నేటి జీవితంలో మనందరం ఒకరినొకరు చూడటానికి, మాట్లాడుకోవడానికి సమయం లేకుండా తిరుగుతున్నాం. ఇది మనకు అన్ని రకాల సమస్యలను కలిగిస్తుంది. నిజానికి ఈ రోజుల్లో ఊబకాయం చాలా సాధారణమైపోయింది. నడివయస్కులే కాదు యువత కూడా వీటి బారిన పడుతున్నారు. దీనికి అతి పెద్ద కారణం సరిగాలేని జీవనశైలి, ఇది మనల్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ప్రారంభ దశలో, బరువు పెరగడం మనకు సాధారణమైనదిగా అనిపిస్తుంది, కానీ క్రమంగా ఇది అనేక తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది.
సరైన సమయంలో తినకపోవడం కూడా మీ శరీరానికి హాని కలిగిస్తుందని గుర్తుంచుకోండి, ఏం, ఎప్పుడు, ఎలా తినాలో మనం తెలుసుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు లేదా ఆకలిగా ఉన్నప్పుడల్లా ఆహారం తీసుకోవడం వల్ల అన్ని రకాల వ్యాధుల బారిన పడతారు. అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం సరైన సమయంలో తినడం అవసరం. మీరు దానికి సంబంధించిన కచ్చితమైన సమయాన్ని ఇక్కడ చూడవచ్చు.
ఈ సమయంలో అల్పాహారం తీసుకోండి : ఉదయం నిద్రలేచిన 3 గంటలలోపు అంటే ఉదయం 7:00 నుండి 9:00 గంటల వరకు అల్పాహారం తీసుకోవడానికి ఉత్తమ సమయం. దీని తర్వాత ఏ ఆహారం తీసుకున్నా మన శరీరానికి చాలా రకాలుగా హాని కలుగుతుంది. అలాగే, అల్పాహారం కోసం వోట్మీల్, పాలు, ఆకుపచ్చ కూరగాయలు వంటి ఫైబర్, ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ మాత్రమే తినడానికి ప్రయత్నించండి.
మధ్యాహ్న భోజనానికి ఇదే సరైన సమయం : మీ శరీరం తీవ్రమైన వ్యాధుల నుండి దూరంగా ఉండాలని మీరు కోరుకుంటే, మీ భోజన సమయాన్ని సరిచేయండి. మీరు అల్పాహారం, భోజనం మధ్య కనీసం 5 గంటల విరామం తీసుకోవాలని గుర్తుంచుకోండి. మధ్యాహ్నం 1 గంటలోపు భోజనం చేయాలి.
ఈ సమయంలో డిన్నర్ : రాత్రి భోజనం ఆలస్యంగా తింటే చాలా ప్రమాదమని గుర్తుంచుకోండి. ఇది మీ జీర్ణవ్యవస్థను పాడుచేయడమే కాకుండా, అనేక వ్యాధులతో మిమ్మల్ని చుట్టుముడుతుంది. అందుకే రాత్రి 7:00 నుండి 9:00 గంటల మధ్య రాత్రి భోజనం పూర్తి చేయాలి.
మనం ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా.. మనం తీనే సమయాలు కూడా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు తింటే ఆరోగ్యానికి చాలా ప్రమాదం. అందుకే పైన చెప్పిన సమయాల్లో తినేందుకు ప్రయత్నించండి. చాలా రకాల వ్యాధులు మీ దగ్గరకు రావు.