సాయంత్రం అయితే చాలు పకోడీలు, బజ్జీలు తినాలనిపిస్తుంది. ఇక నాన్ వెజ్ ప్రియులకైతే చికెన్, చేప, రొయ్యల స్నాక్స్ తినేందకు ఇష్టపడతారు. ప్రతిసారి బయటకొనుక్కుని తినడం అంత మంచిది కాదు. ఇంట్లోనే చేసుకుంటే శుచిగా ఉంటుంది. చేపలతో క్రిస్పీగా, జ్యూసీగా పకోడీ ఎలా చేయాలో ఇచ్చాము. ఇది చాలా రుచిగా ఉంటుంది. దీన్ని చేయడం చాలా సులువు. బోన్ లెస్ చేప ముక్కలు కొనుక్కుంటే పకోడీ చేసుకోవడం చాలా ఈజీ.
చేపలు ముక్కలు - అరకిలో
వెల్లుల్లి - ఆరు రెబ్బలు
నిమ్మరసం - అర స్పూను
కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
కార్న్ ఫ్లోర్ - రెండు స్పూన్లు
మిరియాల పొడి - అర స్పూను
కారం - ఒక స్పూను
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
4. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి.
5. నూనె వేడెక్కాక మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు వేసి బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి.
6. చేపలు వేయించాక ఆయిల్ స్ట్రెయినర్ లో వేసి నూనె లేకుండా చూసుకోవాలి.
7. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నూనె వేయాలి. అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, పచ్చి మిర్చి, కరివేపాకులు వేసి వేయించాలి.
8. అందులో ఫిష్ పకోడా వేసి ఓసారి టాస్ చేసుకుని స్టవ్ ఆపేయాలి. అంతే టేస్టీ చేప రెసిపీ రెడీ అయినట్టే. నోట్లో పెడితే చాలు ఇక ఆపలేరు. మొత్తం తినేస్తారు.
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చేపలతో చేసే వంటకాల్లో చేప పకోడీ చాలా రుచిగా ఉంటుంది. దీన్ని వండడం చాలా సులువు, దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో వండితే చాలా తక్కువ నూనెతో వండేయచ్చు.