రక్తం నుంచి వ్యర్థాలను ఫిల్టర్ చేసే మూత్రపిండాలు (కిడ్నీలు) శరీరంలో ఓ ముఖ్యమైన భాగం. ఆ వ్యర్థాలు ద్రవరూపంలో బయటికి వచ్చేలా కిడ్నీలు చేస్తాయి. శరీరంలో ఇంతటి కీలకమైన పనిని చేస్తాయి. అందుకే కిడ్నీల్లో ఏదైనా సమస్య ఉంటే ఓవరాల్ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఇటీవలి కాలంలో కిడ్నీల సమస్యలు చాలా మందిలో పెరుగుతున్నాయి. అందుకే వీటిపై శ్రద్ధ వహించాలి. కిడ్నీల ఆరోగ్యాన్ని, పనితీరును మెరుగుపరిచే మూడు రకాల యోగాసనాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
ఈ కపాలభాతి ప్రాణాయామం ఆసనం వల్ల శరీరంలో వెచ్చదనం పెరుగుతుంది. దీంతో వ్యర్థాలు సులభంగా బయటికి వెళ్లేందుకు తోడ్పడుతుంది. ఇది మూత్రపిండాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. కిడ్నీలతో పాటు కాలేయానికి కూడా మేలు చేస్తుంది. జీర్ణవ్యవస్థ, జీవక్రియలు, కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది.
పశ్చిమోత్తానాసనం వేయడం వల్ల కిడ్నీలు, కాలేయం ప్రేరణ చెందుతాయి. వారి పనితీరు మెరుగవుతుంది. జీర్ణక్రియకు మేలు జరుగుతుంది. కడుపు, కటి అవయవాలకు మేలు జరుగుతుంది. ఈ ఆసనం వల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.
ధనూరాసనం వల్ల జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. కిడ్నీలు, కాలేయం మెరుగ్గా పని చేసేలా తోడ్పడుతుంది. డయాబెటిస్తో బాధపడే వారికి కూడా ఈ ఆసనం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఆసనం వేయడం వల్ల శరీర ఫ్లెక్సిబులిటీ బాగా పెరుగుతుంది. ఈ ఆసనంలో శరీరాన్ని విల్లులా వంచాలి. అందుకే దీనికి ధనూరాసనం అనే పేరొచ్చింది.