చాలా మంది స్త్రీలకు రుతుస్రావం సమయంలో ఎన్నో సమస్యలు వస్తాయి. పొత్తికడుపు నొప్పి, రొమ్ము, వెన్నునొప్పి వంటివి ఎక్కువగా కనిపిస్తాయి.ఈ నెలసరి నొప్పి కొన్నిసార్లు కాళ్ల వరకు వ్యాపిస్తుంది. రుతుస్రావం సమయంలో హార్మోన్లలో విపరీతమైన మార్పుల వల్ల స్త్రీలకు కాలు నొప్పి వంటి సమస్యలు వస్తూ ఉంటాయి.
అయితే కాళ్ల నొప్పులు భరించలేనంతగా మారుతుంటే అది కూడా మీకు ఆరోగ్య సమస్య ఉందనడానికి సంకేతం కావచ్చు. నెలసరి సమయంలో కాళ్ల నొప్పులను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం.
రుతుచక్రం సమయంలో ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్ స్రవించే రేటు ఎక్కువగా ఉంటుంది. ప్రోస్టాగ్లాండిన్ గర్భాశయంలోని కండరాలపై పనిచేస్తుంది. ప్రోస్టాగ్లాండిన్లు గర్భాశయ సంకోచాలకు, ఎండోమెట్రియంను బయటకు పంపడానికి సహాయపడతాయి. ప్రోస్టాగ్లాండిన్ శరీరంలో మంటను కలిగిస్తుంది. దీనివల్ల వీపు, కాళ్ళు, దిగువ వీపులలో నొప్పి వస్తుంది.
ఇది కాకుండా, కొన్ని సందర్భాల్లో, రుతుస్రావం సమయంలో అధిక కాలు నొప్పి కూడా వస్తుంది. ఇది మీ శరీరంలో ఏదో లోపం ఉందని చెప్పే లక్షణం కావచ్చు.
రుతుస్రావం సమయంలో కాళ్ల నొప్పులకు ఫైబ్రాయిడ్లు కారణం కావచ్చు. ఇది రుతుస్రావం సమయంలో తీవ్రంగా ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ అనేది గర్భాశయం వెలుపల గర్భాశయం పొర పెరగడం ప్రారంభించే ఆరోగ్య పరిస్థితి. ఇది కాలు నొప్పికి కూడా దారితీస్తుంది. 2018 లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, సయాటిక్ నరాలపై ఎండోమెట్రియాటిక్ పెరుగుదల తుంటి, కాళ్ళలో నొప్పికి దారితీస్తుంది.
మరీ బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల రక్త ప్రసరణలో సమస్యలు వస్తాయి. కాబట్టి వీలైనంత సౌకర్యవంతంగా ధరించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఈ నొప్పి రుతుచక్రం సమయంలో లేదా రుతుచక్రానికి కొద్ది గంటల ముందు ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు ఇది రుతుస్రావానికి ఒక రోజు ముందు కూడా కనిపిస్తుంది. ఈ నొప్పికి ఎటువంటి వైద్య సహాయం అవసరం లేదు. ఇంటి నివారణల సహాయంతో నయం అయిపోతుంది. అలాకాకుండా ఈ కాళ్ల నొప్పులు రుతుస్రావానికి వారం ముందు ప్రారంభమైతే మాత్రం తేలికగా తీసుకోకూడదు. ఆ నొప్పిని సాధారణ నొప్పిగా చెప్పలేము. ఈ సందర్భంలో మీరు వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది.
నెలసరి సమయంలో వచ్చే సాధారణ కాళ్ల నొప్పులను దూరం చేసుకోవడానికి హీట్ బ్యాగులను ఉపయోగించవచ్చు. ఇది మీ కండరాలను రిలాక్స్ చేస్తుంది. అయితే 30 నిమిషాల పాటు నెమ్మదిగా నడవడానికి ప్రయత్నించండి. ఎక్కువ అలసటను కలిగించని సులభమైన ఆసనాలు చేయండి. శరీరంలో నీటి పరిమాణాన్ని సమతుల్యం చేయడానికి కొబ్బరి నీరు త్రాగాలి.
పీరియడ్స్ కు కనీసం వారం రోజుల ముందు ఉప్పు, స్పైసీ, షుగర్ ఫుడ్స్ తగ్గించండి. ఇలా చేయడం వల్ల కండరాల్లో నొప్పి తగ్గుతుంది. తద్వారా నెలసరి సమయంలో కాస్త రిలాక్స్ గా ఫీల్ అవుతారు. రుతుచక్రం సమయంలో తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటే, నొప్పిని భరించలేకపోతే డాక్టర్ ను కలవడం మంచిది.
(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)
సంబంధిత కథనం
టాపిక్