ఈసారి ఏప్రిల్ నుంచే ఎండలు మండిపోతున్నాయి. చాలా చోట్ల ఎండ వేడి మామూలు కంటే ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో ఎండాకాలం, అంటే ఏప్రిల్ చివరి నుంచి జూన్ వరకు వేడిగాలులు రావడం సహజమే. ఉత్తర, మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో అయితే మరీ ఎక్కువ. ఏదేమైనా ఈ టైమ్లో మనం జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. రోజంగా బాగా నీళ్లు తాగాలి, ఎండలో ఎక్కువ తిరగకూడదు, పలుచని, గాలి బాగా ఆడే బట్టలు వేసుకోవాలి.
వేసవి వేడి నుంచి మన శరీరాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, కళ్లను కూడా జాగ్రత్తగా చూసుకోవడ కూడా అంతే ముఖ్యం. వేడిగాలుల వల్ల కళ్లలో మంట, పొడిబారడం, ఎర్రగా అవ్వడం, కళ్ల దురదలు, ఒక్కోసారి చూపు మందగించడం లాంటి సమస్యలు వస్తాయి. వీటన్నింటి బారిన పడకుండా కంటిని చల్లగా, ఆరోగ్యంగా కాపాడుకోవాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి. ఈ ఆయుర్వేద మార్గాలు మీకంటిని కచ్చితంగా కాపాడతాయి.
డాక్టర్ బసు ఐ కేర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ మన్దీప్ సింగ్ బసు, ఎండాకాలంలో కళ్లకు వచ్చే సమస్యల గురించి ఏం చెప్పారంటే:
డాక్టర్ మన్దీప్ సింగ్ బసు కొన్ని ఆయుర్వేద పద్ధతులు చెప్పారు. వీటితో మీ కళ్లను వేడి నుంచి కాపాడుకోవచ్చు:
త్రిఫల పొడిని రాత్రంతా నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీళ్లతో కళ్లు కడుక్కోవాలి. ఇలా చేస్తే వేసవిలో కళ్లు డిబారడం, మంట రావడం వంటి సమస్యలు తగ్గుతాయి.
రోజ్ వాటర్తో కళ్లను కడుక్కున్నా కూడా వేసవిలో వచ్చే కంటికి చల్లగా ఉంటుంది.
గంధపు చెక్క పొడికి రోజ్ వాటర్ కలిపి నుదుటి మీద రాసుకుంటే కళ్లకు చల్లగా ఉంటుంది. ఎండలో తిరిగి వచ్చిన తర్వాత ఈ చిట్కా పాటించారంటే మీకు చాలా మంచి అనుభూతి కలుగుతుంది.
కలబంద గుజ్జును కళ్ల దగ్గర రాసుకోవడం వల్ల కూడా కళ్లు పొడిబారడం, ఎర్రబడటం, మంట వంటివి తగ్గుతాయి. అన్నీ సీజన్లలోనూ కంటిని కాపాడే చక్కటి చిట్కా ఇది.
ఇది ఆయుర్వేదంలో కళ్లకు పోషణ, చల్లదనం ఇచ్చే ఒక పద్ధతి.
చల్లని దోసకాయ లేదా పొట్లకాయ ముక్కలు కళ్ల మీద పెట్టుకుంటే హాయిగా ఉంటుంది. ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఈ చిట్కా పాటించారంటే హాయిగా, చల్లగా అనిపిస్తుంది.
కొబ్బరి నీళ్లు, మామిడి రసం, షర్బత్ లాంటివి తాగితే శరీరానికి సరిపడా నీరు అందుతుంది. కంటికి తేమ నిలుస్తుంది. ఎలాంటి కళ్ల సమస్యలు రా నీళ్లు సరిగ్గా ఉంటాయి.
డాక్టర్ బసు చివరగా ఏం చెప్పారంటే, "ఎండాకాలంలో కళ్లను కాపాడుకోవడానికి సన్ గ్లాసెస్ తప్పకుండా పెట్టుకోండి. మొబైల్, టీవీ లాంటి స్క్రీన్లు చూడటం తగ్గించండి. మీ కళ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి. ఈ ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే మీ కళ్లు సహజంగా చల్లగా, ఆరోగ్యంగా ఉంటాయి."