Ghee On Feet: పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మర్దన చేసుకుంటే ఆరు సమస్యల నుంచి తప్పించుకోవచ్చు!-massaging your feet with ghee before going to bed and get these magical health benifits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ghee On Feet: పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మర్దన చేసుకుంటే ఆరు సమస్యల నుంచి తప్పించుకోవచ్చు!

Ghee On Feet: పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మర్దన చేసుకుంటే ఆరు సమస్యల నుంచి తప్పించుకోవచ్చు!

Ramya Sri Marka HT Telugu
Dec 29, 2024 07:30 PM IST

Ghee On Feet: నెయ్యి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని అందరికీ తెలుసు. కానీ నెయ్యితో మర్దనా చేసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చని తెలుసా? అవును.. రాత్రి పడుకునే ముందు పాదాలకు నెయ్యితో మర్దన చేసుకున్నారంటే ఆరు రకాల సమస్యలను దూరం చేసుకోవచ్చట. అవేంటో చూసేద్దామా?

పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మర్దన చేసుకుంటే ఆరు సమస్యల నుంచి తప్పించుకోవచ్చు!
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మర్దన చేసుకుంటే ఆరు సమస్యల నుంచి తప్పించుకోవచ్చు! (shutterstock)

నెయ్యి, మనం తరచుగా వంటల్లో ఉపయోగించే ఒక ఆరోగ్యకరమైన పదార్థం మాత్రమే కాదు, ఆరోగ్య పరంగా కూడా అనేక ప్రయోజనాలను కలిగించే ప్రాకృతిక ఉత్పత్తి. నెయ్యి పాదాలకు, చర్మానికి, జుట్టుకు ఉపయోగించడం వల్ల పొందే లాభాలు అనేకం. ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. రాత్రి పడుకునే ముందు పాదాలకు నెయ్యి రాసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు.

yearly horoscope entry point

పాతకాలం నుంచీ మన బామ్మలు, అమ్మలు నెయ్యి మర్దనా గురించి తరచుగా చెప్తుంటారు. కానీ మనం అది పట్టించుకోము, పాటించం కూడా. వాస్తవానికి పెద్దలు చెప్పిన మాటలు, పాటించిన పద్ధతులు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయి. పడుకునే ముందు పాదాలకు నెయ్యి రాసుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో ఇలా చేయడం వల్ల మలబద్ధకం నుంచి కీళ్ల నొప్పులు వరకూ అనేక సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

మలబద్దకం:

చలికాలంలో చాలా మంది మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను ఎదుర్కొంటారు. మెడిసిన్లు వేసుకున్న కూడా దీని నుంచి ఉపశమనం పొందనివారికి నెయ్యి మసాజ్ బాగా ఉపయోగపడుతుంది. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు అరికాళ్లను నెయ్యితో రుద్దుతూ మర్దనా చేసుకున్నారంటే దీర్ఘకాలిక మలబద్దకాన్ని కూడా నయం చేసుకోవచ్చు.

నొప్పులు:

శీతాకాలంలో చాలా మందికి కీళ్ల నొప్పులు, నడుము నొప్పి పెరుగుతాయి. తరచుగా ఈ సమస్యలతో బాధపడుతుంటే, నెయ్యి రాయడం ఈ నొప్పిని తగ్గిస్తుంది. నెయ్యి పాదాలపై రుద్దడం వలన ద్రవం శరీరంలో సరిగ్గా ప్రవహించేందుకు సహాయం చేస్తుంది. అలాంటప్పుడు రాత్రిపూట అరికాళ్లపై నెయ్యి రుద్దడం వల్ల ఈ కీళ్లన్నీ ఉత్తేజితమై నొప్పి తగ్గుతుంది.

ప్రశాంతమైన నిద్ర:

నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడేవారికి నెయ్యి మసాజ్ చాలా బాగా సహాయపడుతుంది. పాదాలకు నెయ్యి రాసుకోవడం వల్ల నిద్రలో నొప్పులు తగ్గి, మీరు మరింత విశ్రాంతి పొందవచ్చు. రాత్రి పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మర్దనా చేసుకోవడం వల్ల పాదాలు తేలికగా మారతాయి. తద్వారా మీరు ప్రశాంతమైన నిద్ర పొందగలుగుతారు.

రక్త ప్రసరణ పెరుగుతుంది:

చలిలో రక్త నాళాలు కుంచించుకుపోయి రక్త ప్రసరణ కూడా తగ్గుతుంది. నెయ్యి పాదాలకు రాయడం వల్ల రక్తప్రవాహం సక్రమంగా ఉంటుంది. ఇది పాదాలకు తగిన ఆహారం చేరడానికి, శరీరంలోని ఇతర అవయవాలకు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు దేశీ నెయ్యిని అరికాళ్లపై రుద్దడం వల్ల రక్త ప్రసరణ పెరుగి ఆరోగ్యంగా జీవిస్తారు.

అరికాళ్ల నొప్పులు:

చాలా మందిని ఉదయం నుంచీ రాత్రి వరకూ అరికాళ్లలో మంట, నొప్పి వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. నెయ్యి పాదాలకు రాయడం వలన పాదాలు శాంతియుతంగా, ప్రశాంతంగా మారుతాయి. ఫలితంగా అరికాళ్ల నొప్పులతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గుతుంది. రోజూ రాత్రి పాదాలకు దేశీ నెయ్యితో మర్దన చేసుకుంటే మంటకు శాశ్వతంగా చెక్ పెట్టచ్చు.

వాతం:

ఆయుర్వేదంలో రోగాలకు మూడు విషయాలు కారణమని చెబుతారు. వాతం, పిత్తాశయం, కఫం. ఈ మూడింటిలో శరీరంలో వస్తువు పరిమాణం పెరిగినప్పుడు రకరకాల వ్యాధులు మొదలవుతాయి. పాదాల అరికాళ్లను మసాజ్ చేయడం వల్ల వాత సమతుల్యం అవుతుంది. సగం రోగాల నుంచి తప్పించుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం