ప్రతి సంవత్సరం శ్రావణ మాసం చాలా భక్తి, అంకితభావంతో జరుపుకుంటారు. పవిత్రమైన మాసం శివుడికి అంకితం చేయబడింది. సంవత్సరంలో ఈ సమయంలో అనేక ఆద్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ పవిత్ర మాసం ఆషాఢ పూర్ణిమ తరువాత ప్రారంభం అవుతుంది. హిందువులు అనేక ముఖ్యమైన పండుగలను జరుపుకునే మాసం ఇది. కాబట్టి, ఈ నెలలో ఏ తేదీలలో ఏ పండగలు రానున్నాయో చూడండి. అలాగే శ్రావణ మాసంలో ప్రతి సోమవారం పవిత్రమైనదే కాబట్టి, శ్రావణ సోమవారాలు ఎప్పుడొస్తున్నాయో చూడండి.
శ్రావణ శివరాత్రి: శ్రావణ మాసంలో నెలలో 14 వ రోజున శివరాత్రి జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 2 వ తేదీన శ్రావణ శివరాత్రి వస్తుంది.
నాగ పంచమి: ఈ ఏడాది ఆగస్టు 9న నాగ పంచమి జరుపుకోనున్నారు.
హరియాలి తీజ్: ఈ ఏడాది ఆగస్టు 7న హరియాలి తీజ్ జరుపుకోనున్నారు.
రక్షా బంధన్: ఈ ఏడాది ఆగస్టు 19న రక్షా బంధన్ వస్తోంది.
కజరి తీజ్: హిందువులు వర్షాకాలాన్ని జరుపుకునే కజరి తీజ్ ఆగస్టు 22 న జరుపుకుంటారు.
కృష్ణాష్టమి: ఈ ఏడాది ఆగస్టు 26న కృష్ణాష్టమి వేడుకలు జరగనున్నాయి.
దృక్ పంచాంగం ప్రకారం ఈ ఏడాది జూలై 22న శ్రావణ మాసం ప్రారంభమై ఆగస్టు 19 వరకు కొనసాగుతుంది. ఈ ఏడాది శ్రావణ మాసం 29 రోజుల పాటు ఉంటుంది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం పవిత్రమే. నియమ నిష్టలతో ఉపవాసాలు ఉంటారు. శివునికి అభిషేకాలు చేస్తారు. అందుకే ఈ సోమవారాల తేదీలు కూడా చూడండి. ఈసారి శ్రావణ మాసంలో 5 సోమవారాలు రానున్నాయి.
మొదటి శ్రావణ సోమవారం: జూలై 22
రెండవ శ్రావణ సోమవారం: జూలై 29
మూడవ శ్రావణ సోమవారం: ఆగస్టు 5
నాల్గవ శ్రావణ సోమవారం: ఆగస్టు 12
ఐదవ శ్రావణ సోమవారం: ఆగస్టు 19
సముద్రం మధనం సమయంలో ఆభరణాలు, లక్ష్మీదేవి, ధన్వంతరి సహా ఎన్నో విలువైన వస్తువులు బయటపడ్డాయి. అయితే, హలాహలం అనే ప్రాణాంతక విషం కూడా సముద్రం నుంచి బయటపడింది. ఈ విషం తాకిన వాళ్లంతా వెంటనే చనిపోయారట. అప్పుడు అప్పుడు బ్రహ్మ, విష్ణువులిద్దరు శివుని సహాయం కోరారు. శివుడు ఆ విషం తాగి దాని ప్రభావం కారణంగా వెంటనే నీలం రంగులోకి మారాడు. అప్పుడు పార్వతీదేవి అతని గొంతులోకి వెళ్లి విషాన్ని మరింత లోపలికి వెళ్లకుండా ఆపింది. అలా శివుడికి నీలకంఠుడు అనే పేరు వచ్చింది. ఈ మహత్తర లోక కళ్యాణం కోసం చేసిన ఘటనలు శ్రావణ మాసంలో జరిగాయి.
అందుకే శ్రావణ మాసంలో అనేక ఆచారాలు పాటిస్తారు. కొన్ని ప్రదేశాల్లో భక్తులు కన్వర్ యాత్రకు వెళ్లి శ్రావణ సోమవారాల్లో ఉపవాసం పాటిస్తారు. అలాగే శివలింగాన్ని నీరు, పాలు, తేనెతో అభిషేకిస్తారు. శివ కథలను పఠిస్తారు, శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి, ఆశీర్వాదం పొందడానికి మంత్రాలు జపిస్తారు.
టాపిక్