చలికాలంలో మన శరీరం పోషణతో పాటు వెచ్చదనం ఇచ్చే ఆహారాన్ని కోరుకుంటుంది. ఖర్జూరం వంటి డ్రైఫ్రూట్స్, నట్స్, నువ్వులు వంటి నూనె గింజలు వంటివి వెచ్చదనాన్ని ఇస్తాయి. అలాగే భూఉపరితలం కింద పండే దుంపలు కూడా శీతాకాలంలో మన శరీరానికి వెచ్చదనం ఇస్తాయి.
చలికాలంలో చాలా మందిని పలు అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. శరీరంలో వాపు, కడుపు ఉబ్బరం, జలుబు, దగ్గు, జ్వరం, గుండె జబ్బులు రావడం వింటర్లో సర్వ సాధారణం.
డైటీషియన్ నీలమ్ అలీ హెచ్టీ లైఫ్స్టైల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడారు. శరీరంలో సుదూరంగా ఉన్న అవయవాళకు రక్తం సరఫరా చేసే నాళాలు చాలా సన్నగా ఉంటాయి. చలికాలంలో ఇవి మరింత కుంచించుకుపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో అరికాళ్లు, చేతులు, వేళ్లకు రక్తసరఫరా తగ్గుతుంది. దీంతో అవి వాపునకు గురవుతాయి. ఎరుపు రంగులోకి మారుతాయి. లేదా దురద పుడుతుంది.
‘ముందుగా శారీరకంగా చురుగ్గా ఉంటే రక్త సరఫరా మెరుగుపడుతుంది. బాగా చన్నీటిలో నానడం మంచిది కాదు. ఎప్పుడైనా బాగా చల్లని నీటిలో చేయిపెట్టి తదుపరి వేడి నీటిలో చేయి పెడితే మీ రక్త ప్రసరణలో విపరీతమైన మార్పులు సంభవిస్తాయి. చల్లని ప్రదేశానికి వెళ్లినప్పుడు కాటన్ సాక్స్, చేతులకు గ్లవ్స్ ధరించాలి. చలికాలంలో నీరు తాగడం తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలో అవయవాలకు రక్త సరఫరా తగ్గుతుంది..’ అని చెప్పారు. వింటర్లో ఉండాల్సిన 5 అలవాట్లను సూచించారు.
జిందాల్ నేచర్ క్యూర్ చీఫ్ డైటీషియన్ సుష్మా పీఎస్ వింటర్లో తీసుకోవాల్సిన 5 ఆహార పదార్థాల గురించి వివరించారు.