ఆరోగ్యం కోసం పండ్లు ఎంతో ముఖ్యమైనవో మనందరికీ తెలుసు. వాటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని అనేక రోగాల నుండి కాపాడతాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి ,రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే, కొన్నిసార్లు మనం చేసే ఒక చిన్న పొరపాట్లు మన ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. అదేంటంటే కొన్ని రకాల పండ్లను కలిపి తినడం. ఆయుర్వేదం ,పోషకాహార నిపుణులు కొన్ని రకాల పండ్ల కలయికను ఆరోగ్యానికి మంచిది కాదని సూచిస్తున్నారు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం:
పుచ్చకాయ ,కర్బూజ జాతికి చెందిన పండ్లను వేర్వేరుగా తినడమే మంచిది. వీటిని ఇతర పండ్లతో కలిపితే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పుచ్చకాయ చాలా తేలికగా ,త్వరగా జీర్ణమవుతుంది. ఇందులో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతర పండ్లతో కలిపినప్పుడు, పుచ్చకాయ త్వరగా జీర్ణమవ్వడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఇతర పండ్లు ఆలస్యంగా జీర్ణమవుతాయి. దీని వల్ల కడుపులో అసౌకర్యం, గ్యాస్ వంటి ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. కర్బూజ కూడా పుచ్చకాయ లాంటి లక్షణాలనే కలిగి ఉంటుంది కాబట్టి వీటిని కూడా విడిగా తీసుకోవడమే ఉత్తమం. మీరు ఒకేసారి పుచ్చకాయను తినండి లేదా కర్బూజను మాత్రమే తినడానికి ప్రయత్నించండి.
ద్రాక్ష, స్ట్రాబెర్రీ, ఆపిల్, దానిమ్మ ,నారింజ వంటి పుల్లని లేదా సబ్-యాసిడ్ పండ్లను అరటిపండ్లు ,ఎండుద్రాక్ష వంటి తియ్యటి పండ్లతో ఎప్పుడూ కలపకూడదని ఆయుర్వేదం చెబుతోంది. ఇది చాలా చెడ్డ కాంబినేషన్ అని చెప్పవచ్చు. తీపి పండ్లు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి, అయితే ఆమ్ల పండ్లు త్వరగా జీర్ణమవుతాయి. ఈ రెండింటినీ కలిపి తిన్నప్పుడు, తీపి జీర్ణక్రియ అస్తవ్యస్తం అవుతుంది. కడుపులో పులియబెట్టడం (ఫెర్మెంటేషన్) జరుగుతుంది, ఇది గ్యాస్, ఉబ్బరం, ఎసిడిటీ ,తలనొప్పి వంటి సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి, తీపి పండ్లను విడిగా తినండి లేదంటే ఇతర తీపి పండ్లతో కలిపి తినండి. అలాగే, ఆమ్ల పండ్లను విడిగా లేదా ఇతర ఆమ్ల పండ్ల జాతికి చెందిన వాటితో కలిపి మాత్రమే తీసుకోండి.
బొప్పాయి ,నిమ్మకాయ కలయికను ఆరోగ్య నిపుణులు అత్యంత ప్రమాదకరమైన కలయికల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల రక్తహీనత (రక్తంలో ఐరన్ శాతం తగ్గడం) లేదా హిమోగ్లోబిన్ అసమతుల్యత ఏర్పడే ప్రమాదం ఉంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, ఈ కలయిక శరీరానికి విషపూరితంగా కూడా మారవచ్చు. కాబట్టి, మీ ఆరోగ్యం కోసం ఈ రెండు పండ్లను ఎప్పుడూ కలిపి తినకండి. వీటిని విడివిడిగా, అది కూడా కొంత సమయం వ్యవధిలో తీసుకోవడం మంచిది.
చాలా మంది పండ్లను ,కూరగాయలను కలిపి తినడానికి ఇష్టపడతారు. ఇది జీర్ణక్రియకు అంత మంచిది కాదు. పండ్లు ,కూరగాయలు వేర్వేరు ఎంజైమ్ల సహాయంతో వేర్వేరు సమయాల్లో జీర్ణమవుతాయి. పండ్లలో సహజ చక్కెరలు (ఫ్రక్టోజ్) ఎక్కువగా ఉంటాయి, ఇవి కూరగాయల జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. ఉదాహరణకు, నారింజను క్యారెట్తో కలిపి తింటే కడుపు నొప్పి, గుండెల్లో మంట ,ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే, పండ్లను సలాడ్లలో లేదా కూరగాయల జ్యూస్లలో కలపడం కూడా మంచిది కాదు. వీలైనంత వరకు పండ్లను విడిగా, భోజనానికి ముందు లేదా భోజనం మధ్యలో తీసుకోవడానికి ప్రయత్నించండి. కూరగాయలను విడిగా లేదా ఇతర కూరగాయలతో కలిపి తీసుకోవచ్చు.
సంబంధిత కథనం