కొన్నేళ్లుగా మయొనైజ్ వాడకం బాగా పెరిగిపోయింది. ఫ్రెంచ్ ఫ్రైస్, కబాబ్లు, మోమోలు, చిప్స్ ఇలా చాలా రకాల స్నాక్స్లో మయొనైజ్ను నంచుకొని తింటున్నారు. కొన్ని వంటల్లోనూ వాడుతున్నారు. అయితే, కొంతకాలంగా మయొనైజ్ హాట్టాపిక్గా మారింది. హైదరాబాద్లో మోమోస్లో వేసిన మయొనైజ్ కారణంగా ఓ మహిళ మృతి చెందారు. దీంతో గుడ్డుతో తయారు చేసే మయొనైజ్ను తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేసింది. అయితే, మయొనైజ్ అతిగా తినడం వల్ల స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చాలా తలెత్తుతాయని ఓ డైటిషియన్ వెల్లడించారు. ఆ వివరాలివే..
ఆరోగ్యంపై మయొనైజ్ ప్రభావం గురించి హెచ్టీ లైఫ్స్టైల్తో ఢిల్లీ ద్వారకలోని మణిపాల్ ఆసుపత్రి న్యూట్రిషన్, డైటెటిక్స్ కన్సల్టెంట్ డైటిషియన్ విశాలీ వర్మ మాట్లాడారు. “ఎగ్తో తయారు చేసే దానితో పాటు రకరకాలైన మయొనైజ్ అందుబాటులో ఉన్నాయి. ఎక్కువగా దొరికే ఎగ్ బేస్డ్ మయొనైజ్ను గుడ్డు సొన, నూనె, వెనిగర్/నిమ్మరసంతో తయారు చేస్తారు. క్రీమీ టెక్స్చర్ ఉండేలా చేస్తారు. అయితే, దాన్ని సరిగా నిల్వ చేయాల్సి ఉంటుంది. సరిగా నిల్వ చేయని మయొనైజ్ తింటే అనారోగ్యానికి చేటు కలుగుతుంది” అని వైశాలి వెల్లడించారు. అలాగే, మయొనైజ్ ఎక్కువగా తింటే కలిగే నష్టాలు వివరించారు. అవేవంటే..
మయొనైజ్ ఎక్కువగా తినడం వల్ల వెంటనే కూడా ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. తక్కువ కాలంలోనే ఆరోగ్యం సమస్యలు తలెత్తే రిస్క్ ఉంటుంది.
మయొనైజ్ ఎక్కువగా తినడం వల్ల దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యల రిస్క్ కూడా ఉంటుంది.
మయొనైజ్ బదులు.. గ్రీక్ యగర్ట్, హమ్మస్ లాంటివి వాడొచ్చు. వీటివల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.
టాపిక్