ఇంట్లో ఎన్ని వంటకాలు చేసుకున్నా రెస్టారెంట్ వైపే మొగ్గు చూపడం ఇటీవలికాలంలో పెరిగిపోయింది. అయితే రెస్టారెంట్ స్టైల్ రెసిపీలు మనం ఇంట్లో కూడా సులువుగా చేసుకోవచ్చు. ఖర్చు ఆదా. అలాగే ఆరోగ్యమూ పదిలంగా ఉంటుంది. ఈ కోవలో ఎగ్ కీమా రెసిపీ ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం
స్టెప్ 1: రెండు మూడు టమోటాలు పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అలాగే రెండు ఉల్లిపాయలు తురుముకోవాలి. అలాగే మూడు లేదా నాలుగు గుడ్లు ఉడికించి తురిమి పెట్టుకోవాలి.
స్టెప్ 2: పాన్ వేడి చేసి 3 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. వేడయ్యాక అర టీ స్పూన్ జీలకర్ర వేసి, 2 కప్పుల ఉల్లిపాయల ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగనివ్వాలి. మూత పెట్టి ఉల్లిపాయలు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి.
స్టెప్ 4: ఈ సమయంలో రెండు పచ్చి మిర్చి ముక్కలు, ఒకటిన్నర టీస్పూన్ల మిర్చి పొడి వేసి కలుపుకోవాలి.
స్టెప్ 5: కాసేపు మగ్గిన తరువాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలపాలి. తరువాత ఒక టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి.
స్టెప్ 6: ఇప్పుడు ఉడికించి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గుడ్లను ఇందులో వేసి కలపాలి.
స్టెప్ 7: ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠానీలు వేసి కలుపుకోవాలి.
స్టెప్ 8: ఒక కప్పు నీరు పోసుకుని మిక్స్ చేసి తక్కువ మంట మీద 2 నిమిషాలు ఉడికించాలి.
స్టెప్ 9: చివరగా పావు టీ స్పూన్ గరం మసాలా పొడి కలుపుకోవాలి. దించే ముందు కొత్తిమీర వేసుకోవాలి.