ఎల్‌ఐసీ జీవన్ తరుణ్ పాలసీ.. ప్రతిరోజూ రూ.150 పెట్టుబడితో రూ. 26 లక్షలు రిటర్న్!-why lic jeevan tarun is the best choice for your childs ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /   ఎల్‌ఐసీ జీవన్ తరుణ్ పాలసీ.. ప్రతిరోజూ రూ.150 పెట్టుబడితో రూ. 26 లక్షలు రిటర్న్!

ఎల్‌ఐసీ జీవన్ తరుణ్ పాలసీ.. ప్రతిరోజూ రూ.150 పెట్టుబడితో రూ. 26 లక్షలు రిటర్న్!

HT Telugu Desk HT Telugu
Apr 11, 2022 05:14 PM IST

పిల్లలను భవిష్యత్‌ను తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. పుట్టినప్పటి నుండి తమ కాళ్ళ పై తాము నిలువబడే వరకు పేరెంట్స్ పిల్లల అనేక అవసరాలు తీర్చాల్సి ఉంటుంది. మరీ ఆ అవసరాలను తీర్చాలంటే డబ్బు ప్రదానమైనది.

<p>LIC Jeevan Tarun Policy</p>
LIC Jeevan Tarun Policy

పిల్లలను భవిష్యత్‌ను తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. పుట్టినప్పటి నుండి తమ కాళ్ళ పై తాము నిలువబడే వరకు పేరెంట్స్ పిల్లల అనేక అవసరాలు తీర్చాల్సి ఉంటుంది. మరీ ఆ అవసరాలను తీర్చాలంటే డబ్బు ప్రదానమైనది. పిల్లల చదువులకు,పెంపకానికి, పెళ్లి ఇలా ప్రతిది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు చిన్నప్పటి నుంచే వారికి పెట్టుబడి ప్రణాళికను ప్రారంభించాలి. పిల్లల భవిష్యత్ అవసరాలను తీర్చడానికి అనేక పెట్టుబడి మార్గాలు ఉన్నప్పటికీ ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న పథకం LICకి చెందిన జీవన్ తరుణ్ ప్లాన్.  ఈ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా పిల్లల భవిష్యత్‌ను సురక్షితంగా మార్చవచ్చు. అయితే జీవన్ తరుణ్ పాలసీలో పెట్టుబడి పెట్టాలనుకుంటే, ఈ పథకం చెందిన ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకోండి.

yearly horoscope entry point

జీవన్ తరుణ్‌ పాలసీ

పిల్లల అవసరాలకు అనుగుణంగా ఎల్‌ఐసీ.. జీవన్ తరుణ్‌ను ప్రత్యేకంగా రూపొందించింది. ఇది నాన్-లింక్డ్, వ్యక్తిగత, జీవిత బీమా సేవింగ్స్ ప్లాన్, పార్టిసిపేటింగ్ ప్లాన్. ఈ ప్లాన్‌లో, పెట్టుబడిదారుడు మరణాతరం కలిగే ప్రయోజనం, పొదుపు వంటి ప్రయోజనాన్ని పొందుతారు. మీరు పిల్లల కోసం గరిష్టంగా 25 సంవత్సరాల వరకు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఛైల్గ్ ఏడాది వయస్సులోనే ఈ ప్లాన్‌ను కొనుగోలు చేస్తే, అది 25 సంవత్సరాల వయస్సులో మెచ్యూర్ అవుతుంది. మీరు పిల్లల 10 సంవత్సరాల వయస్సులో ఈ పాలసీని కొనుగోలు చేస్తే, మీరు 15 సంవత్సరాల తర్వాత ఈ రిటర్న్ పొందుతారు.

అర్హత

ఈ పాలసీలో పెట్టుబడి పెట్టడానికి పిల్లల వయస్సు కనీసం 90 రోజుల నుండి 12 సంవత్సరాల వరకు ఉండాలి. ఈ ప్లాన్ కొనగోలు చేసిన తర్వాత పిల్లలకు 20 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం చెల్లించాలి. 25 ఏళ్ళ వయస్సు వచ్చే సరికి, ప్లాన్ మెచ్యూరిటీ రిటర్న్స్‌ను పొందుతారు. అలాగే ఈ పథకం కింద, మీరు 125% సమ్ అష్యూర్డ్ బెనిఫిట్ పొందుతారు.

పాలసీని కొనుగోలు చేసిన తర్వాత తల్లిదండ్రులు మరణిస్తే, అప్పుడు పిల్లలు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. పిల్లలకి 25 ఏళ్లు నిండిన తర్వాత, వారు పూర్తి మెచ్యూరిటీ మొత్తాన్ని పొందుతాడు.

పెట్టుబడి

పిల్లల 0 సంవత్సరాలలో తల్లిదండ్రులు LIC తరుణ్ పాలసీని కొనుగోలు చేస్తే, మీరు ప్రతిరోజూ రూ.150 పెట్టుబడి పెట్టాలి. ప్రతి నెలా 4,500, ఏటా రూ.54,000 పెట్టుబడి పెట్టాలి. 25 సంవత్సరాల తర్వాత, మీరు దాదాపు రూ. 26 లక్షల మొత్తం మొత్తాన్ని పొందుతారు. మీరు ఈ పథకంలో ప్రతి నెల, మూడు నెలలు, ఆరు నెలలు లేదా సంవత్సరానికి పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో, పెట్టుబడిదారుడు రూ. 75,000 బీమా మొత్తాన్ని పొందుతారు.

Whats_app_banner

సంబంధిత కథనం