చాలామంది వంటగదిలో చేయి కాలినప్పుడు లేదా ఏదైనా వేడి వస్తువు తగిలినప్పుడు వెంటనే బాత్రూంలో ఉన్న టూత్పేస్ట్ను గాయం మీద రాసుకుంటారు. మీరు లేదా మీ చుట్టూ ఉన్నవారు కూడా అలాగే చేస్తుండవచ్చు. కానీ అలా చేయడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని మీకు తెలుసా? మీరనే కాదు వందలో దాదాపు 70 శాతం మంది కాలిన చర్మానికి టూత్పేస్ట్ రాసుకునే తప్పు చేస్తారట. టూత్పేస్ట్ చల్లదనాన్ని కలిగించి మంట, నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుందని చాలామంది అనుకుంటారు, కానీ అది ఒక భ్రమ మాత్రమే. కాలిన చర్మానికి టూత్పేస్ట్ ఎందుకు రాసుకోకూడదో హెల్త్ కోచ్ ప్రీతి షా ఒక అధ్యయనాన్ని ఉదహరిస్తూ వివరించారు. వేడి వస్తువు తగిలినప్పుడు, చర్మం కాలినప్పుడు టూత్పేస్ట్ ఎందుకు రాసుకోకూడదో తెలుసుకుందాం.
టూత్పేస్ట్లో ఉండే కొన్ని రసాయనాలు చర్మానికి హాని కలిగిస్తాయి. దీనివల్ల కాలిన చోట ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, టూత్పేస్ట్లో ఉండే సోడియం ఫ్లోరైడ్ కూడా చర్మానికి హాని కలిగిస్తుంది. ఇది ప్రధానంగా దంతక్షయం రాకుండా కాపాడుతుంది. కానీ సోడియం ఫ్లోరైడ్ కళ్ళు, చర్మం, శ్లేష్మ పొరలకు తగిలితే మంటను కలిగిస్తుంది.
టూత్పేస్ట్ను బ్రష్పై వేసినప్పుడు అది బ్రష్ ఉపరితలాన్ని తాకుతుంది. దీనివల్ల బ్రష్పై ఉన్న బాక్టీరియా టూత్పేస్ట్కు చేరుతాయి. ఇది కాలిన చర్మానికి రాసుకుంటే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
టూత్పేస్ట్లో ఉండే గ్లిసరాల్ ఒక నాన్-టాక్సిక్ పదార్థం, దీన్ని స్వీటెనర్, ఫుడ్ ప్రిజర్వేటివ్గా ఉపయోగిస్తారు. ఇది టూత్పేస్ట్ ఎండిపోకుండా కాపాడుతుంది. కనుక దీన్ని గాయంపై రాస్తే ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంది. అందువల్ల టూత్పేస్ట్ను చర్మానికి రాసుకోకూడదు.
టూత్పేస్ట్ చర్మాన్ని పొడి చేయడమే కాకుండా, దానిపై మందమైన పొరను సృష్టించి, సరైన హైడ్రేషన్ అందకుండా చేస్తుంది. గాయానికి ఆపాదకం కావచ్చు. చర్మానికి మరింత హాని జరగచ్చు.
కాలిన చర్మానికి ఏదైనా క్రీమ్ రాసుకోవాలనుకుంటే, డాక్టర్ సలహా తీసుకోవడం మరిచిపోకండి.