Assam acid attack : 17ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి.. రిలేషన్ని కట్ చేసిందన్న కోపంతో!
Assam acid attack : అసోంలో ఓ 17ఏళ్ల బాలికపై బ్యాటరీ యాసిడ్ దాడి జరిగింది. రిలేషన్ను కట్ చేసిందన్న కోపంతో.. నిందితుడు బాధితురాలిపై సల్ఫ్యూరిక్ యాసిడ్ దాడి చేశాడు. అసోంలో యాసిడ్ దాడి ఘటన వెలుగు చూడటం.. గత మూడు రోజుల్లో ఇది రెండోసారి.
Assam acid attack : అసోంలో మహిళలు, బాలికలపై యాసిడ్ దాడుల ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా.. ఓ 17ఏళ్ల బాలికపై బ్యాటరీ యాసిడ్తో దాడి చేశాడు ఓ యువకుడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ట్రెండింగ్ వార్తలు
రిలేషన్ను కట్ చేసిందని..
పోలీసుల కథనం ప్రకారం.. బాధిత బాలిక శార్థెబరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో నివాసముంటోంది. ఆదివారం రాత్రి.. ఓ ఈవెంట్కు వెళ్లి ఇంటికి తిరిగొస్తుండగా మాజ్దియా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Battery acid attack on minor : ఓ 20ఏళ్ల యువకుడు.. బాధితురాలిపై బ్యాటరీ యాసిడ్తో దాడి చేశారు. ఈ బ్యాటరీ యాసిడ్ని సల్ఫ్యూరిక్ యాసిడ్ అని కూడా పిలుస్తూ ఉంటారు.
కాగా.. ఆ బాలిక, యువకు గత కొంతకాలంగా రిలేషన్లో ఉంటున్నట్టు.. కొన్ని రోజుల క్రితమే ఆమె, ఆతడికి బ్రేక్ అప్ చెప్పినట్టు తెలుస్తోంది.
"బాధితురాలు, నిందితుడు గత కొంతకాలంగా రిలేషన్లో ఉంటున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కొన్ని రోజుల క్రితమే రిలేషన్కు ఆ బాలిక గుడ్ బై చెప్పింది. ఫలితంగా కోపం పెంచుకున్న నిందితుడు మెహర్ అలీ.. బాలికపై సల్ఫ్యూరిక్ యాసిడ్తో దాడి చేశాడు," అని బార్పేట అడిషనల్ ఎస్పీ ప్రదీప్ సైకియా మీడియాకు తెలిపారు.
Assam crime news : ఈ ఘటనలో బాలిక మెడకు, భుజానికి గాయమైనట్టు పోలీసులు వెల్లడించారు. ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్చినట్టు పేర్కొన్నారు. చికిత్స అనంతరం సోమవారం ఆమె డిశ్చార్జ్ అయినట్టు వివరించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు స్పష్టం చేశారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మెహర్ అలీని అరెస్ట్ చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.
మూడు రోజుల్లో రెండో ఘటన..!
అసోంలో యాసిడ్ దాడి ఘటన వెలుగు చూడటం.. గత మూడు రోజుల్లో ఇది రెండోసారి. ఆదివారం.. ధేకియాజులి ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి.. 30ఏళ్ల మహిళపై యాసిడ్తో దాడి చేశాడు.
పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు.. వ్యాపారితో గత కొంత కాలంగా రిలేషన్లో ఉంటున్నట్టు తెలుస్తోంది.
Acid attack on woman in Assam : "నిందితుడికి వివాహం జరిగింది. మహిళకు పెళ్లి జరగలేదు. కాగా.. కొన్ని నెలలుగా వీరిద్దరు రిలేషన్లో ఉన్నారు. డబ్బు విషయంలో వీరి మధ్య ఇటీవలే విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నిందితుడు.. మహిళపై యాసిడ్ దాడి చేశాడు," అని సోనిత్పూర్ ఎస్పీ సుశాంత్ బిశ్వ శర్మ వెల్లడించారు.
మహిళకు గాయాలైనట్టు.. ఆమెను తేజ్పూర్ నగరంలోని ఓ ఆసుపత్రిలో చేర్చినట్టు సమాచారం. ఆమె శరీరంలో 15శాతం కాలిన గాయాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. నిందితుడు వట్సు కార్ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి, దర్యాప్తును ముమ్మరం చేశారు.
సంబంధిత కథనం