Assam acid attack : 17ఏళ్ల బాలికపై యాసిడ్​ దాడి.. రిలేషన్​ని కట్​ చేసిందన్న కోపంతో!-17yearold girl attacked with battery acid in assam s barpeta accused arrested ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  17-year-old Girl Attacked With Battery Acid In Assam's Barpeta; Accused Arrested

Assam acid attack : 17ఏళ్ల బాలికపై యాసిడ్​ దాడి.. రిలేషన్​ని కట్​ చేసిందన్న కోపంతో!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 27, 2022 01:56 PM IST

Assam acid attack : అసోంలో ఓ 17ఏళ్ల బాలికపై బ్యాటరీ యాసిడ్​ దాడి జరిగింది. రిలేషన్​ను కట్​ చేసిందన్న కోపంతో.. నిందితుడు బాధితురాలిపై సల్​ఫ్యూరిక్​ యాసిడ్​ దాడి చేశాడు. అసోంలో యాసిడ్​ దాడి ఘటన వెలుగు చూడటం.. గత మూడు రోజుల్లో ఇది రెండోసారి.

17ఏళ్ల బాలికపై బ్యాటరీ యాసిడ్​ దాడి
17ఏళ్ల బాలికపై బ్యాటరీ యాసిడ్​ దాడి

Assam acid attack : అసోంలో మహిళలు, బాలికలపై యాసిడ్​ దాడుల ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా.. ఓ 17ఏళ్ల బాలికపై బ్యాటరీ యాసిడ్​తో దాడి చేశాడు ఓ యువకుడు. అతడిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

రిలేషన్​ను కట్​ చేసిందని..

పోలీసుల కథనం ప్రకారం.. బాధిత బాలిక శార్థెబరి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ గ్రామంలో నివాసముంటోంది. ఆదివారం రాత్రి.. ఓ ఈవెంట్​కు వెళ్లి ఇంటికి తిరిగొస్తుండగా మాజ్దియా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Battery acid attack on minor : ఓ 20ఏళ్ల యువకుడు.. బాధితురాలిపై బ్యాటరీ యాసిడ్​తో దాడి చేశారు. ఈ బ్యాటరీ యాసిడ్​ని సల్​ఫ్యూరిక్​ యాసిడ్​ అని కూడా పిలుస్తూ ఉంటారు.

కాగా.. ఆ బాలిక, యువకు గత కొంతకాలంగా రిలేషన్​లో ఉంటున్నట్టు.. కొన్ని రోజుల క్రితమే ఆమె, ఆతడికి బ్రేక్​ అప్​ చెప్పినట్టు తెలుస్తోంది.

"బాధితురాలు, నిందితుడు గత కొంతకాలంగా రిలేషన్​లో ఉంటున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కొన్ని రోజుల క్రితమే రిలేషన్​కు ఆ బాలిక గుడ్​ బై చెప్పింది. ఫలితంగా కోపం పెంచుకున్న నిందితుడు మెహర్​ అలీ.. బాలికపై సల్​ఫ్యూరిక్​ యాసిడ్​తో దాడి చేశాడు," అని బార్పేట అడిషనల్​ ఎస్​పీ ప్రదీప్​ సైకియా మీడియాకు తెలిపారు.

Assam crime news : ఈ ఘటనలో బాలిక మెడకు, భుజానికి గాయమైనట్టు పోలీసులు వెల్లడించారు. ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్చినట్టు పేర్కొన్నారు. చికిత్స అనంతరం సోమవారం ఆమె డిశ్చార్జ్​ అయినట్టు వివరించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు స్పష్టం చేశారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మెహర్​ అలీని అరెస్ట్​ చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

మూడు రోజుల్లో రెండో ఘటన..!

అసోంలో యాసిడ్​ దాడి ఘటన వెలుగు చూడటం.. గత మూడు రోజుల్లో ఇది రెండోసారి. ఆదివారం.. ధేకియాజులి ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి.. 30ఏళ్ల మహిళపై యాసిడ్​తో దాడి చేశాడు.

పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు.. వ్యాపారితో గత కొంత కాలంగా రిలేషన్​లో ఉంటున్నట్టు తెలుస్తోంది.

Acid attack on woman in Assam : "నిందితుడికి వివాహం జరిగింది. మహిళకు పెళ్లి జరగలేదు. కాగా.. కొన్ని నెలలుగా వీరిద్దరు రిలేషన్​లో ఉన్నారు. డబ్బు విషయంలో వీరి మధ్య ఇటీవలే విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నిందితుడు.. మహిళపై యాసిడ్​ దాడి చేశాడు," అని సోనిత్​పూర్​ ఎస్​పీ సుశాంత్​ బిశ్వ శర్మ వెల్లడించారు.

మహిళకు గాయాలైనట్టు.. ఆమెను తేజ్​పూర్​ నగరంలోని ఓ ఆసుపత్రిలో చేర్చినట్టు సమాచారం. ఆమె శరీరంలో 15శాతం కాలిన గాయాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. నిందితుడు వట్సు కార్​ను పోలీసులు సోమవారం అరెస్ట్​ చేసి, దర్యాప్తును ముమ్మరం చేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం