వేసవి వేడి నుంచి మీ కళ్ళను కాపాడే 7 ఆయుర్వేద రహస్యాలు! ఎండలో తిరిగే వారికి ఇవి ఎంతో ఉపయెగపడతాయి!-this summer heat could be silently damaging your vision 7 ayurveda remedies to protect yourself now ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  వేసవి వేడి నుంచి మీ కళ్ళను కాపాడే 7 ఆయుర్వేద రహస్యాలు! ఎండలో తిరిగే వారికి ఇవి ఎంతో ఉపయెగపడతాయి!

వేసవి వేడి నుంచి మీ కళ్ళను కాపాడే 7 ఆయుర్వేద రహస్యాలు! ఎండలో తిరిగే వారికి ఇవి ఎంతో ఉపయెగపడతాయి!

Ramya Sri Marka HT Telugu

మండుతున్న ఎండల నుంచి శరీరాన్నే కాదు, కళ్లను కూడా కాపాడుకోవడం ముఖ్యం. వేడిగాలుల వల్ల కళ్లలో మంట, పొడిబారడం, ఎరుపుదనం వంటి బాధిస్తున్నాయా? అయితే ఇది మీ కోసమే. ఎండ నుంచి కళ్లకు తక్షణ ఉపశమనం కలిగించే కొన్ని ఆయుర్వేద చిట్కాలను మీ కోసం తీసుకొచ్చాం! అవేంటో తెలుసుకోండి. కళ్లను చల్లగా, ఆరోగ్యంగా ఉంచుకోండి.

అందమైర అమ్మాయి కళ్లు (Image by Unsplash)

ఈసారి ఏప్రిల్ నుంచే ఎండలు మండిపోతున్నాయి. చాలా చోట్ల ఎండ వేడి మామూలు కంటే ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో ఎండాకాలం, అంటే ఏప్రిల్ చివరి నుంచి జూన్ వరకు వేడిగాలులు రావడం సహజమే. ఉత్తర, మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో అయితే మరీ ఎక్కువ. ఏదేమైనా ఈ టైమ్‌లో మనం జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. రోజంగా బాగా నీళ్లు తాగాలి, ఎండలో ఎక్కువ తిరగకూడదు, పలుచని, గాలి బాగా ఆడే బట్టలు వేసుకోవాలి.

వేసవి వేడి నుంచి మన శరీరాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, కళ్లను కూడా జాగ్రత్తగా చూసుకోవడ కూడా అంతే ముఖ్యం. వేడిగాలుల వల్ల కళ్లలో మంట, పొడిబారడం, ఎర్రగా అవ్వడం, కళ్ల దురదలు, ఒక్కోసారి చూపు మందగించడం లాంటి సమస్యలు వస్తాయి. వీటన్నింటి బారిన పడకుండా కంటిని చల్లగా, ఆరోగ్యంగా కాపాడుకోవాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి. ఈ ఆయుర్వేద మార్గాలు మీకంటిని కచ్చితంగా కాపాడతాయి.

ఎండ వేడి తట్టుకోలేక ఎర్రబడ్డ కన్ను
ఎండ వేడి తట్టుకోలేక ఎర్రబడ్డ కన్ను (Image by Freepik)

వేడిగాలుల వల్ల వచ్చే కంటి సమస్యలు

డాక్టర్ బసు ఐ కేర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ మన్‌దీప్ సింగ్ బసు, ఎండాకాలంలో కళ్లకు వచ్చే సమస్యల గురించి ఏం చెప్పారంటే:

