మీరు న్యూ ఇయర్ పార్టీలో టేస్టీ వంటకాలు ఏమి వండాలా? అని ఆలోచిస్తున్నారా.. మీ న్యూ ఇయర్ పార్టీ ఫుడ్ మెనూలో కాశ్మీరీ స్టైల్ లో వండే చికెన్ కర్రీ ప్రయత్నించండి. దీన్ని చికెన్ రోగన్ జోష్ అంటారు. దీన్ని చూస్తేనే నోరూరిపోతుంది. చికెన్ రోగన్ జోష్ అనేది సాంప్రదాయ కాశ్మీరీ కూర. దీనిలో చికెన్ ముక్కలను మసాలా గ్రేవీలో, సోంపు గింజలు, పొడి అల్లం పొడితో వండుతారు. ఈ కాశ్మీరీ చికెన్ తినడానికి ఎంత టేస్టీగా ఉంటుందో వండుకోవడం కూడా అంతే సులువుగా ఉంటుంది. చికెన్ రోగన్ జోష్ ను వేడి వేడిగా రోటీ, నాన్ లేదా రైస్ తో తినవచ్చు. న్యూ ఇయర్ రోజు రాత్రి ఈ కూరతో డిన్నర్ ప్లాన్ చేయండి. మీకు ఇది ఎంతో నచ్చుతుంది.
చికెన్ - కిలో
పాలు - రెండు స్పూన్లు
యాలకులు - నాలుగు
లవంగాలు - అయిదు
నల్ల మిరియాల పొడి - అర స్పూను
సాదా పెరుగు - అర కప్పు
కారం - మూడు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
బిర్యానీ ఆకులు - నాలుగు
ఎండు మిరపకాయలు - నాలుగు
జీలకర్ర - ఒక స్పూను
నెయ్యి - పావు కప్పు
కుంకుమ పువ్వు - నాలుగు రేకులు
సోంపు పొడి - అర స్పూను
అల్లం పొడి - అర స్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
జీలకర్ర పొడి - అర స్పూను
గరం మసాలా పొడి - అర స్పూను
చికెన్ వంటకాలు కచ్చితంగా న్యూ ఇయర్ పార్టీలో కనిపిస్తాయి. నాన్ వెజ్ ప్రియులు చికెన్ తినకుండా ఉండలేరు. అందుకే ఇక్కడ మేము సరికొత్తగా కాశ్మీరీ చికెన్ వంటకం రెసిపీ ఇచ్చాము ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది.