ఛత్తీస్గఢ్లో జరిగిన ఒక షాకింగ్ ఘటన ఇప్పుడు వార్తల్లో నిలిచింది. రాయ్పూర్ నగరంలోని గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక లాడ్జిలో ఓ యువకుడి మృతదేహాన్ని పోలీసులు ఆదివారం కనుగొన్నారు. ఈ దారుణ హత్యను అతడి 16 ఏళ్ల ప్రియురాలు చేసినట్లు తెలిసింది. హత్య అనంతరం ఇంటికి తిరిగి వెళ్లిన ఆ బాలిక, జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పంది. అప్పుడే ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిలాస్పూర్లోని కోనీ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఆ బాలిక, తన ప్రియుడు మహ్మద్ సద్దాంను కలవడానికి సెప్టెంబర్ 28న రాయ్పూర్కి వెళ్లింది. బిహార్కు చెందిన సద్దాం, అభన్పూర్లో ఎంఎస్ ఇంజినీరింగ్ అధికారిగా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ రాయ్పూర్లోని రామన్ మందిర్ వార్డు, సత్కార్ గల్లీలో ఉన్న అవోన్ లాడ్జిలో శనివారం నుంచి కలిసి ఉంటున్నారు.
సద్దాం కారణంగా గర్భం దాల్చిన బాలికపై అతను గర్భస్రావం చేయించుకోవాలని ఒత్తిడి చేశాడు. దాని వల్ల వారిద్దరి మధ్య సంబంధం దెబ్బతిన్నట్లు విచారణలో వెల్లడైంది. కొద్ది రోజుల క్రితం లాడ్జి వెలుపల జరిగిన వాగ్వాదంలో సద్దాం ఆ బాలికను కత్తితో బెదిరించాడని కూడా పోలీసులు తెలుసుకున్నారు.
సెప్టెంబర్ 28 రాత్రి సద్దాం లాడ్జి గదిలో నిద్రిస్తున్న సమయంలో, ఆ బాలిక అదే పదునైన ఆయుధాన్ని తీసుకుని తీవ్ర కోపంతో అతడి గొంతు కోసింది. ఆ తర్వాత గదికి బయట తాళం వేసి, సద్దాం మొబైల్ ఫోన్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయింది. ఆధారాలు దొరకకుండా ఉండేందుకు లాడ్జి గది తాళాన్ని సమీపంలోని రైల్వే ట్రాక్లపైకి విసిరేసింది.
తరువాతి ఉదయం ఆ బాలిక బిలాస్పూర్కు వెళ్లిపోయింది. ఆమె తల్లి అడగడంతో, బాలిక కుమిలిపోతూ జరిగింది మొత్తం వివరించింది. షాకైన ఆమె తల్లి వెంటనే బాలికను వెంటబెట్టుకుని కోనీ పోలీస్ స్టేషన్కు వెళ్లి విషయాన్ని రిపోర్ట్ చేసింది. బాలిక చెప్పిన సమాచారం మేరకు రాయ్పూర్ పోలీసులు హుటాహుటిన అవోన్ లాడ్జికి చేరుకోగా, సద్దాం రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించాడు.
పోలీస్ అధికారులు సద్దాం కుటుంబ సభ్యులను బిహార్లో సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారు. "మృతుడి ఫోన్ మా ఆధీనంలో ఉంది, ఆ నంబర్ ద్వారా అతడి కుటుంబ సభ్యులను గుర్తించే పనిలో ఉన్నాం. కేసు నమోదు చేసి, మైనర్ బాలికను విచారిస్తున్నాము," అని రాయ్పూర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
"ఇది తీవ్రమైన భావోద్వేగం, నిస్సహాయత కారణంగా జరిగిన నేరంగా కనిపిస్తోంది. ఇది ముందుగా ప్లాన్ చేసి చేసిందా లేదా ఆవేశంలో జరిగిందా అనే విషయం విచారణలో తెలుస్తుంది," అని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు.
ప్రేమగా మొదలై మోసం, హింసస మరణంతో ముగిసిన ఈ టీనేజ్ బంధం ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్, బిలాస్పూర్లలో తీవ్ర సంచలనం సృష్టించింది.
సంబంధిత కథనం