ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహార పదార్థాలను తినడం మాత్రమే కాదు సరైన పద్థతిలో తినడం కూడా చాలా అవసరం. మీరు సరైన ఆహారాన్ని తింటున్నారు సరే.. కానీ దాన్ని సరైన పద్ధతిలోనే తింటున్నారో లేదో మీకు తెలుసా? భోజనం చేసేటప్పుడు నేల మీద కూర్చుని తినడం సాంప్రదాయకంగా పాటిస్తున్న పద్ధతి. ఇలా తినడం ఆరోగ్యానికి మంచిదని పద్ధతి అని మన పెద్దలు చెబుతుంటారు.ఇలా ఎందుకంటారు? నేల మీద కూర్చని భోజనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకోవాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అయితే ఇది మీ కోసమే. కింద కూర్చుని తినడం వ్లల కలిగే ప్రయోజనాలేంటని ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు.
ఈమధ్య కాలంలో దాదాపు చాలా ఇళ్లలో డైనింగ్ టేబుల్ తప్పనిసరిగా ఉంటుంది. అలాగే బయటికి వెళ్లినప్పుడు బఫెట్ సిస్టమ్ కామన్ అయిపోయింది. కుదరని పక్షంలో నిల్చుని చేతుల్లో ప్లేటు పెట్టుకుని తినేస్తున్నారు. మొత్తం మీద కింద కూర్చుని తినే పద్ధతి రోజూ రోజుకీ తగ్గిపోతుంది. కుర్చీల మీద కూర్చుని, నిల్చొని భోజనం చేయడం వల్ల మనం చాలా రకాల ప్రయోజనాలను కోల్పోతున్నామట. సాంప్రదాయకమైన ఈ పద్ధతిలో ఆహారం తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలను పొందచ్చట. ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు కలిగిస్తుందట. వాటిలో ముఖ్యమైన కొన్నింటి గురించి తెలుసుకుందాం రండి..
కూర్చుని భోజనం చేయడం వల్ల కడుపు మీద తక్కువ ఒత్తిడి పడుతుంది. దీని వల్ల కడుపు సులభంగా పనిచేస్తుంది. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. శరీరం ఆహారాన్ని బాగా గ్రహిస్తుంది.కూర్చునే భంగిమ ప్రేగులు నాళాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. కాబట్టి మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
రెండు కాళ్లని మడుచుకుని కూర్చుని భోజనం చేయడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. వెన్నుముక వంగిపోకుండా సరిగ్గా నిలబడుదుంది.వెన్నెముక సర్దుబాటుతో శరీర భంగిమ కూడా మెరుగుపడుతుంది.
కూర్చుని నెమ్మదిగా తినడం వల్ల కడుపతో పాటు మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ పద్ధతి వల్ల ఆహారం మీదే దృష్టి పెట్టి, ప్రతి ముద్దను ఆస్వాదించడం జరుగుతుంది.
భారతీయ సంస్కృతి ప్రకారం.. కూర్చుని భోజనం చేయడం కేవలం ఆరోగ్యకరమైనది మాత్రమే కాదు అనుబంధాలకు అనుసంధానంగా పనిచేసే పద్ధతి. కుటుంబ సభ్యులందరితో కలిసి నేల మీద కూర్చుని తినడం వల్ల బలమైన బంధాలను ఏర్పరుచుకోచ్చని భావిస్తారు.
నేల మీద కూర్చుని ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినడం వల్ల మెదడుకు తృప్తి సంకేతాలు త్వరగా అందుతాయి. తద్వారా అతిగా తినే అలవాటు కూడా తగ్గుతుంది. ఫలితంగా బరువును నియంత్రణలో ఉంచుకోగలుగుతారు.
కాళ్లు మడుచుకుని నేల మీద కూర్చుని తినడం వల్ల మోకాళ్లు, తొడ, కోర్ కండరాలు మరింత శక్తివంతంగా పని చేస్తాయి.శరీర చలన పెరుగుతుంది. ఇది కండారాలు బలంగా తయారయేందుకు, ఎముకల సుదీర్ఘతకు సహాయపడుతుంది.
- కూర్చొని తినే సమయంలో వెన్నుముక సూటిగా ఉండేలా చూసుకోండి.
- భోజనం తర్వాత కొద్దిసేపు కూర్చుని ఉండటం లేదా చిన్నపాటి వాకింగ్ వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం