కీళ్లనొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. అలాంటి వారు ఆహారపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరానికి పోషణ అందించడంతో పాటు, శరీర వేడిని నిర్వహించడానికి ఉపయోగపడే ఆహారాలను తినాలి. కీళ్ల నొప్పుల వల్ల కూర్చోవడం కూడా కష్టమవుతుంది. మీకు కూడా ఈ పరిస్థితి ఉంటే మెంతి నువ్వుల లడ్డూను తయారు చేసుకోవచ్చు.
ఈ లడ్డూలు రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి వరం కూడా. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. మీ రోగనిరోధక శక్తి బలంగా ఉండటానికి సహాయపడుతుంది. మెంతుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పొట్ట సమస్యలను పరిష్కరిస్తుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. నువ్వులు శరీరాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. మెంతి నువ్వులతో తయారు చేసిన ఈ లడ్డూ అద్భుతమైన రుచిని ఇస్తుంది.
గోధుమపిండి - 100 గ్రాములు
నెయ్యి - 100 గ్రాములు
బాదం పప్పులు - యాబై గ్రాములు
బెల్లం తురుము - వంద గ్రాములు
మిరియాల పొడి - అరస్పూను
శొంఠి పొడి - రెండు టీస్పూన్లు
పసుపు - అర స్పూన్
పాలు - పావు కప్పు
మెంతులు - ఒక స్పూను
నువ్వులు - ఒక కప్పు
దాల్చిన చెక్క - రెండు ముక్కలు
యాలకులు - అయిదు
జాజికాయ - చిన్న ముక్క
నెయ్యి - రెండు స్పూన్లు
కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నవారు ఈ లడ్డూను రోజుకొకటి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు . ఇందులో ఉండే నువ్వులు, మెంతులు మనకు ఎన్నో పోషకాలను అందిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ మెంతి నువ్వుల లడ్డూ తయారుచేసేందుకు ప్రయత్నించండి. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది.
సంబంధిత కథనం