చారిత్రక నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఇప్పుడు అది ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతోంది. వేసవి సెలవుల్లో పిల్లలతో పాటు హైదరాబాద్ చూసేందుకు ఎంతో మంది ఇష్టపడతారు. అక్కడ సందర్శనీయ ప్రాంతాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వెళ్లేముందే మీరు ఏ ఏ ప్రాంతాలను చూడాలో ప్లాన్ వేసుకోండి.
హైదరాబాదులో చూడాల్సిన ప్రాంతాల జాబితా ఇక్కడ ఇచ్చాము. మీరు అక్కడ బస చేసే రోజుల సంఖ్యను బట్టి ఏ ఏ ప్రాంతాలను చూడవచ్చు. ముందుగానే షెడ్యూల్ చేసుకోవాలి. ఎక్కువ రోజులు ఉంటే ఎక్కువ ప్రాంతాలు చూసే అవకాశం ఉంటుంది.
అనంతగిరి హిల్స్ హైదరాబాద్కు దగ్గరగా ఉన్న అందమైన కొండ ప్రాంతం ఇది. పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళ్లడానికి మంచి ప్రదేశం. ప్రకృతిలో ఆనందంగా కొన్ని గంటల పాటు ఉండాలనుకుంటే అనంతగిరి హిల్స్ కు వెళ్ళండి. మీకు కచ్చితంగా ఇది నచ్చుతుంది.
హైదరాబాద్కు చిహ్నం లాంటిది చార్మినార్. దీని చుట్టుపక్కల మార్కెట్లు ఎన్నో ఉంటాయి. మీకు కావాల్సిన ఎన్నో వస్తువులు తక్కువ ధరకే లభిస్తాయి. అంతేకాదు ఈ ప్రాంతమంతా పాతకాలపు నిజాముల నిర్మాణ శైలిని గుర్తు చేసేలా ఉంటుంది. కచ్చితంగా మీరు చార్మినార్ చూసేందుకు ప్రయత్నించండి.
ఈ మ్యూజియంలో నిజాంల వస్తువులు ఎన్నో కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అరుదైన కళా వస్తువులు కూడా ఉంటాయి. పిల్లలతో కలిసి చూసేందుకు ఇది అందమైన అద్భుతమైన మ్యూజియం అని చెప్పుకోవచ్చు.
హైదరాబాదులో ఓషన్ పార్క్ కూడా ఉంది. ఇది అద్భుతంగా ఉంటుంది. దీనిలో ఆక్వా స్నేక్, వేవ్ పూల్, జాక్ జూమ్ వంటి ఉత్కంఠ భరతమైన రైడ్స్ ఉంటాయి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి పిల్లల కోసం అయితే మీరు ఓషన్ పార్కుకు వెళ్లాల్సిందే.
హైదరాబాద్ వెళ్ళినవారు కచ్చితంగా చూడాల్సిన అద్భుతమైన ప్రదేశాల్లో గోల్కొండ ఒకటి. దీన్ని ఒక కొండపై నిర్మించారు. 1143వ సంవత్సరంలో దీన్ని నిర్మించినట్లు చెబుతారు. దీన్ని మట్టి కోటగా వివరిస్తా.రు మొదట వరంగల్ రాజు పాలనలో ఈ గోల్కొండ కోట నిర్మాణం మొదలైంది. ఆ తర్వాత మహమ్మద్ కులీ కుతుబ్ షా వల్ల గోల్కొండ కోటకు ఎంతో వైభవం వచ్చింది.
వేసవి సెలవుల కోసం రామోజీ ఫిలిం సిటీ సరికొత్తగా తయారవుతుంది. హాలీ డే కార్నివాల్ పేరుతో అనేక రకాల ఈవెంట్స్ ను అక్కడ నిర్వహిస్తారు. సరదా సంబరాల్లో వినోదాలు పంచే ఈ కార్యక్రమాలు దాదాపు 45 రోజులు పాటు ఈ హాలిడే కార్నివాల్ జరుగుతుంది. వివిధ టూర్ ప్యాకేజీలు కూడా రామోజీ ఫిలిం సిటీ లో ఉన్నాయి. మీ కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి మీరు టూర్ ప్యాకేజీలను బుక్ చేసుకోవాలి.
హైదరాబాదులో ఉన్న ఖగోళ అద్భుతాలను మ్యూజియం బిర్లా ప్లానిటోరియం. హుస్సేన్ సాగర్ దగ్గరలోనే ఈ ప్లానిటోరియం ఉంది. దీన్ని అప్పటి ముఖ్యమంత్రి ఎన్ టీ రామారావు 1985లో ప్రారంభించారు. భారతదేశంలో మూడే బిర్లా ప్లానిటోరియాలు ఉన్నాయి. అందులో ఒకటి ఇది. ఇస్రో చేసిన అనేక రకాల పరిశోధనలు, సాధించిన విజయాలను చిత్రాల రూపంలో ఇక్కడ ప్రదర్శిస్తారు. ముఖ్యంగా సైన్సును ఇష్టపడే పిల్లలకు ఈ బిర్లా ప్లానిటోరియం ఎంతో నచ్చుతుంది. అలాగే ఈ బిర్లా ప్లానిటోరియంలో డైనోసార్ ఆకారంలో వాటి ఎముకలను అమర్చి ఉంచుతారు. అది కూడా పిల్లలకు ఎంతో నచ్చుతుంది. దీనిలో డైనోసార్ గుడ్లు కూడా ప్రదర్శనకు ఉంటాయి.
నిజాం పాలకుల అధికారిక నివాసంగా చౌహమల్లా ప్యాలెస్ ఉండేది. ఇది ఎంతో అందమైన కట్టడం. ముస్లిం, యూరోపియన్, రాజస్థానీ నిర్మాణ శైలులను కలిపి ఈ కట్టడాన్ని నిర్మించారు. చౌహమల్లా ప్యాలెస్ చూడాలంటే రెండు కళ్ళు చాలవు.