కోల్ ఇండియాలో 1050 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు.. అర్హతలివే!
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా (Coal India) భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 1050 మేనేజ్మెంట్ ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
Coal India Recruitment 2022: కోల్ ఇండియా 1050 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు కోల్ ఇండియా వెబ్సైట్ coallndia.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్లో, ఎంపికైన అభ్యర్థులకు నెలకు 50 వేల రూపాయల నుండి లక్షా 60 వేల రూపాయల వరకు జీతం ఇవ్వబడుతుంది. గేట్ 2022 పరీక్షలో విజయం సాధించిన ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉన్న అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు కంపెనీ వెబ్సైట్లో జారీ చేసిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను జాగ్రత్తగా చదవాలని సంస్థ సూచించింది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ - 23 జూన్ 2022
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ - 22 జూలై 2022
మొత్తం ఖాళీలు: 1050
నిబంధనల ప్రకారం రిజర్వేషన్ రోస్టర్ పోస్టులను కేటాయించారు .1050 పోస్టులకు గాను 444 జనరల్ పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కు 105, ఎస్సీకి 148, ఎస్టీకి 81, ఓబీసీకి 272 ఖాళీలు ఉన్నాయి. మైనింగ్లో జనరల్ 295, ఈడబ్ల్యూఎస్ 70, ఎస్సీ 98, ఎస్టీ 55, ఓబీసీ 181 పోస్టులున్నాయి. సివిల్లో జనరల్ 71, ఈడబ్ల్యూఎస్ 16, ఎస్సీ 21, ఎస్టీ 12, ఓబీసీ 40 పోస్టులున్నాయి. అదేవిధంగా, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్లో జనరల్ 52, EWS 12, SC 18, ST 9, OBC 23 పోస్టులు ఉన్నాయి. సిస్టమ్, EDP 26, EWS 7, SC 11, ST 5, OBCలకు 18 పోస్టులు రిజర్వు చేయబడ్డాయి.
విద్యార్హత: సంబంధిత సబ్జెక్ట్లో 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఉదాహరణకు, సివిల్ - BE / B.Tech / B.Sc (ఇంజినీరింగ్) అర్హత కలిగి ఉన్నవారు సివిల్ ఇంజనీరింగ్ కనీసం 60% మార్కులు సాధించాలి. అర్హతలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం కింది వివరణాత్మక నోటిఫికేషన్ను చూడండి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు
పే స్కేల్: నెలకు రూ.50,000 - 1,60,000/-
సంబంధిత కథనం