Republic Day Speech: రిపబ్లిక్ డే రోజు పిల్లలకు ఈ స్పీచ్ నేర్పించండి, అందరూ చప్పట్లు కొట్టడం ఖాయం-teach this speech to children on republic day everyone will surely clap ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Republic Day Speech: రిపబ్లిక్ డే రోజు పిల్లలకు ఈ స్పీచ్ నేర్పించండి, అందరూ చప్పట్లు కొట్టడం ఖాయం

Republic Day Speech: రిపబ్లిక్ డే రోజు పిల్లలకు ఈ స్పీచ్ నేర్పించండి, అందరూ చప్పట్లు కొట్టడం ఖాయం

Haritha Chappa HT Telugu
Jan 23, 2025 10:11 AM IST

Republic Day Speech: దేశవ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. పాఠశాలలో మీ పిల్లలకు రిపబ్లిక్ డే స్పీచ్ ఇలా ప్రిపేర్ చేయండి.

రిపబ్లిక్ డే స్పీచ్
రిపబ్లిక్ డే స్పీచ్

దేశవ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. వీటిలో రిపబ్లిక్ డే స్పీచ్ కూడా ఒకటి. పాఠశాలలో ఉపన్యాసం ఇవ్వాలనుకునే పిల్లల కోసం చిన్న ప్రసంగాలు ఇక్కడ ఇచ్చాము. ఇవి చాలా సులువుగా ఉంటాయి. మీ పిల్లల చేత వీటిని ప్రిపేర్ చేయించండి.

  1. స్టేజీపై ఉన్న పెద్దలు, టీచర్లు, క్లాస్ మేట్స్ కు నమస్కారం

ఈ రోజు మనం 76వ గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు జనవరి 26. అందుకే దీన్ని మనం గణతంత్ర దినోత్సవంగా నిర్వహించుకుంటాము. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆగస్టు 15 ఎంత ముఖ్యమో, మన దేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కూడా అంటే ముఖ్యం. ఈ రోజు గురించి మీకు చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను.

మిత్రులారా, ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద దేశం భారతదేశం. ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని కలిగి ఉండటం మనందరికీ గర్వకారణం. ప్రజాస్వామ్యం విషయానికి వస్తే ప్రపంచం గుర్తుంచుకునే దేశం మన భారతదేశం.

భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ భారత రాజ్యాంగ పితామహుడిగా పేరు తెచ్చుకున్నారు. దేశానికి ఒక క్రమబద్ధమైన, అర్థవంతమైన రాజ్యాంగాన్ని రూపొందించి అమలు చేయడంలో ఆయన చేసిన అపారమైన కృషి వల్ల ఆయనను భారత రాజ్యాంగ పితామహుడిగా పిలుస్తారు. ఒక దేశానికి రాజ్యాంగం ఎందుకు అవసరం అనేది కూడా మనమందరం తెలుసుకోవాలి.

ఇల్లు కావచ్చు, చదువుకునే పాఠశాల కావచ్చు, మన దేశం కావచ్చు… మన ఇష్టం వచ్చినట్లు సాగితే అది నావికుడు లేని ఓడలా నడుస్తుంది. ప్రతిదానికీ ప్రవర్తనా నియమావళి, చట్టం ఉంటే క్రమశిక్షణ వస్తుంది. ఈ రాజ్యాంగం మన దేశ అత్యున్నత చట్టం. మన దేశాన్ని నడిపించే ప్రభుత్వం, మన ప్రజాప్రతినిధులు, మన న్యాయస్థానాలు, మనతో సహా పౌరులందరూ ఈ రాజ్యాంగాన్ని బట్టే నడుచుకోవాలి. దేశ రాజ్యాంగం కంటే గొప్పది ఏదీ లేదు. ఈ రాజ్యాంగం పవిత్ర గ్రంథం అనే చెప్పుకోవాలి.

ఈ రోజు నేను మన దేశ రాజ్యాంగం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెబుతాను. దేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం. దీనితో అసలు భారత రాజ్యాంగం చేతిరాతతో రాశారు. దీనిని ప్రేమ్ బిహారీ తన అందమైన చేతిరాతతో ఆంగ్లంలో రాశారు. ఈ మూల రాజ్యాంగాన్ని మన దేశ రాజధాని న్యూఢిల్లీలోని పార్లమెంటు భవనంలో భద్రపరిచారు. ఇది నేటికీ అలాగే ఉంది.

రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8 ఆర్టికల్స్, 22 పార్ట్స్, 395 ఆర్టికల్స్ ఉండేవి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 105 సార్లు రాజ్యాంగాన్ని సవరించారు. ఈ విధంగా భారత రాజ్యాంగంలో ఇప్పుడు 12 ఆర్టికల్స్, 25 పార్ట్స్, 470 ఆర్టికల్స్ ఉన్నాయి.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున దేశ ప్రధాని ఎర్రకోటపై జెండాను ఎగురవేసి ప్రసంగిస్తారు. అయితే గణతంత్ర దినోత్సవం నాడు దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి ఢిల్లీలోని రాజ్ పథ్ వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. జనవరి 25న రాష్ట్రపతి ఒక రోజు ముందుగానే ప్రసంగిస్తారు.

రాజ్యాంగం వల్లనే మన దేశంలో అందరికీ సమానంగా విద్యాబుద్ధులు నేర్పుతున్నారు.అన్ని వర్గాల ప్రజలు సమానంగా విద్యనభ్యసిస్తున్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత భారతదేశంలోని ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులు లభించాయి. రాజ్యాంగం మనకు ప్రసాదించిన ప్రాథమిక హక్కుల మాదిరిగానే ఈ దేశ పౌరులుగా మనం కూడా కొన్ని విధులు నిర్వర్తించాలి.

దేశం కోసం రాజ్యాంగాన్ని రూపొందించి అమలు చేయడానికి అహర్నిశలు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ నమస్కరించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. రాజ్యాంగ ఆకాంక్షలను నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

జై హింద్..

Whats_app_banner