వామ్మో.. మహేష్ బాబు కంటే రాజమౌళికే ఎక్కువ రెమ్యూనేషన్.. ఎస్ఎస్ఎంబీ 29 మూవీకి ఎన్ని కోట్లో తెలుసా?-what is the remuneration for ss rajamouli for ssmb 29 more than mahesh babu details will leave you in shock ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  వామ్మో.. మహేష్ బాబు కంటే రాజమౌళికే ఎక్కువ రెమ్యూనేషన్.. ఎస్ఎస్ఎంబీ 29 మూవీకి ఎన్ని కోట్లో తెలుసా?

వామ్మో.. మహేష్ బాబు కంటే రాజమౌళికే ఎక్కువ రెమ్యూనేషన్.. ఎస్ఎస్ఎంబీ 29 మూవీకి ఎన్ని కోట్లో తెలుసా?

బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో గ్లోబల్ ట్రెండ్ సెట్ చేసిన ఎస్ఎస్ రాజమౌళి.. ఇప్పుడు మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నారు. అయితే ఈ మూవీ కోసం రాజమౌళి తీసుకుంటున్న రెమ్యూనేషన్ చూస్తే వామ్మో అనాల్సిందే. హీరో కంటే ఎక్కువ డబ్బు తీసుకుంటున్నారని సమాచారం.

డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (x)

ఎస్ఎస్ఎంబీ 29.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ ఇదే. ఇప్పుడు సినీ ఫీల్డ్ లో ఈ మూవీ గురించే బజ్ ఎక్కువగా వినిపిస్తోంది. ఈ మూవీ కోసం రాజమౌళి తీసుకుంటున్న రెమ్యూనేషన్ కూడా హాట్ టాపిక్ గా మారింది. గ్లోబల్ సెన్సేషన్ గా మారిన రాజమౌళి ఈ మూవీ కోసం హీరో మహేష్ బాబు కంటే ఎక్కువ పేమెంట్ తీసుకుంటున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

అన్ని కోట్లా?

బాహుబలితో ప్రపంచ బాక్సాఫీస్ ను షేక్ చేసి.. తెలుగు సినిమా స్థాయిని గ్లోబల్ రేంజ్ కు పెంచారు రాజమౌళి. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ తోనూ అదరగొట్టారు. ఈ సూపర్ హిట్ సినిమాలతో రాజమౌళి రెమ్యూనేషన్ అమాంతం పెరిగిపోయిందని టాక్. ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 29 మూవీకి ఆయన రూ.200 కోట్లు పేమెంట్ గా అందుకుంటున్నారని టాక్. ఈ రెమ్యూనేషన్ తో ఇండియాలోనే అత్యధిక మొత్తం అందుకుంటున్న డైరెక్టర్ గా రాజమౌళి నిలిచారు.

మరోవైపు సినిమా లాభాల్లోనూ రాజమౌళికి షేర్ దక్కే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక హీరో మహేష్ బాబు ఏమో ఈ మూవీకి అసలు రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని, ప్రాఫిట్ లో 35 శాతం వరకూ షేర్ తీసుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

బడ్జెట్ 1000 కోట్లు

ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా రెడీ అవుతున్న ఎస్ఎస్ఎంబీ 29 మూవీని రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ ఒరిస్సాలో షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఫ్యామిలీ వెకేషన్ తర్వాత మళ్లీ ఈ సినిమా షూటింగ్ కోసం మహేష్ బాబు రంగంలోకి దిగారు. హైదరాబాద్ లో లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు.

స్పెషల్ గా వేసిన సెట్లో నెల రోజుల పాటు షూటింగ్ జరిగే అవకాశముంది. సుమారు 3000కు పైగా జూనియర్ ఆర్టిస్ట్ లతో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నట్లు టాక్.

రిలీజ్ కు ప్లాన్

రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీని 2027 సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఈ మూవీతో ఊహకు అందని విధంగా కలెక్షన్లు రావడం ఖాయమని మహేష్ బాబు ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.

ఈ మూవీకి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం