రెండ్రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు- ఇవాళ యమదొంగ రీ రిలీజ్- ఎన్నడు లేని విధంగా 8Kలో స్కాన్ చేసి 4Kకి కుదించి!-yamadonga movie re release today in 4k technology scanned from 8k two days before of jr ntr birthday on may 20 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  రెండ్రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు- ఇవాళ యమదొంగ రీ రిలీజ్- ఎన్నడు లేని విధంగా 8kలో స్కాన్ చేసి 4kకి కుదించి!

రెండ్రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు- ఇవాళ యమదొంగ రీ రిలీజ్- ఎన్నడు లేని విధంగా 8Kలో స్కాన్ చేసి 4Kకి కుదించి!

Sanjiv Kumar HT Telugu

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మరో రెండ్రోజుల్లో రానుంది. ఈ సందర్భంగా నేటి నుంచే తారక్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ (మే 18) యమదొంగ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా 8కెలో స్కాన్ చేసి 4కెకి కుదించి మరి విడుదల చేస్తున్నారు.

రెండ్రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు- ఇవాళ యమదొంగ రీ రిలీజ్- ఎన్నడు లేని విధంగా 8Kలో స్కాన్ చేసి 4Kకి కుదించి!

మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్-ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా యమదొంగ. 2007 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ సాధించిందో తెలిసిందే. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్‌కు హీరోయిన్ ప్రియమణి జోడీగా నటించింది.

రంభతో స్పెషల్ సాంగ్

మరో హీరోయిన్‌గా బ్యూటిఫుల్ మమతా మోహన్‌దాస్ అలరించింది. అంతేకాకుండా స్పెషల్ సాంగ్‌లో సీనియర్ హీరోయిన్ రంభ అలరించింది. వీరితోపాటు నవ్‌నీత్ కౌర్, అర్చన, ప్రీతి జంగ్యాని వంటి బ్యూటిఫుల్స్ మరో పాటలో నర్తించి ఆకట్టుకున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు యముడు పాత్రలో అదరగొట్టారు. యముడికి భార్యగా సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సైతం అలరించారు.

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా

ఇలా ఎంతోమంది విశేష నటీనటులతో యమదొంగ సినిమాను చిత్రీకరించారు. 2007 ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదలైన యమదొంగ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ యమదొంగ సినిమాను జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నారు. మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు.

8Kలో స్కాన్ చేసి 4Kకి కుదించి

ఈ సందర్భంగా తారక్ పుట్టినరోజు వేడుకలు, సంబురాలను కొన్ని రోజుల ముందు నుంచే ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఇవాళ (మే 18) యమదొంగ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ రీ రిలీజ్ కోసం మూవీ టీమ్ చాలానే కష్టపడింది. యమదొంగ సినిమాను 8Kలో స్కాన్ చేసి 4Kకి కుదించి మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన దృశ్య అనుభవాన్ని కలిగించేలా రెడీ చేశారు.

మరింత నాణ్యతతో

అభిమానులు ఇప్పుడు ఈ సినిమాటిక్ అద్భుతాన్ని మరింత నాణ్యతతో థియేటర్లలో వీక్షించవచ్చు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో ‘యమదొంగ’ రీ రిలీజ్‌ను మరింత స్పెషల్‌గా మార్చారు. దీంతో ప్రస్తుతం ‘యమదొంగ’ రీ రిలీజ్ సందడి సోషల్ మీడియాలో బాగానే కనిపిస్తూ ఉంది.

షూటింగ్ చేసిన రోజులను

యమదొంగ రీ రిలీజ్‌లో భాగంగా ప్రధాన నటీమణులు ప్రియమణి, మమతా మోహన్‌దాస్ ఇటీవల తమ ఆలోచనలను, షూటింగ్ చేసిన రోజుల్ని తలుచుకుంటూ, ఆ జ్ఞాపకాలను పంచుకుంటూ వదిలిన వీడియోలు అందరినీ ఆకట్టుకున్నాయి.

మరోసారి తెరపై

‘యమదొంగ’ రీ రిలీజ్‌తో రాజమౌళి విజన్, ఎంఎం కీరవాణి సంగీతాన్ని మరోసారి తెరపై అందరూ వీక్షించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ‘యమదొంగ’ మూవీని భారీ ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం