బంగాళాదుంపలు, ఉల్లిపాయలు వాడకుండా పనీర్ సమోసా ఇలా చేసేయండి, రెసిపీ ఇదిగో-how to make paneer samosa without potatoes and onions here is the recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  బంగాళాదుంపలు, ఉల్లిపాయలు వాడకుండా పనీర్ సమోసా ఇలా చేసేయండి, రెసిపీ ఇదిగో

బంగాళాదుంపలు, ఉల్లిపాయలు వాడకుండా పనీర్ సమోసా ఇలా చేసేయండి, రెసిపీ ఇదిగో

Haritha Chappa HT Telugu

బంగాళాదుంపలు, ఉల్లిపాయలే సమోసా తయారీలో ముఖ్యమైనవి. అవి లేకుండా కూడా సమోసాను వండవచ్చు. పనీర్ సమోసాను జైనుల పద్ధతిలో వండవచ్చు. దీన్ని ఎలా వండాలో తెలుసుకోండి.

పనీర్ సమోసా రెసిపీ

సమోసా అనగానే బంగాళాదుంపలు, ఉల్లిపాయలతో నిండి ఉంటుంది. అవి లేకుండా సమోసా పూర్తి కాదనుకుంటారు. ఈ రెండూ అవసరం లేకుండా పనీర్, పచ్చి బఠానీలతో వండే ఈ సమోసా చాలా రుచిగా ఉంటుంది. పనీర్ మటర్ సమోసా ఎలా తయారు చేయాలో ఇక్కడ చెప్పాము.

పనీర్ సమోాాసా రెసిపీకి కావాల్సిన పదార్థాలు

మైదా పిండి - ఒక కప్పు

ఉప్పు -రుచికి సరిపడా

నీళ్లు - సరిపడా

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

పచ్చిబఠాణీలు - అర కప్పు

పనీర్ తురుము - రెండు స్పూన్లు

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

గరం మసాలా - అర స్పూను

మిరియాల పొడి - పావు స్పూను

పచ్చిమిర్చి - రెండు

పనీర్ సమోసా రెసిపీ

  1. సమోసా తయారు చేయాలంటే ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి.
  2. సమోసా క్రిస్పీగా ఉండాలంటే పిండిలో కొద్దిగా నెయ్యి లేదా నూనె కలపాలి. ఇప్పుడు గోరువెచ్చని నీటి సహాయంతో కొద్దిగా గట్టి పిండిని పిండుకోవాలి.
  3. పిండిని మూతపెట్టి 15-20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పిండిని అప్లై చేసిన తర్వాత స్టఫింగ్ తయారు చేయండి.

4. స్టఫింగ్ చేయడానికి బఠానీలను ముందుగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత అందులో తురిమిన పనీర్ వేయాలి.

5. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, తరిగిన కొత్తిమీర, ఉప్పు, గరంమసాలా, మిరియాలపొడి వేసి కలపాలి.

6. ఇప్పుడు మైదా పిండి మిశ్రమం నుంచి చిన్న ముద్ద తీసుకోండి. దాన్ని రోలింగ్ పిన్ తో రోటీలా ఒత్తుకోవాలి.

7. ఆ పూరీని సమోసాలాగా తయారు చేసుకుని అందులో పనీర్ స్టఫింగ్ నింపాలి. తరువాత సమోసా చివరను నీటితో అతికించండి. త

8. బాణలిలో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేసి వేడి చేయాలి. ఆ వేడి నూనెలో 4 లేదా 5 సమోసాలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.

9. సమోసాలు వేయించేటప్పుడు మంట మీడియంలో ఉంచాలి. వేయించాక వాటిని తీసి టిష్యూ పేపర్లపై వేయాలి. దీన్ని పుదీనా చట్నీతో సర్వ్ చేయాలి. అంతే టేస్టీ పనీర్ సమోసా తయారైనట్టే.

ఇందులో మనం బంగాళాదుంపలు, ఉల్లిపాయలు వాడలేదు. కానీ వీటి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. జైనులు ఇలా సమోసాలను వండుకుంటారు. వారు ఉల్లిపాయ తినేందుకు ఇష్టపడరు. మీరు కూడా ఈ పనీర్ రెసిపీని ప్రయత్నించండి.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.