వెల్లుల్లి కేవలం వంటల్లో రుచిని పెంచే పదార్థం మాత్రమే కాదు. ఇదొక శక్తివంతమైన ఔషధం కూడా. డయాబెటిస్ నుండి అధిక కొలెస్ట్రాల్ వరకు అనేక ఆరోగ్య సమస్యలకు ఇది ఒక సహజమైన చక్కటి పరిష్కారం. అందుకనే ఈ మధ్య చాలా మంది వెల్లుల్లిని ప్రతి రోజూ తినడం అలవాటు చేసుకుంటున్నారు. అయితే వెల్లుల్లి తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే దాన్ని సరైన విధంగా తినడం చాలా ముఖ్యం.
అంతేకాదు పచ్చి వెల్లుల్లి వాసన, రుచి కారణంగా దీన్ని తినడం చాలా మందికి ఇబ్బందికరంగా ఉండవచ్చు. ఇలాంటప్పుడు వెల్లుల్లిని ఈజీగా తీంటూ, దానిలోని ఔషధ గుణాలను పొందడానికి కొన్ని తెలివైన మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి..
ప్రతిరోజూ వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. వాటిలో ముఖ్యమైనవి కొన్ని ఇక్కడ ఉన్నాయి:
ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక కొలెస్ట్రాల్ ఒకటి. ఇది గుండె ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఇలాంటి వారు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా తగ్గించవచ్చు.
వెల్లుల్లి పురుషుల లైంగిక ఆరోగ్యానికి ఒక గొప్ప వరం. ఇది లైంగిక కోరికను పెంచడమే కాకుండా, వంధ్యత్వ సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది.
కీళ్ల నొప్పులు, వాపులతో బాధపడేవారికి వెల్లుల్లి ఒక సహజమైన నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పిని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. కీళ్ల నొప్పుల నివారణకు వెల్లుల్లిని ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు.
వెల్లుల్లి రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఇది రక్త నాళాలను వెడల్పు చేస్తుంది, తద్వారా రక్త ప్రసరణ సాఫీగా జరిగి రక్తపోటు అదుపులో ఉంటుంది.
జలుబు, దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం పొందడానికి వెల్లుల్లి ఒక అద్భుతమైన ఔషధం. దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి. శరీర రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
మొటిమలతో బాధపడుతున్న వారికి వెల్లుల్లి ఒక మంచి పరిష్కారం. దీంట్లో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. తద్వారా మొటిమల సమస్య తగ్గుతుంది.
ఇన్స్టాగ్రామ్ పేజీలోని న్యూట్రిషన్ చర్చలో, డైటీషియన్ వెల్లుల్లిని గరిష్ట ప్రయోజనాల కోసం తినడానికి రెండు మార్గాలు ఉన్నాయని చెప్పారు. అవేంటంటే..
వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని టీ లాగా తాగడం వల్ల వెల్లుల్లిలోని పోషకాలు సులభంగా శరీరంలో కలిసిపోతాయి, త్వరగా ప్రయోజనం చేకూరుస్తాయి. కావాలంటే ఇందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కూడా కలుపుకుని కూడా తాగచ్చు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి రెబ్బలను నేరుగా నమిలి మింగుతారు. అయితే, డైటీషియన్ల ప్రకారం, వెల్లుల్లిని పూర్తిగా మింగే బదులు కొద్దిగా పిసికి లేదా నలిపి తినడం మంచిది. ఇలా చేయడం వల్ల వెల్లుల్లిలోని అల్లిసిన్ సమ్మేళనం పూర్తిగా విడుదల అవుతుంది, మరింత చురుకుగా పనిచేసి శరీరానికి గరిష్ట ప్రయోజనాలను అందిస్తుంది. పిసికిన వెల్లుల్లిని కొద్దిగా నీటితో వెంటనే తీసుకోవాలి.