యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూ, 72వ మిస్ వరల్డ్ అంతర్జాతీయ అందాల పోటీలకు హైదరాబాద్ నగరం వేదికైంది. మన దేశానికి, అది కూడా తెలుగు రాష్ట్రమైన తెలంగాణకు సుమారు 120 దేశాల నుండి సుందరీమణులు విచ్చేశారు. ఈ అద్భుతమైన వేడుకకు మిస్ వరల్డ్ చరిత్రలోనే అత్యధిక మంది పోటీపడుతున్నారు.
ఈ అందాల పోటీలు కేవలం బాహ్య రూపాన్ని చూసి మాత్రమే నిర్ణయించరు. పోటీదారుల వ్యక్తిత్వం, తెలివితేటలు, ప్రాతినిధ్యం వహిస్తున్న దేశపు సంస్కృతి, ప్రపంచ సమస్యలపై వారికున్న అవగాహన వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. విజేతను అనేక రౌండ్లు, ప్రక్రియల ద్వారా నిర్ణయిస్తారు.
ప్రారంభ రౌండ్లో అన్ని దేశాల నుండి వచ్చిన పోటీదారులు అనేక రకాల పోటీలలో పాల్గొంటారు. వీటిలో ముఖ్యమైనవేంటంటే..
న్యాయమూర్తులు పోటీదారులతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి ఆలోచనలు, ఆసక్తులు, వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు.
పోటీదారులు తమ ప్రత్యేక నైపుణ్యాలను డ్యాన్స్, మ్యూజిక్, కల్చరల్ ఆర్ట్స్ వంటి మొదలైనవి ప్రదర్శిస్తారు.
ఈ రౌండ్లో శారీరక దృఢత్వం, క్రీడా స్ఫూర్తిని పరీక్షిస్తారు.
ఈ రౌండ్లో మోడలింగ్ నైపుణ్యాలను అంచనా వేస్తారు.
ఇది చాలా ముఖ్యమైన విభాగం. పోటీదారులు తాము చేపట్టిన లేదా మద్దతిస్తున్న సామాజిక సేవా ప్రాజెక్ట్ను న్యాయమూర్తులకు వివరిస్తారు. వారి ప్రాజెక్ట్ ఉద్దేశ్యం, దాని పట్ల వారు చూపిస్తున్న నిబద్ధత అంశాల ఆధారంగా విజేతను ఎన్నుకుంటారు. ఈ విభాగంలో విజయం సాధించిన వారిని సెమీ-ఫైనల్కు ఎంపిక చేస్తారు.
ప్రారంభ రౌండ్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని సెమీ-ఫైనల్కు ఎంపిక చేస్తారు. ఇక్కడ న్యాయమూర్తులు వారిని మరింత నిశితంగా పరిశీలిస్తారు.
పోటీదారులు ఒకరితో ఒకరు ముఖాముఖి సంభాషిస్తారు, వారి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, మనస్సులో ఉన్న అభిప్రాయాలను వ్యక్తీకరించే విధానాన్ని అంచనా వేస్తారు.
సోషల్ మీడియాలో వారికి ఉన్న ప్రాచుర్యం, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకుంటారు.
సెమీ-ఫైనలిస్టుల నుండి కొద్దిమందిని ఫైనల్స్కు ఎంపిక చేస్తారు. మొదలైనప్పటి నుంచి ఉన్న రౌండ్లకు పూర్తి విరుద్దమైన రౌండ్లు ఫైనల్స్లో ఉంటాయి:
ఈ రౌండ్లో ఆత్మవిశ్వాసాన్ని, పోటీదారుల ఫిట్నెస్ను అంచనా వేస్తారు. కొన్నేళ్లుగా ఈ రౌండ్పై విమర్శలు వస్తున్నాయనే ఉద్దేశ్యంతో దీని గురించి ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు.
అందం, గాంభీర్యం వేదికపై ఎలా ప్రెజెంటేషన్ చేయగలుగుతున్నారనే విషయాన్ని అంచనా వేస్తారు.
ఇది చాలా కీలకమైన రౌండ్. ఫైనలిస్టులను సమకాలీన సమస్యలపై వారి వ్యక్తిగత అభిప్రాయాలపై ప్రశ్నలు అడుగుతారు. వాటికి ఎలా స్పందించారనే దానిపై వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. వారి ఆలోచనలలోని స్పష్టతను బట్టి, కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఎలా ఉన్నాయనే దాని ఆధారంగా న్యాయమూర్తులు వారిని అంచనా వేస్తారు.
కొన్నిసార్లు, తుది విజేతను ఎన్నుకునే ముందు కంటెస్టంట్లు తమ అభిప్రాయాలను లేదా మెసేజ్ను క్లుప్తంగా తెలియజేయాల్సి ఉంటుంది.
వివిధ రంగాలకు చెందిన నిపుణులు కంటెస్టంట్ల ప్రతిభను లెక్కించే న్యాయమూర్తులుగా వ్యవహరిస్తారు. ప్రతి రౌండ్లో కంటెస్టంట్లు కనబరిచిన ప్రదర్శనను వారి సొంత ప్రమాణాల ప్రకారం అంచనా వేసి మార్కులు కేటాయిస్తారు. అన్ని రౌండ్లలో వచ్చిన మార్కుల సగటు ఆధారంగా విజేతను ప్రకటన ఉంటుంది.
టాపిక్