వేసవికాలంలో వేడి నుంచి తప్పించుకోవడానికి ఎన్నో చేస్తాం. కాకపోతే ఏసీల్లో, కూలర్ల ముందు కూర్చోవడం, చల్లటి కూల్ డ్రింక్స్ తాగడం, ఐస్ క్రీం తినడం వంటి చేసే కంటే శరీరాన్ని చల్లబరచడానికి కొన్ని ఆహారపదార్థాలను తీసుకోవడం మంచిదంటున్నారు ఆహార నిపుణులు. ఇవి హైడ్రేటెడ్ గా ఉంచి అరుగుదలకు తోడ్పడతాయి. అంతేకాకుండా బరువు తగ్గేందుకు కూడా సహకరిస్తాయి. మరి ఆ 9 రకాల పండ్లేమిటో తెలుసుకుందాం.
సమ్మర్లో మాత్రమే దొరికే మామిడికాయ పండ్లలో రారాజు. దీనిని నేరుగా లేదా స్మూతీగానైనా చేసుకుని తినవచ్చు కూడా. వీటన్నిటి కంటే మామిడి గుజ్జుతో చేసే పుల్ల ఐస్ తినడం ఇంకా బెటర్. కాకపోతే ఇలా చేయడానికి తాజా మ్యాంగోలు, కొద్దిగా నూనె, నీళ్లు లేదా కొబ్బరినీళ్లు కావాల్సి ఉంటుంది. వీటిల్లో విటమిన్ ఏ, సీలు ఉండి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. అంతేకాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
చియా గింజలు సైజులో చిన్నవే కానీ, పోషకాలు పుష్కలంగా కలిగి ఉంటాయి. వీటిని నీటిలో నానబెట్టుకుని లేదా పాలలో నానబెట్టుకుని కూడా తీసుకోవచ్చు. జెల్లీల్లా మారిన వీటిని తినడం వల్ల ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. ఇంకా ముఖ్యమైన విషయమేమిటంటే, శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉండి సమ్మర్లో చక్కటి బ్రేక్ఫాస్ట్గా ఉంటాయి.
పుదీనా శరీరాన్ని సహజంగా చల్లబరిచే ఆహార పదార్థాలు. వీటిని చట్నీల్లో, సలాడ్స్, పెప్పర్మింట్ లలో కలుపుకుని తినడం వల్ల ఇన్స్టంట్ రిఫ్రెష్మెంట్ కలుగుతుంది. పుదీనా ఆకులు అరుగుదలకు తోడ్పడటంతో పాటు వేడి వల్ల కలిగే తలనొప్పి నుంచి కాపాడతయి. పుదీనా ఆకులతో టీ తయారుచేసుకున్నా పుదీనా ఆకులనీళ్లు తాగిన శరీరం సహజంగానే చల్లబడుతుంది.
పుచ్చకాయలో 90 శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. సమ్మర్లో తినే బెస్ట్ ఫ్రూట్స్ లో పుచ్చకాయ ఒకటి. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంతో పాటు తీపి పదార్థాలు తినాలనే కోరిక కూడా తీరిపోతుంది. ఇంకా పుచ్చకాయలో లైకపెనె అధికంగా ఉండే యాక్సిడెంట్ గుండె ఆరోగ్యానికి, చర్మాన్ని కాపాడటంలోనూ సహాయపడతాయి.
కమలాపండ్లు, నిమ్మకాయలు తినడం వల్ల రిఫ్రెషింగ్ ఫీలింగ్ తో పాటు ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి. ఇవి తినడం వల్ల చర్మం మెరిసిపోతుంది. శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచి అరుగుదలకు సహాయపడుతుంది.
ఇది మంచి ప్రోబయోటిక్ ఫుడ్. అరుగుదలను ప్రోత్సహించి ఆరోగ్యంగా ఉంచుతుంది. బాడీ హీట్ తొలగించి శరీరానికి సహజమైన కూలెంట్ గా పనిచేస్తుంది. కాల్షియం, ప్రొటీన్ అధికంగా ఉండే ఈ యోగట్ లేదా పెరుగును ప్లెయిన్గా లేదా ఫ్రూట్స్ తో కలిపి తినొచ్చు.
ఎక్కువ శాతం నీరు ఉండే పదార్థాల్లో దోసకాయలు ఒకటి. ఇవి తినడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉండటమే కాకుండా తాజాదనాన్ని అందిస్తాయి. కేలరీలు తక్కువగా ఉండి బరువు పెరగకుండా ఉండటమే కాకుండా చర్మాన్ని ఫ్రెష్ గా ఉంచుతుంది. దీనిని సలాడ్స్ లో లేదా జ్యూస్ లలో కలుపుకుని తీసుకోవచ్చు.
ఇండియన్లు ఎక్కువగా తీసుకునే ఆహారంలో ఒకటి మజ్జిగ. ఇది లైట్ ఫుడ్ యే కానీ జీర్ణక్రియకు బాగా తోడ్పడుతుంది. తాజాదనం అందిస్తుంది కూడా. ప్రత్యేకించి హెవీ మీల్ తీసుకున్నప్పుడు మజ్జిగ తాగడం బెటర్.
సమ్మర్లో శరీరాన్ని చల్లబరిచే నేచురల్ డ్రింక్స్ లో కొబ్బరి నీళ్లు ఒకటి. ఇందులో ఎలక్ట్రోలైట్లు శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడతాయి. కేలరీలు తక్కువగా ఉండి శరీరాన్ని చల్లబరుస్తాయి. కిడ్నీ ఆరోగ్యానికి దోహదపడతాయి.