Mukesh Ambani: హిందూ వివాహ వ్యవస్థ గురించి ముఖేష్ అంబానీ చెప్పింది వింటే పెళ్లి కానివారు వెంటనే వివాహానికి సిద్ధమైపోతారు-read how mukesh ambani spoke highly of the hindu marriage system at anant ambanis wedding ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mukesh Ambani: హిందూ వివాహ వ్యవస్థ గురించి ముఖేష్ అంబానీ చెప్పింది వింటే పెళ్లి కానివారు వెంటనే వివాహానికి సిద్ధమైపోతారు

Mukesh Ambani: హిందూ వివాహ వ్యవస్థ గురించి ముఖేష్ అంబానీ చెప్పింది వింటే పెళ్లి కానివారు వెంటనే వివాహానికి సిద్ధమైపోతారు

Haritha Chappa HT Telugu

Mukesh Ambani: హిందూ వివాహ వ్యవస్థపై ముఖేష్ అంబానీ చక్కగా చెప్పారు. అనంత్ అంబానీ పెళ్లిలో ఈయన చెప్పింది వింటే పెళ్లి కాని యువత వెంటనే వివాహానికి సిద్ధమైపోతారు. వివాహం అనేది వ్యక్తిగతమైనది కాదని, అది సామాజికమైనదని అభిప్రాయపడ్డారు ముఖేష్ అంబానీ.

అనంత్ అంబానీ పెళ్లిలో ముఖేష్ అంబానీ

ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి రాధికా మర్చెంట్‌తో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లిలో అంబానీల కుటుంబం ఆనందంతో ఉప్పొంగిపోయింది. జూలై 12, 2024 న జరిగిన ముఖేష్ అంబానీ - నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకకు ప్రపంచ దేశాల నుంచి ఎంతో మంది సెలెబ్రిటీలు వచ్చారు. ఏడేల్ల పాటూ ప్రేమలో మునిగిన అనంత్ - రాధికా పెద్దల అనుమతితో… ఆకాశమంతా పందిరి కింద పరిణయమాడారు. వీరి పెళ్లి గురించి పది కాలాల పాటూ అందరూ చెప్పుకునే విధంగా జరిగాయి వివాహ వేడుకలు. ఈ సందర్భంగా ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవేత్త, అనంత్ తండ్రి ముకేశ్ అంబానీ భావోద్వేగానికి గురయ్యారు. అనంత్-రాధికల వివాహం సందర్భంగా దేశవిదేశాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో సనాతన హిందూ వివాహం ప్రాముఖ్యతను ముఖేష్ అంబానీ వివరించారు.

పెళ్లంటే ఇదే…

అనంత్-రాధికల వివాహ వేడుక ప్రారంభానికి ముందు ముఖేష్ అంబానీ వేదికపైకి వచ్చారు. అక్కడున్న అతిథులందరికీ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం సంప్రదాయ హిందూ వివాహాల ప్రాముఖ్యతను వివరించారు. హిందూ వివాహం ఒక వ్యక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టమని చెప్పారు. ఇది ఒక వ్యక్తిని సమాజంతో, మతంతో, ఆధ్యాత్మికతతో అనుసంధానిస్తుందని వివరించారు. పెళ్లి అనేది కుటుంబానికి ఆధారమని, కుటుంబమే సమాజానికి ఆధారమని చెప్పారు.

భారతీయ సంప్రదాయం ప్రకారం వివాహం ఇద్దరు వ్యక్తుల మధ్య కాదని, రెండు కుటుంబాలు, వారి స్నేహితులు, బంధువుల మధ్య జరుగుతుందన్నారు. కాబట్టి, అనంత్ - రాధికల పవిత్రమైన వివాహ వేడుకలో తమ సంతోషాన్ని పంచుకునేందుకు అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించినట్టు ఆయన చెప్పారు. పూర్తి హిందూ ఆచారాలతో జరిగిన అనంత్ - రాధికా వివాహం అందంగా, ఆనందంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

శ్రీమహావిష్ణువు హృదయంలో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసిస్తున్నట్లే, రాధిక కూడా అనంతుని హృదయంలో ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా తమ కులదేవత, గ్రామ దేవత, ఇష్ట దేవతలను ఆయన తలచుకున్నారు. తమ వ్యాపార కుటుంబంలోని పూర్వీకులందరినీ భక్తిశ్రద్ధలతో ప్రార్థిస్తున్నట్టు ముఖేష్ తెలిపారు. ఈ ప్రత్యేక సందర్భంలో, ప్రకృతిలోని పంచభూతాలను ప్రార్థిస్తున్నట్టు ఆయన చెప్పారు.

పెళ్లంటే నూరేళ్ల పంట అని సనాతన సాంప్రదాయాల్లో చెబుతూనే ఉన్నారు. పెళ్లిలోని ప్రతి ఘట్టం ముఖ్యమైనదే. ప్రతి ఆచారం, వాగ్ధానం వెనుక ఎంతో అర్థం ఉంది. మంగళప్రదమైన మంగళసూత్రాన్ని ధరించడం ద్వారా పెళ్లిలోని ముఖ్య తంతు పూర్తవుతుంది. మూడు ముళ్లు వేయడం ద్వారా ఇద్దరి జీవితాలు ముడిపడిపోతాయి. త్రికాలాలు, త్రిమూర్తులు, త్రిగుణాలు... మూడే ఉంటాయి. ప్రతి వ్యక్తికి స్థూల, సూక్ష్మ, కారణ అనే మూడు శరీరాలు ఉంటాయి. ఆ మూడు శరీరాలను కలిపి మూడు ముళ్లు అనే అర్థంలో మంగళసూత్రాన్ని కడతారు.