Kashmir news : కశ్మీర్లో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పై విరిగిపడిన కొండచరియలు
Kashmir news : జమ్మూకశ్మీర్ లోని ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఆరుగురు కొండ చరియల కింద చిక్కుకుపోయారు.
Kashmir news : జమ్మూకశ్మీర్ లోని కిశ్త్వర్ జిల్లాలో ఉన్న హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ రాట్లీ మెగా పవర్ ప్రాజెక్ట్ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ప్రాజెక్ట్ పై శనివారం పక్కనున్న పర్వతంపై నుంచి కొండ చరియలు విరిగి పడడంతో ఈ ప్రమాదం జరిగింది.
ట్రెండింగ్ వార్తలు
Kashmir news : జేసీబీ డ్రైవర్ మృతి
ఈ ప్రమాదంలో అక్కడి నిర్మాణ పనుల్లో ఉన్న జేసీబీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఈ ప్రమాదం పట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తక్షణమే స్థానిక కలెక్టర్ ను ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యల్లో పాల్గొనాలని ఆదేశించానని వెల్లడించారు.
Kashmir news : సహాయ సిబ్బంది కూడా..
ఈ ప్రమాదం అనంతరం అక్కడి వారిని కాపాడేందుకు, సహాయ చర్యల్లో పాలు పంచుకునేందుకు వచ్చిన ఆరుగురు రెస్క్యూ టీం సభ్యులు కూడా ఆ కొండ చరియల శిధిలాల్లో చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంపై జమ్మూకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని వెల్లడించారు.