  1. కళ్లు పొడిబారడం: ఎక్కువ వేడి వల్ల, ఒంట్లో నీటి శాతం తగ్గిపోతుంది. ఇలాంటప్పుడు కళ్లలో కూడా తేమ తగ్గి పొడిబారుతుంటాయి.
  2. కళ్లలో మంట, ఎర్రగా అవ్వడం: వేసవి వేడి, సూర్యుడి హానికరమైన కిరణాల కారణంగా కళ్లు ఎర్రగా కనిపిస్తాయి, చాలామందికి కళ్లల్లో మంటగా కూడా అనిపిస్తుంది.
  3. వెలుతురు చూడలేకపోవడం: ఎక్కువ సూర్యకాంతి వల్ల కళ్లు వెలుతురును తట్టుకోలేవు. ప్రకాశవంతమైన లైట్లు కూడా ఇబ్బంది పెడతాయి.
  4. కండ్లకలక (కంటి అలర్జీ లేదా ఇన్ఫెక్షన్): ఎండాకాలంలో కళ్లల్లో వైరస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఎక్కువ.
  5. చూపు మందగించడం: కొన్నిసార్లు తక్కువ నీళ్లు తాగడం వల్ల లేదా ఎక్కువ వేడి వల్ల కంటి చూపు సరిగ్గా ఉండదు.

వేడిగాలుల నుండి కళ్ళను రక్షించే 7 ఆయుర్వేద చిట్కాలు:

డాక్టర్ మన్‌దీప్ సింగ్ బసు కొన్ని ఆయుర్వేద పద్ధతులు చెప్పారు. వీటితో మీ కళ్లను వేడి నుంచి కాపాడుకోవచ్చు:

1. త్రిఫలతో కంటిని కడుక్కోవడం:

త్రిఫల పొడిని రాత్రంతా నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీళ్లతో కళ్లు కడుక్కోవాలి. ఇలా చేస్తే వేసవిలో కళ్లు డిబారడం, మంట రావడం వంటి సమస్యలు తగ్గుతాయి.

2. రోజ్ వాటర్:

రోజ్ వాటర్‌తో కళ్లను కడుక్కున్నా కూడా వేసవిలో వచ్చే కంటికి చల్లగా ఉంటుంది.

3. గంధపు చెక్క పేస్ట్:

గంధపు చెక్క పొడికి రోజ్ వాటర్ కలిపి నుదుటి మీద రాసుకుంటే కళ్లకు చల్లగా ఉంటుంది. ఎండలో తిరిగి వచ్చిన తర్వాత ఈ చిట్కా పాటించారంటే మీకు చాలా మంచి అనుభూతి కలుగుతుంది.

4. కలబంద గుజ్జు:

కలబంద గుజ్జును కళ్ల దగ్గర రాసుకోవడం వల్ల కూడా కళ్లు పొడిబారడం, ఎర్రబడటం, మంట వంటివి తగ్గుతాయి. అన్నీ సీజన్లలోనూ కంటిని కాపాడే చక్కటి చిట్కా ఇది.

5. ఘృత నేత్ర తర్పణ:

ఇది ఆయుర్వేదంలో కళ్లకు పోషణ, చల్లదనం ఇచ్చే ఒక పద్ధతి.

6. దోసకాయ, పొట్లకాయ ముక్కలు:

చల్లని దోసకాయ లేదా పొట్లకాయ ముక్కలు కళ్ల మీద పెట్టుకుంటే హాయిగా ఉంటుంది. ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఈ చిట్కా పాటించారంటే హాయిగా, చల్లగా అనిపిస్తుంది.

7. బాగా నీళ్లు తాగాలి:

కొబ్బరి నీళ్లు, మామిడి రసం, షర్బత్ లాంటివి తాగితే శరీరానికి సరిపడా నీరు అందుతుంది. కంటికి తేమ నిలుస్తుంది. ఎలాంటి కళ్ల సమస్యలు రా నీళ్లు సరిగ్గా ఉంటాయి.

కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు:

డాక్టర్ బసు చివరగా ఏం చెప్పారంటే, "ఎండాకాలంలో కళ్లను కాపాడుకోవడానికి సన్ గ్లాసెస్ తప్పకుండా పెట్టుకోండి. మొబైల్, టీవీ లాంటి స్క్రీన్లు చూడటం తగ్గించండి. మీ కళ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి. ఈ ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే మీ కళ్లు సహజంగా చల్లగా, ఆరోగ్యంగా ఉంటాయి."

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.