వరల్డ్ ఆస్తమా దినోత్సవం 2025, ఆస్తమాను అదుపులో ఉంచేందుకు ఏం చేయాలో చెబుతున్న వైద్యులు-world asthma day 2025 doctors tell you what to do to keep asthma under control ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  వరల్డ్ ఆస్తమా దినోత్సవం 2025, ఆస్తమాను అదుపులో ఉంచేందుకు ఏం చేయాలో చెబుతున్న వైద్యులు

వరల్డ్ ఆస్తమా దినోత్సవం 2025, ఆస్తమాను అదుపులో ఉంచేందుకు ఏం చేయాలో చెబుతున్న వైద్యులు

Haritha Chappa HT Telugu

ఏటా ఆస్తమా కేసులు పెరుగుతున్నాయి. ఆస్తమా దినోత్సవం సందర్భంగా ఆ వ్యాధిని ఎలా అదుపులో ఉంచుకోవాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మెడికోవర్ పల్మనాలజిస్టు డా. మేఘనా రెడ్డి ఆస్తమాను కంట్రోల్ చేసే టిప్స్ వివరిస్తున్నారు.

డా. మేఘనా రెడ్డి ఎస్, పల్మనాలజిస్ట్

హైదరాబాద్‌కు చెందిన తొమ్మిదేళ్ల జోయా స్కూల్లో క్రీడా దినోత్సవం రోజు పోటీ పడింది. కానీ ఆమెకు హఠాత్తుగా శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. దీని వల్ల పోటీను పూర్తి చేయలేకపోయింది. ఆమె తల్లిదండ్రులు దీన్ని తాత్కాలిక అలర్జీగా తీసుకున్నారు. కానీ కొన్ని వారాల తర్వాత ఆమెకు ఆస్తమా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇది తెలుగు రాష్ట్రాల్లోని పిల్లల్లో పెరుగుతున్న సమస్య.

తెలంగాణ రాష్ట్రంలో 18 లక్షలకు పైగా ఆస్తమా రోగులు ఉన్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి పట్టణాల్లో ఈ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు, మహిళల్లో ఆస్తమా రోగులు అధికంగా ఉన్నారు.

ఆస్తమా కారకాలు

ఆస్తమా రావడానికి ప్రధాన కారణాలు గాలి నాణ్యత తగ్గిపోవడ, పూల రేణువులమయమైన వాతావరణం, వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, కొంత ప్రాంతాల్లో నిర్మాణ ధూళి వంటివి. ఇవి ఎంతో మందిలో ఆస్తమా ట్రిగ్గర్లుగా మారుతున్నాయి.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మెడికోవర్ హాస్పిటల్స్‌లో మేము అధునాతన నిర్ధారణ పరికరాలు, వ్యక్తిగత ఆస్తమా చికిత్సా ప్రణాళికలు, ట్రిగ్గర్ల గుర్తింపు, డిజిటల్ ఫాలో-అప్స్‌తో రోగులను శక్తివంతంగా చేయడానికి కృషి చేస్తున్నాము. ఇన్హేలర్ వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాల ద్వారా అత్యవసర విభాగాన్ని సందర్శించే అవసరం, అలాగే పిల్లలు పాఠశాల గైర్హాజరీ శాతం తగ్గించింది.

ఎదురవుతున్న అతిపెద్ద సవాలు

ఇన్హేలర్ వాడటంపై ఇప్పటికీ ఎంతో మందికి అవగాహన లేదు. కానీ మేము చేస్తున్న నిరంతర అవగాహన కార్యక్రమాల ద్వారా, కుటుంబాలు ఆస్తమాను నియంత్రించటం అనేది పూర్తి, చురుకైన జీవితానికి మార్గం అనే విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు.

ఆస్తమాను బ్రోన్సియల్ ఆస్తమా అని పిలుస్తారు. ఇది ఒక ఊపిరితిత్తుల వ్యాధి. ఈ వ్యాధి సోకితే వాయు మార్గాలు ఇరుకుగా మారిపోతాయి. అలాగే అదనంగా శ్లేష్మం ఉత్పత్తి అయి ఆ దారి మూసుకుపోతుంది. ఆస్తమాను అదుపులో ఉంచుకోగలం కాబట్టి తగిన చికిత్సను అందించాలి.

ఆస్తమా వ్యాధి సోకిన వారికి ఆయుష్ష తగ్గుతుందనే భయం లేదు. తగిన మందులు వాడితే సంతోషంగా జీవించవచ్చు. పిల్లలు, టీనేజర్లు, ముసలి వారు ఎవరికైనా కూడా ఆస్తమా వచ్చే అవకాశం ఉంది. ఆస్తమాకు సరైన చికిత్సను, వైద్యులను ఎంపిక చేసుకోవాలి.

ఈ వరల్డ్ ఆస్తమా డే 2025 సందర్భంగా, మెడికోవర గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్త్మా (GINA)తో కలసి ఈ నినాదాన్ని ప్రోత్సహిస్తున్నారు.

“ప్రతి ఒక్కరికీ ఇన్హేల్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులోకి తీసుకురావాలి”

- డా. మేఘనా రెడ్డి ఎస్,

పల్మనాలజిస్ట్,

మెడికోవర్ హాస్పిటల్స్,

తెలంగాణ

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.