భారతదేశ చరిత్రలో మరపురాని రోజు ఇండిపెండెన్స్ డే. సుదీర్ఘ పోరాటం తర్వాత భారత ప్రజలు స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్న రోజు. మన దేశం జెండా పండుగను ఎంతో వైభవంగా నిర్వహించుకుంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఆగస్టు 15న అవతరించింది. మన దేశం దాదాపు రెండు శతాబ్దాల పాటు బ్రిటీషర్ల చెరలోనే మగ్గిపోయింది. మన దేశం వారి అణిచివేత నుండి భారతీయుడి ఆవేశం పుట్టుకొచ్చింది. ఆవేశమే ఆగ్రహ జ్వాలగా మారి చివరకు సిపాయిల తిరుగుబాటుగా క్విట్ ఇండియా ఉద్యమంగా రూపు దాల్చి స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టింది. ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రతి ఒక్క భారతీయుడు పండుగలా నిర్వహించుకోవాల్సిన రోజు. ఈ రోజున మీ స్నేహితులకు, ప్రియమైన వారికి, బంధువులకు కచ్చితంగా శుభాకాంక్షలు చెప్పాల్సిందే. ఇక్కడ మేము స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుగులోనే ఇచ్చాము. మీకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకొని మీ ప్రియమైన వారికి పంపించండి.
టాపిక్