బెలూన్లు అమ్ముకునే యువతి మోడల్గా మారింది.. కథేంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
వీధుల్లో బెలూన్లు అమ్ముకునే ఓ యువతి.. ఏకంగా మోడల్గా మారిపోయింది. ఇప్పుడు ఆ యువతి ఫ్యాషన్ ప్రపంచానికి ట్రెండీగా నిలిచింది. ఇంతకి ఆ అమ్మాయి కథేంటో చూద్దమా
డిజిటల్ ప్రపంచంలో టాలెంట్కు కొదవ లేదు. సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది స్టార్లుగా మారుతున్నారు. ఓవర్ నైట్లో సెలబ్రెటీలుగా మారిపోన్నారు. అలా కేరళకు చెందిన ఓ యువతి ఏకంగా మోడల్గా మారిపోయింది. వీధుల్లో బుడగలు అమ్ముకునే ఈ యువతి ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండీగా నిలిచింది. ఇంతకి ఆ అమ్మాయి కథేంటో చూద్దమా
కేరళకు చెందిన కిస్బూ అనే పేద అమ్మాయి వీధుల్లో బెలూన్లు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తోంది. ఇలా తన దైనందిన జీవితంలో భాగంగా ఓ రోజు బెలూన్లు విక్రయిస్తున్న సమయంలో ఫొటోగ్రాఫర్ అర్జున్ కృష్ణన్ కన్ను ఆమెపై పడింది. ఆ అమ్మాయిలో ఏదో సంథింగ్ స్పెషల్ ఉందని భావించిన అర్జున్ కొన్ని ఫొటోలు తీశాడు. వాటిని ఇస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశాడు. అవి కాస్త వైరల్ కావడంతో ఆ అమ్మాయికి విపరితమైన క్రేజీ వచ్చింది.
తర్వాత కిస్బూ కుటుంబాన్ని కలిసిన అర్జున్ కృష్ణన్.. వారిని ఒప్పించి ఆ ఆమ్మాయితో ఓ స్పెషల్ ఫోటోషూట్ చేశాడు. ఈ షూట్లో ఆ అమ్మాయి సంప్రదాయ దుస్తులు, బంగారు ఆభరణాలతో అందంగా కనిపించింది. దీంతో ఆ యువతికి మరింత పాపులారీటి వచ్చింది. లక్షల మంది ఆ ఫోటోలను వీక్షించారు. ఆమెకు విపరితమైన క్రేజీ రావడంతో ప్రముఖ కంపెనీలు ఆ యువతిని మోడల్గా తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.
చూశారా ప్రతి ఒక్కరికి ఓ రోజు వస్తుందంటారు. వీధుల్లో బెలూన్లు అమ్ముకునే అమ్మాయి అర్జున్ కంట పడడమేంటీ.. ఇప్పుడు మోడల్గా మారడమేంటి.. అంతా కలగా ఉంది కదూ.
సంబంధిత కథనం