Shakambhari Navratri 2024 : శాకంబరి నవరాత్రులు ఎప్పుడు? ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి?-shakambhari navratri 2024 date and time when is it beginning and how do celebrate ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Shakambhari Navratri 2024 : శాకంబరి నవరాత్రులు ఎప్పుడు? ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి?

Shakambhari Navratri 2024 : శాకంబరి నవరాత్రులు ఎప్పుడు? ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి?

Anand Sai HT Telugu

Shakambhari Navratri 2024 Date and Time : శాకాంబరి నవరాత్రులు హిందూ పండుగలో ఒకటి. పుష్య శుక్ల అష్టమి నాడు ప్రారంభమై పుష్య పూర్ణిమతో ముగుస్తుంది. ఈ నవరాత్రులు తేదీ ఎప్పుడు? ఎలా పూజించాలి తెలుసుకోండి.

శాకంబరి నవరాత్రులు (Pinterest)

పవిత్రమైన శాకంబరి నవరాత్రుల పండుగను హిందువులు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఇది పుష్య శుక్ల అష్టమి నాడు ప్రారంభమై పుష్య పూర్ణిమతో ముగుస్తుంది. హిందూ సాంప్రదాయాల ప్రకారం, పుష్య శుక్ల అష్టమిని బనాద అష్టమి లేదా బనాదష్టమి అని కూడా పిలుస్తారు. పుష్య పూర్ణిమను శాకాంబరి పూర్ణిమ, శాకంబరి నవరాత్రులు అని కూడా అంటారు. చాలా నవరాత్రులు శుక్ల ప్రతిపదలో ప్రారంభమవుతాయి. శాకాంబరి నవరాత్రులు అష్టమి నాడు ప్రారంభమై పుష్య మాసంలోని పౌర్ణమితో ముగుస్తాయి.

శాకాంబరి నవరాత్రులు ఎనిమిది రోజుల పాటు ఉంటాయి. అయితే కొన్నిసార్లు తిథిని దాటవేయడం వల్ల ఏడు లేదా తొమ్మిది రోజులు ఉండవచ్చు. ఈ ఏడాది ఎనిమిది రోజుల పాటు కొనసాగనుంది. ఈ హిందూ పండుగకు సంబంధించిన అన్ని వివరాలు కింద తెలుసుకోండి.

శాకంబరి నవరాత్రి 2024 తేదీ : శుభ ముహూర్తం

శాకంబరి నవరాత్రులు 2024 జనవరి 18 గురువారం ప్రారంభమై 2024 జనవరి 25 గురువారం ముగుస్తాయి. అష్టమితిథి జనవరి 17 రాత్రి 10:06 గంటలకు ప్రారంభమై జనవరి 18 రాత్రి 8:44 గంటలకు ముగుస్తుంది. నవరాత్రి పూర్ణిమ తిథి జనవరి 24 రాత్రి 9:49 గంటలకు ప్రారంభమై జనవరి 25 రాత్రి 11:23 గంటలకు ముగుస్తుంది.

పండుగను ఎలా జరుపుకొంటారు

హిందువులు సంవత్సరానికి నాలుగు సార్లు నవరాత్రిని జరుపుకుంటారు. చైత్ర, శార్దియ నవరాత్రుల సమయంలో దుర్గామాతను పూజిస్తే, శాకాంబరి నవరాత్రుల పండుగ సందర్భంగా భక్తులు శాకంబరి మాతను ప్రార్థిస్తారు. శాకంబరి మాతను కూరగాయలు, పండ్లు, ఆకుపచ్చ ఆకులతో పూజిస్తారు. భగవతీ దేవి రూపాలలో శాకాంబరి మాత ఒకటి అని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి. మానవులు తీవ్రమైన కరువు, ఆహార సంక్షోభాలతో బాధపడుతున్నప్పుడు, భగవతి దేవి వారి బాధను తొలగించడానికి శాకంబరి దేవతగా అవతరించింది. ఈ అమ్మవారు కమలంలో నివసిస్తూ చేతిలో బాణం, కూరగాయలు, ప్రకాశవంతమైన విల్లును కలిగి ఉంటుంది.

అష్టమి రోజున భక్తులు ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించి తమను తాము శుద్ధి చేసుకోవాలి. ముందుగా వినాయకుడిని పూజించాలి. తరువాత శాకాంబరి మాతను ప్రార్థిస్తారు, ధ్యానం చేస్తారు. ప్రార్థనా స్థలంలో దేవత విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచుతారు. గంగాజలాన్ని చల్లుతారు. శాకాంబరి ముందు తాజా పండ్లు, కాలానుగుణ కూరగాయలను పెడతారు. ఆలయాన్ని సందర్శిస్తారు. హల్వా పూరీ, పండ్లు, కూరగాయలు, పంచదార మిఠాయిలు, డ్రై ఫ్రూట్స్ ను అమ్మవారికి సమర్పించాలి. భక్తితో అమ్మవారిని ప్రార్థించాలి.