పాలిచ్చే తల్లుల కోసం పర్ఫెక్ట్ న్యూట్రిషన్ గైడ్: ఇవి తింటే తల్లీ బిడ్డా ఆరోగ్యంగా ఉంటారు!-a comprehensive guide to nutrition for mothers during the breastfeeding period by dietician ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  పాలిచ్చే తల్లుల కోసం పర్ఫెక్ట్ న్యూట్రిషన్ గైడ్: ఇవి తింటే తల్లీ బిడ్డా ఆరోగ్యంగా ఉంటారు!

పాలిచ్చే తల్లుల కోసం పర్ఫెక్ట్ న్యూట్రిషన్ గైడ్: ఇవి తింటే తల్లీ బిడ్డా ఆరోగ్యంగా ఉంటారు!

Ramya Sri Marka HT Telugu

పాలిచ్చే తల్లులారా? పిల్లలకు పాలు ఇస్తే సరిపోదు. వారి ఆరోగ్యం, మీ ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఆరోగ్యంగా ఉంటూ బిడ్డ కోసం పాల ఉత్పత్తి పెంచుకోవడం కోసం మీరు ఏమేం తినాలో ప్రముఖ డైటీషియన్ పద్మిని ఇక్కడ వివరంగా తెలిపారు. అవేంటో తెలుసుకోండి.

బిడ్డకు పాలిస్తున్న తల్లి (Shutterstock)

ప్రసవం అనేది ఒక స్త్రీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. ఈ సమయంలో ఆమె శరీరం అనేక మార్పులకు గురవుతుంది. తన ఆరోగ్యంపై, శిశువు ఆరోగ్యంపై ప్రత్యేక జాగ్రత్తగా తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా శిశువుకు పాలివ్వడం అనేది ప్రధాన ప్రక్రియ. ఇది తల్లి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సమయంలో తల్లి సరైన పోషకాహారం తీసుకోవడం చాలా కీలకం.

బలమైన పోషణ కేవలం తల్లి త్వరగా కోలుకోవడానికి మాత్రమే కాదు, ఆమె రోగనిరోధక శక్తిని పెంచడానికి, శక్తివంతంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు తల్లి తీసుకునే ఆహారం నేరుగా ఆమె పాల నాణ్యతను ప్రభావితం చేస్తుంది. శిశువు ఎదుగుదల, అభివృద్ధికి తల్లి పాలు అత్యంత ముఖ్యమైన పోషకాహార వనరు. కాబట్టి, తల్లి తీసుకునే ఆహారం శిశువు ఆరోగ్యానికి చాలా ముఖ్యం.

బెంగళూరులోని శేషాద్రిపురంలోని అపోలో ఆసుపత్రిలో క్లినికల్ డైటీషియన్, హెచ్ఓడి డాక్టర్ పద్మిని బి. హెచ్టి లైఫ్స్టైల్తో మాట్లాడుతూ ప్రసవానంతర కాలంలో పోషకాహార ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.ఆమె ప్రకారం.. చాలా సందర్భాలలో తల్లులు తమ పిల్లల అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు కానీ తమ సొంత ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం చేస్తారు. డాక్టర్ పద్మిని ఈ విషయాన్ని గుర్తు చేస్తూ తల్లి పాలిచ్చే సమయంలో తల్లి ఏం తింటుందో చూడటం కూడా అంతే ముఖ్యమని అన్నారు.

ఆమె మాట్లాడుతూ "తల్లి పాలిచ్చే దశలో పోషకాహారం ప్రాముఖ్యతను చాలా మంచి నిర్లక్ష్యం చేస్తారు. దీనికి కారణం అందరి దృష్టి ఎదుగుతున్న శిశువుపైనే ఉండటం. కానీ తల్లి పాలిచ్చేటప్పుడు, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఇది తల్లి జీవితంలో ఒక కీలకమైన, సున్నితమైన కాలం. తల్లి పాలిచ్చే కాలం తక్కువగా ఉండవచ్చు కానీ ఇది చాలా ప్రత్యేకమైనది. సరైన ఆహారం తల్లికి శక్తిని, ఓర్పును అందిస్తుంది. ఇది ఆమె తన పిల్లలను, కుటుంబాన్ని దీర్ఘకాలికంగా చూసుకోవడానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం శిశువు కోసం తల్లి పాల పోషక విలువలను పెంచుతుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు తల్లి పాల ఉత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి." అన్నారు.

పాలిచ్చే తల్లుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం
పాలిచ్చే తల్లుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం (Shutterstock)

పాలిచ్చే తల్లుల కోసం డాక్టర్ పద్మిని తెలిపిన పర్ఫెక్ట్ న్యూట్రిషన్ గైడ్:

1. మీ సూక్ష్మపోషక అవసరాలను తీర్చండి

మీ ఆహారం ఇనుము, జింక్, మెగ్నీషియం, విటమిన్ డి, విటమిన్ ఇ, ఫోలిక్ యాసిడ్ నిండి ఉండేలా తీర్చేలా చూసుకోండి.

