి పార్లమెంట్ సమావేశాలు సోమవారం మొదలయ్యాయి. ఎంపీగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేత ప్రమాణం చేయించారు ప్రోటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్.
మొదటి రెండు రోజుల పాటు నూతన ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుంది. తొలిరోజు 280మంది, రెండో రోజు 260మంది ఎంపీలుగా ప్రమాణం చేస్తారు.
ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనంతరం.. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, కుమారస్వామి, మనోహర్ లాల్ కట్టర్, పీయుష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, జితిన్ రామ్ మంఝి, రాజీవ్ రంజన్లు.. ఎంపీలుగా ప్రమాణం చేశారు.
మోదీ కేబినెట్లో విమానయానశాఖ మంత్రిగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన కే. రామ్మోహన్ నాయుడు సైతం.. సోమవారం ఉదయం ఎంపీగా ప్రమాణం చేశారు.
ప్రోటెం స్పీకర్ ఎంపికపై వివాదం..
అంతకన్నా ముందు.. సోమవారం ఉదయం, బీజేపీ ఎంపీ బత్రుహరి మహ్తబ్ చేత ప్రోటెం స్పీకర్గా ప్రమాణం చేయించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పార్లమెంట్లో రెండు రోజుల పాటు నూతన ఎంపీల చేత ఆయన ప్రమాణం చేయిస్తారు.
కాగా.. ప్రోటెం స్పీకర్గాభర్తృహరి మహతాబ్ని బీజేపీ ఎంపిక చేయడంపై విపక్షాలు మండిపడ్డాయి. సభలో సీనియర్ ఎంపీని ప్రోటెం స్పీకర్గా నియమించడం అనాదిగా వస్తున్న సంప్రదాయమని, ఈసారి దానిని బీజేపీ పట్టించుకోలేదని ఆరోపించాయి.
Parliament session live updates : సంప్రదాయం ప్రకారం అయితే.. కాంగ్రెస్ నేత కే. సురేశ్ ప్రోటెం స్పీకర్ అవ్వాలని కానీ ఆయనొక దళిత నేత అయినందునే.. అవకాశం ఇవ్వలేదని ఆ పార్టీ ఆరోపిస్తోంది. దీనిని బీజేపీ తప్పుబట్టింది.
ఇక ప్రోటెం స్పీకర్ వివాదం, నీట్ వివాదం, పేపర్ లీక్ వ్యవహారం మధ్య పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో.. అధికారపక్షంపై విపక్షాలు ఏమేరకు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాయో చూడాలి.
వాస్తవానికి.. పార్లమెంట్ సమావేశాలు మొదలవ్వడానికి కొంతసేపటి ముందే విపక్షాలు నిరసనలు మొదలుపెట్టాయి. పార్లమెంట్ బయట.. రాజ్యాంగాన్ని పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు ఇండియా కూటమి ఎంపీలు.
భారత్కు బాధ్యతాయుత విపక్షం కావాలి..
పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి కొంతసేపటి ముందు.. మీడియాతో మాట్లాడారు ప్రధాని మోదీ.
“ప్రభుత్వాన్ని నడిపేందుకు మెజారిటీ కావాలని మా నమ్మకం. అయితే.. దేశాన్ని నడిపించేందుకు అందరి ఏకాభిప్రాయం కావాలి. ఈ సంప్రదాయాన్ని గత 10ఏళ్లుగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాము. 140కోట్ల బారతీయుల కలలను నెరవేర్చేందుకు, భరత మాతకు సేవ చేసేందుకు మనం ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి. అందరిని కలసిగట్టుగా కలుపుకుని, రాజ్యంగం పవిత్రతను మెయిన్టైన్ చేస్తూ.. నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్నాము. ఇండియాకు బాధ్యతాయుత విపక్షం కావాలి. ప్రజలకు నినాదాల కన్నా పనితనం కావాలి. చర్చలు కావాలి . పార్లమెంట్లో ఆందోళనలు అక్కర్లేదు. మంచి చేసే విషయంలో విపక్షాలు ఇప్పటివరకు అసంతృప్తి పరిచాయి. ఈసారైనా తమ బాధ్యతను విపక్షాలు నిర్వర్తిస్తాయని ఆశిస్తున్నాను,” అని మోదీ అన్నారు.
జులై 3తో ముగింపు..
Parliament session latest news : సోమవారం ఉదయం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు.. జులై 3తో ముగిస్తాయి. ఇందాక చెప్పినట్టు.. మొదటి రెండు రోజులు.. ఎంపీల ప్రమాణస్వీకారం ఉంటుంది. ఆ తర్వాత, జూన్ 26న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జులై 3న పార్లమెంట సమావేశాలు పూర్తవుతాయి.
ఆ తర్వాత.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 22న మొదలవుతాయి.
సంబంధిత కథనం
టాపిక్