Vijayashanthi: మంచి పద్ధతి కాదు.. చీప్ పనులు మానుకోండి: వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విజయశాంతి-vijayashanthi gives warning to who spreading negativity on arjun son of vyjayanthi movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijayashanthi: మంచి పద్ధతి కాదు.. చీప్ పనులు మానుకోండి: వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విజయశాంతి

Vijayashanthi: మంచి పద్ధతి కాదు.. చీప్ పనులు మానుకోండి: వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విజయశాంతి

Vijayashanthi - Arjun Son of Vyjayanthi: అర్జున్ సన్నాఫ్ వైజయంతీ సినిమా సక్సెస్ మీట్ జరిగింది. ఈ మీట్‍లో సీరియస్‍గా మాట్లాడారు విజయశాంతి. కొందరికి వార్నింగ్ కూడా ఇచ్చేశారు.

Vijayashanthi: మంచి పద్ధతి కాదు.. చీప్ పనులు మానుకోండి: వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విజయశాంతి

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ఈ శుక్రవారం ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైంది. యాక్షన్, మదర్ సెంటిమెంట్‍తో ఉన్న ఈ చిత్రం మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సీనియర్ నటి విజయశాంతి ఈ మూవీలో హీరో తల్లిపాత్ర పోషించారు. పవర్‌ఫుల్ రోల్ చేశారు. అయితే, ఈ మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా సక్సెస్ మీట్ నేడు (ఏప్రిల్ 19) జరిగింది. ఈ ఈవెెంట్‍లో విజయశాంతి మాట్లాడారు.

మైండ్‍సెట్ మార్చుకోండి

అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాపై నెగెటివ్ ప్రచారం చేస్తున్న వారిపై విజయశాంత్ ఫైర్ అయ్యారు. ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. ఈ మూవీని కావాలనే కొందరు డిస్ట్రబ్ చేసేందుకు చూస్తున్నారని చెప్పారు. ఏ సినిమానైనా కష్టపడి చేస్తారని, కావాలని నెగెటివిటీ వ్యాప్తి చేయడం కరెక్ట్ కాదని అన్నారు. బాగున్నా సినిమాను బాగాలేదని ప్రచారం చేసే వారు మైండ్‍సెట్ మార్చుకోవాలని విజయశాంతి సూచించారు.

వారికి ఇదే నా వార్నింగ్

సినిమాపై కావాలనే నెగెటివ్ ప్రచారం చేస్తున్న వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు విజయశాంతి. “సినిమా మీకు నచ్చలేదా.. చూడొద్దు. అంతేకాని సినిమాను ఖూనీ చేద్దామని ప్రయత్నిస్తారే.. వారికి నేను వార్నింగ్ ఇస్తున్నా. దయచేసి ఆపండి ఇక. ఏ రూపంలోనైనా వస్తున్నారు. డిస్ట్రబ్ చేస్తున్నారు. పైశాచిక ఆనందం పొందొద్దు. మీకు ఎవరికైనా ఎక్కిస్తూ మైండ్‍‍వాష్ చేస్తుంటే వారి దగ్గర చెంచాలు కొట్టుకోండి. కానీ సినిమాను నాశనం చేసేందుకు చూడొచ్చు. ఇది మంచి పద్ధతి కాదు” అని విజయశాంతి అన్నారు.

చీప్ పనులు మానుకోండి

తాము దశాబ్దాలుగా ఎంతో నెగెటివిటీ తట్టుకొని నిలబడ్డామని, కానీ ఎన్నో ఆశలతో వచ్చే ఈ తరం నటీనటులు, దర్శకనిర్మాతల జీవితాలపై ఎఫెక్ట్ పడుతుందని విజయశాంతి అన్నారు. సినిమాలను నాశనం చేద్దామననుకుంటున్న వారిని జీవితంలో క్షమించకూడదని, చీప్ పనులు మానుకోండి అని విజయశాంతి అన్నారు. అందరు హీరోలు, నిర్మాతలు, దర్శకులు బాగుండాలని తాను అనుకుంటానని చెప్పారు.

ప్రేక్షకుల నుంచి అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాకు చాలా మంచి స్పందన వస్తోందని, గ్రాఫ్ పెరుగుతూనే ఉందని విజయశాంతి అన్నారు. మహిళలు కూడా చిత్రం చూస్తూ బాగుందని అంటున్నారని చెప్పారు.

భయమేసింది కానీ..

అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాకు కలెక్షన్లు బాగా వస్తున్నాయని హీరో కల్యాణ్ రామ్ అన్నారు. బుధవారం కల్లా బ్రేక్ఈవెన్ అవుతుందని చెప్పారు. ఈ సినిమాతో ఇండస్ట్రీకి కొత్త తరహా క్లైమాక్స్ పరిచయం చేశామని అన్నారు. “కొంచెం తగ్గుతోంది. థియేటర్లు ఖాళీ అవుతున్నాయనే వింటే కాస్త భయమేసింది. కానీ మంచి సినిమా అందజేస్తే మమ్మల్ని ఆదరించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు అందరూ ఉన్నారని కచ్చితంగా ఆదరిస్తారని ఉన్నారని మళ్లీ ప్రూవ్ చేశారు. చాలా సంతోషంగా ఉన్నా. మంగళవారం, బుధవారంలోపు బ్రేక్ఈవెన్ అవుతుందని నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లు చెప్పారు” అని కల్యాణ్ రామ్ అన్నారు.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక ఆర్ట్స్ ప్రొడ్యూజ్ చేసిన ఈ మూవీకి అజ్నీశ్ లోకనాథ్ మ్యూజిక్ ఇచ్చారు. సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, సోహెల్ ఖాన్, పృథ్విరాజ్ కీలకపాత్రలు పోషించారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం