Cancer In India : ప్రపంచంలో క్యాన్సర్ రాజధానిగా భారత్.. షాకింగ్ విషయాలు!-india is becoming the capital of cancer in the world know survey shocking facts ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cancer In India : ప్రపంచంలో క్యాన్సర్ రాజధానిగా భారత్.. షాకింగ్ విషయాలు!

Cancer In India : ప్రపంచంలో క్యాన్సర్ రాజధానిగా భారత్.. షాకింగ్ విషయాలు!

Anand Sai HT Telugu
Apr 11, 2024 12:30 PM IST

Cancer Capital India : క్యాన్సర్ మహమ్మారితో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇండియాలో క్యాన్సర్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉంది. ఓ సర్వే షాకింగ్ విషయాలు వెల్లడించింది.

ఇండియాలో క్యాన్సర్ కేసులు
ఇండియాలో క్యాన్సర్ కేసులు (Unsplash)

ఇటీవలి సంవత్సరాలలో క్యాన్సర్ మహమ్మారి చాలా సాధారణమై పోయింది. ఈ క్యాన్సర్ కారణంగా చాలా కుటుంబాలు బాధపడుతున్నాయి. క్యాన్సర్ అనేది ఆ వ్యక్తినే కాదు, మొత్తం కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ వస్తే, వారు ఆర్థికంగా చాలా నష్టపోతారు.

yearly horoscope entry point

భారతదేశంలో క్యాన్సర్ వ్యాధి విజృంభిస్తోంది. అమెరికా, ఇంగ్లండ్ సహా భారతీయులు అత్యధికంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ముఖ్యంగా భారతదేశంలోని యువతరం క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొంటోంది. ఇది ఆందోళన కలిగించే విషయం.

రెండో స్థానంలో భారత్

ఆసియా ఖండంలోనే అత్యధికంగా కేన్సర్ వ్యాధిగ్రస్తులున్న దేశాల్లో భారత్ 2వ స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని దశాబ్దాల క్రితం అరుదుగా కనిపించే క్యాన్సర్ ఇప్పుడు విజృంభిస్తోంది. మారిన జీవనశైలి, వినియోగం వంటివి అధిక కెమికల్ కంటెంట్ ఉన్న ఆహారాలు, క్యాన్సర్ పెరుగుదలకు ప్రధాన కారణం.

పెరుగుతున్న కేసులు

కానీ ఒక కొత్త అధ్యయనం ప్రకారం భారతదేశం రెండేళ్లలో క్యాన్సర్ రాజధాని అవుతుంది. హెల్త్ ఆఫ్ ది నేషన్ అనే నివేదిక భారతదేశాన్ని ప్రపంచంలోని క్యాన్సర్ రాజధాని అని పేర్కొంది. ప్రపంచ రేటుతో పోలిస్తే భారతదేశంలో పెరుగుతున్న క్యాన్సర్ రేట్లు ముఖ్యంగా ఆందోళనకరంగా ఉన్నాయని తెలిపింది.

2025 నాటికి కేసుల్లో పెరుగుదల

నివేదిక ప్రకారం, 2020లో భారతదేశంలో 13 లక్షల మందికి క్యాన్సర్ ఉంది. 2025 నాటికి ఇది 15.7 లక్షల కేసులకు పెరుగుతుందని అంచనా. ఐదేళ్లలో ఇది 13 శాతం పెరుగుదల. దీనికి తోడు క్యాన్సర్ బారిన పడిన వారి సగటు వయసు కూడా తగ్గుముఖం పట్టడం ఆందోళనను మరింత పెంచింది. ఎందుకంటే ఏ దేశంలోనూ లేనంత చిన్న వయసులోనే క్యాన్సర్‌ వస్తోంది ఇక్కడ.

'భారతదేశంలో క్యాన్సర్ నిర్ధారణ వయస్సు ఇతర దేశాల కంటే తక్కువగా ఉంది. పరిశోధన ప్రకారం, భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ సగటు వయస్సు 52, USA ఐరోపాలో సగటు వయస్సు 63. ఊపిరితిత్తుల క్యాన్సర్ సగటు వయస్సు 59 ఏళ్లు, ఇతర దేశాల్లో సగటు వయస్సు 70 ఏళ్లుగా ఉంది.' అని నివేదిక పేర్కొంది

క్యాన్సర్ స్క్రీనింగ్ తక్కువే

భారత్‌లో క్యాన్సర్‌తో బాధపడుతున్న వారిలో 30 శాతం మంది 50 ఏళ్లలోపు వారేనన్న ఆందోళనకరమైన వాస్తవం వెలుగులోకి వచ్చింది. భారతదేశంలో క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకుంటున్న వారి సంఖ్య కూడా తక్కువగా ఉంది.

రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ అమెరికాలో 82 శాతం, యూకేలో 70 శాతం, చైనాలో 23 శాతం ఉండగా భారతదేశంలో ఈ సంఖ్య 1.9 శాతం మాత్రమే. గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ అమెరికాలో 73 శాతం, యూకేలో 73 శాతం ఉంది. చైనాలో 70 శాతం. ఇది 43 శాతం అయితే భారతదేశంలో ఈ రేటు 0.9 శాతం. అందువల్ల భారతదేశంలో క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకుంటున్న వారి సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. ఇది మరణాల రేటు పెరగడానికి ప్రధాన కారణం అవుతుందని చెప్పవచ్చు. ఈ మహమ్మారిపై కచ్చితంగా అవగాహన పెంచుకోవాలి.

Whats_app_banner