  • జింక్ మాంసాలు, గుడ్లు, తృణధాన్యాలలో ఉంటుంది.
  • మెగ్నీషియం తృణధాన్యాలు, బీన్స్, గింజలలో ఉంటుంది.
  • విటమిన్ ఇ గోధుమ గింజలు, కాయలు, అనేక నూనెలు, తృణధాన్యాలలో ఉంటుంది.
  • మాంసం, గుడ్లు, తృణధాన్యాల రొట్టెలు, గింజల్లో కూడా ఇనుము అధికంగా ఉంటాయి.

2. అదనపు కేలరీలు:

  • పాలిచ్చే తల్లులకు రోజుకు అదనంగా 500 కేలరీలు అవసరం.
  • కవల పిల్లలు ఉంటే, రోజుకు అదనంగా 600-1000 కేలరీలు తీసుకోవాలి.
  • మొత్తంగా తల్లి పాలిచ్చేటప్పుడు రోజుకు 2300–2500 కేలరీలు తీసుకోవాలి. కవలలు ఉంటే 2600–3000 కేలరీలు అవసరం. ఇది మీ శరీరం పరిమాణం, మరియు మీరు చేసే పనిని బట్టి మారవచ్చు.

3. నీరు త్రాగాలి:

కెఫిన్ లేని ద్రవాలు ఎక్కువగా తాగాలి.

రోజుకు కనీసం 2–3 లీటర్ల నీరు క్రమం తప్పకుండా తీసుకోవాలి.

4. కాల్షియం ముఖ్యం:

  • తల్లి పాలిచ్చే సమయంలో శరీరానికి కావలసిన కాల్షియం కోసం రోజుకు 700 మిల్లీలీటర్ల వరకు పాలు లేదా పాల పదార్థాలు తీసుకోవాలి.
  • సాధారణంగా రోజుకు 700–800 మి.గ్రా కాల్షియం అవసరం, కానీ తల్లి పాలిచ్చేటప్పుడు ఇది 1,250 మి.గ్రా వరకు పెరుగుతుంది.

5. కొద్దిగా, తరచుగా తినండి:

  • రోజుకు మూడు సార్లు అన్నం తినడానికి బదులుగా, ఆరు సార్లు చిన్న భోజనాలు అంటే ఇవి స్నాక్స్ వంటి ఆరోగ్యరమైన ఆహారాలను తీసుకోవడం మంచిది.)
  • ఏ భోజనాన్ని కూడా మానవద్దు.

6. కూరగాయలు తప్పనిసరి:

  • రోజుకు 3-4 సార్లు కూరగాయలు తినాలి.
  • ఆకుకూరలు (సలాడ్ల రూపంలో లేదా వండినవి) తప్పకుండా ఉండాలి.

7. పండ్లు కూడా ముఖ్యమే:

  • రోజుకు 4-5 సార్లు పండ్లు తీసుకోండి. వీటిలో ఫైబర్, పోషకాలు ఎక్కువగా ఉండాలి.
  • అధిక క్యాలరీలు ఉండే అరటిపండ్లు, జాక్ ఫ్రూట్స్, సీతాఫలం, చికూ వంటి పండ్లను తక్కువగా తినండి.

8. మసాలా, ఉప్పు, చక్కెరను తగ్గించండి:

  • ఆహారాల్లో ఉప్పును అదనంగా వేసుకోవద్దు. నిల్వ చేసిన, రెడీమేడ్ ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండండి.
  • చక్కెర రోజుకు 3 టీస్పూన్లకు మించి తీసుకోకూడదు. తీపి కోసం చక్కెర బదులు బెల్లం వాడండి. బేకరీ ఆహారాలు తగ్గించండి.
  • తక్కువ మసాలా ఆహారం తినడం వల్ల గుండెల్లో మంట రాదు. డీప్ ఫ్రై చేసిన, నూనెలో చేసిన ఆహారాలను ఇంట్లో కూడా తగ్గించండి.

9. నెయ్యిని తక్కువగా వాడండి:

  • నెయ్యి, నెయ్యితో చేసిన లడ్డూలు వంటి వాటిని కూడా తక్కువగానే తినాలి.
  • నెయ్యిని కేవలం రుచి కోసం కొద్దిగా వాడండి.

10. కొబ్బరి వద్దు:

  • వంటల్లో కొబ్బరి వాడకూడదు.
  • పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి రెండింటినీ వంటల్లో ఉపయోగించవద్దు.

11. ఏం తినాలి, ఏం తినకూడదు (మాంసం):

  • గుడ్డులోని పచ్చసొన, రొయ్యలు, పీతలు, కాలేయం వంటి వాటిని తినవద్దు.
  • చికెన్, చేపలు, గుడ్డులోని తెల్లసొనను తినవచ్చు. వీటిని కాల్చి, ఉడకబెట్టిన లేదా కూర రూపంలో మాత్రమే తినాలి.

12. రాత్రి భోజనం నియమాలు:

  • రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోవద్దు.
  • రాత్రి భోజనానికి, నిద్రకు మధ్య కనీసం 2 గంటల గ్యాప్ ఉండాలి.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.