ఫిట్నెస్ కోసం యోగా చేయడం చాలా ముఖ్యం. ఇది మీ మనస్సు, శరీరం మధ్య సమతుల్యతను కాపాడటానికి సహాయపడుతుంది. అయితే కొన్ని ఆసనాలు మాత్రం వాటి ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. అటువంటి వాటిలో ఉదయాన్నే రోజూ చేయాల్సిన ఒక యోగాసనం మలాసనం. ఇది శరీరాన్ని డిటాక్స్ చేయడం నుంచి మెరుగైన జీర్ణక్రియ వరకు అనేక రకాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. మీరు ప్రతిరోజూ యోగా చేస్తే, మీ యోగా దినచర్యలో మలాసనాన్ని చేయడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఈ ఆసనంలో కూర్చుని నీళ్లు తాగడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
మలాసనం చేయడానికి మీ పాదాలను మీ తొడల దగ్గర వెడల్పుకు సమానంగా ఉంచి పాదాల మీద కూర్చోండి. ఇప్పుడు స్క్వాట్ పొజిషన్ లోకి వచ్చినప్పుడు మీ మోకాళ్ళను వీలైనంత వంచి, మీ పిరుదులను నేలకు ఆనించేలా ఉంచండి. మీ అరచేతులను గుండె ముందు నమస్కార స్థితిలో కలిపి ఉంచండి. ఇప్పుడు మీ మడమలు నేలపై ఉంచి, మీ వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోండి. మీరు మీకు సౌకర్యవంతమైన స్థితిలో ఉన్నప్పుడు కనీసం గ్లాసుడు నీరు తాగాలి. గోరువెచ్చని నీరు తాగితే మరీ మంచిది.
మలాసనంలో కూర్చుని నీరు త్రాగడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. మీరు ఈ భంగిమలో కూర్చుని నీరు త్రాగినప్పుడు ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి, శరీరంలో ఉన్న చెడు పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఒక రకంగా శరీరాన్ని ఈ చిన్న పని పూర్తిగా డిటాక్స్ చేస్తుంది. అంతే కాకుండా మలాసనంలోని నీటిని తాగడం జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకం సమస్యలు ఉన్నవారు, ఉందర సంబంధిత సమస్యలు ఉన్నవారు ప్రతిరోజూ ఈ భంగిమలో కూర్చొని నీళ్లు తాగం మేలు చేస్తుంది.
పిరుదులు, నడుము కింది అవయవాలపై మలాసనం పనిచేస్తుంది. మలాసనంలోని నీటిని తాగితే శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. కటి ప్రాంతంలోని కండరాలను బలోపేతం చేయడానికి కూడా మలాసనం ప్రయోజనకరంగా ఉంటుంది.