NNS 19th February Episode: అమర్ ఇంట్లో అడుగుపెట్టిన అనామిక.. షాక్‌లో మనోహరి.. అరుంధతికి గతం గుర్తొచ్చేసిందా?-zee telugu serial nindu noorella saavasam today 19th february episode nns serial today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns 19th February Episode: అమర్ ఇంట్లో అడుగుపెట్టిన అనామిక.. షాక్‌లో మనోహరి.. అరుంధతికి గతం గుర్తొచ్చేసిందా?

NNS 19th February Episode: అమర్ ఇంట్లో అడుగుపెట్టిన అనామిక.. షాక్‌లో మనోహరి.. అరుంధతికి గతం గుర్తొచ్చేసిందా?

Hari Prasad S HT Telugu

NNS 19th February Episode: నిండు నూరేళ్ల సావాసం బుధవారం (ఫిబ్రవరి 19) ఎపిసోడ్లో అమర్ ఇంటికి వస్తుంది అనామిక. ఆమె చూసి మనోహరి షాక్ తింటుంది. మరి అనామికలోని అరుంధతికి గత గుర్తుకొస్తుందా?

అమర్ ఇంట్లో అడుగుపెట్టిన అనామిక.. షాక్‌లో మనోహరి.. అరుంధతికి గతం గుర్తొచ్చేసిందా?

NNS 19th February Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఫిబ్రవరి 19) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అరుంధతి ఆత్మ మానవ శరీరంలోకి వెళ్లిందని, ఆమె తనను వెతుక్కుంటూ వస్తుందని స్వామీజీ చెప్పిన మాటలతో మనోహరి భయంతో కుప్పకూలుతుంది. అటు గుడిలో అమర్ కుటుంబంతో పూర్తిగా కలిసిపోతుంది అనామిక.

మనోహరిలో వణుకు

ఇంట్లో అరుంధతి ఆత్మ ఉందో లేదో తెలుసుకోవడానికి స్వామీజీని రప్పించిన మనోహరికి నమ్మలేని నిజం తెలుస్తుంది. అరుంధతి ఆత్మ అప్పటికే మానవ శరీరంలోకి వెళ్లిపోయిందని, తనను వెతుక్కుంటూ ఆమె వస్తోందని, ఆమెకు దారి ఇవ్వడం తప్ప ఇప్పుడేమీ చేసేది లేదని మనోహరికి చెబుతాడు.

ఆమెకు సంబంధించిన వస్తువులు ఏవి ముట్టుకున్నా ఆమెకు గతం గుర్తుకు వస్తుందని, ముఖ్యంగా ఆమె తాళిని ముట్టుకోకుండా చూసుకోవాలని చెప్పి వెళ్లిపోతాడు స్వామీజీ. అది విని మనోహరి కుప్పకూలిపోతుంది. భయంతో వణికిపోతుంది. తనను వెతుక్కుంటూ వచ్చే ఆ వ్యక్తి ఎవరో అన్న ఆందోళన ఆమెలో మొదలవుతుంది.

అమర్ కుటుంబంతో కలిసిపోయిన అనామిక

అటు శివరాత్రి సందర్భంగా గుడికి వెళ్లిన అమర్ కుటుంబాన్ని అనుకోకుండా కలిసిన అనామిక.. తర్వాత వాళ్లతోనే కలిసి అభిషేకం చేయించి ఫ్యామిలీలో కలిసిపోతుంది. ఆ తర్వాత పడిపోతున్న దేవుడి విగ్రహాన్ని పట్టుకున్న భాగీకి సాయం చేసి ఆ కుటుంబానికి మరింత దగ్గరవుతుంది. ఆ దేవుడే ఆమెను తమ కుటుంబం దగ్గరికి పంపించాడేమో అని అమర్ ఫ్యామిలీ ఫీలవుతుంది.

అమర్ ఇంటికి అనామిక

గుడి నుంచి నేరుగా అమర్ ఇంటికే వెళ్తుంది అనామిక. గుడిలోనే తమ కుటుంబంలో ఒకరిగా కలిసిపోయిన ఆమెను.. అందరూ కలిసి తమ ఇంటికి తీసుకెళ్తారు. అనామిక కారులో నుంచి దిగడం చూసి మనోహరి షాక్ తింటుంది. ఆమెను చూడగానే అచ్చూ అరుంధతిని చూసిన భావన మనోకి కలుగుతుంది. స్వామీజీ చెప్పిన విషయం గుర్తుకు వచ్చి మరింత భయపడుతుంది.

అనామిక నేరుగా మనోహరి దగ్గరికే వస్తుంది. ఆమెను షాక్ కు గురవుతూ అలాగే చూస్తున్న మనోహరికి అంజు పరిచయం చేస్తుంది. ఈమె అనామిక అంటూ మనోహరికి.. ఈమె మా మనోహరి ఆంటీ అంటూ అనామికకు పరిచయం చేస్తుంది. ఆమెతో చేయి కలపగానే మనోహరి మరింత వణికిపోతుంది. అరుంధతి ఆత్మ తనను బెదిరించిన గతమంతా గుర్తుకు వస్తుంది.

ఆ తర్వాత అందరూ కలిసి లోనికి వెళ్తారు. అనామిక కూడా అమర్ ఇంట్లోకి అడుగుపెట్టడానికి వెళ్తుంది. ఇంటి తలుపును తాకగానే అనామికకు గతమంతా గుర్తుకువచ్చినట్లుగా ఆగిపోతుంది. మరి అనామికలోని అరుంధతికి గతం గుర్తుకు వస్తుందా? ఆమె మనోహరిని, మిగిలిన వాళ్లను గుర్తు పడుతుందా? అన్నది తెలియాలంటే బుధవారం (ఫిబ్రవరి 19) ప్రసారమయ్యే నిండు నూరేళ్ల సావాసం 494వ ఎపిసోడ్ చూడాల్సిందే.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం