Fruit Fasting mistakes: ఉపవాసంలో పండ్లు మాత్రమే తింటున్నారా? ఈ తప్పులు చేస్తే ఆరోగ్యం క్షీణిస్తుంది-if you are doing fruit fasting in navarathri dont do these mistakes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fruit Fasting Mistakes: ఉపవాసంలో పండ్లు మాత్రమే తింటున్నారా? ఈ తప్పులు చేస్తే ఆరోగ్యం క్షీణిస్తుంది

Fruit Fasting mistakes: ఉపవాసంలో పండ్లు మాత్రమే తింటున్నారా? ఈ తప్పులు చేస్తే ఆరోగ్యం క్షీణిస్తుంది

Koutik Pranaya Sree HT Telugu
Published Oct 05, 2024 08:00 AM IST

Fruit Fasting mistakes: నవరాత్రులలో మొత్తం తొమ్మిది రోజులు దుర్గాదేవి ఆరాధనతో ఉపవాసం ఉంటే, పండ్లు తినేటప్పుడు ఈ తప్పులను మరచిపోవద్దు, లేకపోతే ఆరోగ్యం క్షీణిస్తుంది.

పండ్లు తినేటప్పుడు చేయకూడని తప్పులు
పండ్లు తినేటప్పుడు చేయకూడని తప్పులు (shutterstock)

నవరాత్రుల రోజులలో చాలా మంది మొత్తం తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు. కొందరు రోజంతా పండ్లు మాత్రమే తింటారు. ఉపవాస దినాలలో సాత్విక ఆహారం తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఉదాహరణకు, మీరు పండ్లు మాత్రమే తింటుంటే, ఈ విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. లేదంటే ఉపవాసం సమయంలో ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఉంటాయి.

నీళ్లు తాగడం:

పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. ఇది జీర్ణశక్తి క్షీణింపజేస్తుందని చెబుతారు. ముఖ్యంగా కీర దోసకాయ, పుచ్చకాయ, కర్భూజా, ద్రాక్షపండ్లు, నారింజ వంటి జ్యూసీ, నీటి శాతం ఉన్న పండ్లు తినేటప్పుడు ఈ నియమం తప్పకుడా పాటించాలి. అలాగే ఆపిల్, అరటిపండ్లు వంటి పండ్లు తిన్న తర్వాత కూడా నీళ్లు తాగకూడదు.

ఉత్తమ సమయం:

పండ్లు తినడానికి అన్ని సమయాలు సరైనవే అని శాస్త్రీయంగా చెప్పొచ్చు. కానీ ఆయుర్వేదంలో పండ్లు తినడానికి మాత్రం రాత్రి పూట కన్నా దినంలో తినడం సరైనందిగా భావిస్తారు. అలాగే, ఖాళీ కడుపుతో కూడా పండ్లు తినడం మానుకోండి. ఆపిల్ నుండి అరటిపండ్లు, దానిమ్మ, పుచ్చకాయలు, పుచ్చకాయలు వంటి అన్ని పండ్లను తింటుంటే, ముందు డ్రై ఫ్రూట్స్ వంటి తేలికపాటి స్నాక్స్ తిన్న తర్వాతే పండ్లను తినాలి.

పుల్లని, తియ్యని పండ్లు:

పుల్లని, తియ్యని పండ్లను కలిపి తినకూడదు. వాటికి విభిన్న రుచి ఉండటం ఒక కారణం అయితే వీటిని కలపడం ఆరోగ్యానికి మంచిది కాకపోవడం మరో కారణం. కాబట్టి ఒకసారి ఒకరకమైన పండ్లనే తినండి. అన్నీ కలగాపులగం చేసి తినకండి.

తొక్కతో తినడం:

తొక్క తీయాల్సిన అవసరం లేని పండ్లు అలాగే తినడానికి ప్రాముఖ్యత ఇవ్వండి. అలాగైతేనే ప్రయోజనం ఉంటుంది. పండ్ల తొక్కలు శరీరానికి కావాల్సిన పీచును అందిస్తాయి. అమాంతం చక్కెర స్థాయులు పెరగకుండా కాస్త సాయపడతాయి. ప్రేగు కదలికలను సులభతరం చేస్తాయి. మలబద్దకమూ రాకుండా ఉంటుంది.

రోజంతా పండ్లు:

తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటే రోజంతా పండ్లు మాత్రమే తిని ఆపకూడదు. పండ్లలో ఫ్రక్టోజ్ ఉంటుంది, ఇది సహజ చక్కెర. అలా పండ్లను మాత్రమే ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. కాబట్టి పండ్లతో పాటు పిండి పదార్థాలుండే సాబుదానా, బంగాళాదుంప, వేరుశనగలు లాంటి వాటిని ఆహారంలో చేర్చుకోండి.

Whats_app_banner