ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ప్రతి సంవత్సరం మొహర్రంను భక్తిశ్రద్ధలతో పాటిస్తారు. రంజాన్ తర్వాత ఇస్లాంలో అత్యంత పవిత్రమైన నెలల్లో ఇది ఒకటి. ఈ నెల ఇస్లామిక్ చంద్రమాన క్యాలెండర్కు ప్రారంభాన్ని సూచిస్తుంది. హిజ్రీ క్యాలెండర్లో రంజాన్ తర్వాత ఇది రెండవ అత్యంత పవిత్రమైన నెలగా పరిగణిస్తారు. దీని తర్వాత సఫర్, రబీ-అల్-థాని, జుమాదా అల్-అవ్వాల్, జుమాదా అత్-థానియా, రజబ్, షాబాన్, రంజాన్, షవ్వాల్, జు అల్-ఖదా (లేదా ధుల్ ఖదా), జు అల్-హిజ్జా (లేదా జిల్ హిజ్జా/ధుల్ హిజ్జా) అనే చాంద్రమాన నెలలు వస్తాయి.
2025లో మొహర్రం జూన్ 27, శుక్రవారం ప్రారంభమైంది. మొహర్రం నెలలో 10వ రోజును ఆషూరాగా పాటిస్తారు. అందువల్ల, ఈ సంవత్సరం, ఆషూరా జూలై 6, ఆదివారం వస్తుంది.
మస్జిద్-ఎ-నఖోడా మర్కాజీ రూయత్-ఎ-హిలాల్ కమిటీ ప్రకారం, భారతదేశంలో జూన్ 26న చంద్రుడు కనిపించాడు. అందువల్ల, మొహర్రం-ఉల్-హరామ్ మొదటి రోజు జూన్ 27న ప్రారంభమైంది. ఆషూరా ఆదివారం వస్తుంది.
ఇస్లామిక్ నూతన సంవత్సరాన్ని అల్ హిజ్రీ లేదా అరబిక్ నూతన సంవత్సరం అని కూడా పిలుస్తారు. మొహర్రం మొదటి రోజున ప్రారంభమవుతుంది. ఈ నెల ప్రార్థన, ధ్యానం కోసం ఒక సమయాన్ని సూచిస్తుండగా, దాని 10వ రోజు ఆషూరా. ప్రవక్త ముహమ్మద్ మనవడు హుస్సేన్ ఇబ్న్ అలీ 680 CEలో కర్బాలా యుద్ధంలో అమరుడైన జ్ఞాపకార్థం శోకంతో అనేక మంది ముస్లింలు దీనిని పాటిస్తారు. ఈ యుద్ధం ఇస్లామిక్ చరిత్రలో అపారమైన మతపరమైన, రాజకీయ ప్రాముఖ్యతను కలిగి ఉంది.
మొహర్రం సున్నీ, షియా ముస్లింలు ఇద్దరికీ చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. యజీద్ I కాలిఫేట్ కాలంలో ఈ యుద్ధం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ మనవడు ఇమామ్ హుస్సేన్ ఇబ్న్ అలీ.. యజీద్ అన్యాయమైన పాలన కారణంగా విధేయత ప్రకటించడానికి నిరాకరించారు. కూఫాకు వెళుతుండగా, హుస్సేన్ను, అతని చిన్న బృందాన్ని కర్బాలా వద్ద అడ్డగించి క్రూరంగా చంపేస్తారు. ఇమామ్ హుస్సేన్ న్యాయం, ఇస్లామిక్ విలువలను నిలబెట్టడం కోసం అమరుడయ్యారు.
ఇస్లామిక్ సంవత్సరం యొక్క మొదటి నెల అయిన మొహర్రం, ప్రార్థన, ధ్యానం యొక్క పవిత్ర సమయం. ఈ నెలలో యుద్ధం నిషేధం. ఇది ఇమామ్ హుస్సేన్ అమరత్వాన్ని గుర్తు చేసుకునే నెల కూడా. ఇది న్యాయానికి, త్యాగానికి ప్రతీక. ఈ ఆధ్యాత్మికంగా ముఖ్యమైన కాలంలో ముస్లింలు ఈ ప్రధాన విలువలను పాటిస్తారు.
టాపిక్